రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సిద్ధమవుతున్న వేళ మాస్కో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో కుదుర్చుకున్న సైనిక సహకార ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్లో ఆమోదించేందుకు రంగం సిద్ధమైంది. పుతిన్ పర్యటనకు కొన్ని రోజుల ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. మాస్కోలో జరిగిన కార్యక్రమంలో రష్యా రక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్, ఆ దేశంలో భారత రాయబారి వినయ్ కుమార్లు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇప్పుడు దీనికి చట్టబద్ధత కల్పిస్తూ రష్యా పార్లమెంట్ ఆమోదముద్ర వేయనుంది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక బంధం మరింత బలోపేతం కానుంది.


