చమురు రవాణా కు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలాహాదారుడు మోహ్సేన్ రెజాయి అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే, తమ తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలు మునిగిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్కు రక్షక భటుడిగా మారాలనుకుంటున్నారని,
నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రియా ఛాన్సలర్ డాక్టర్ క్రిస్టియన్ స్టాకర్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీ తో ఆస్ట్రియా ఛాన్సలర్ సమావేశమైయ్యారు. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నాయి.ముఖ్యంగా రక్షణ, సెమీకండక్టర్లు, క్వాంటం, బయోటెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఇండియా-ఆస్ట్రియా వర్కింగ్ హాలిడే ప్రోగ్రామ్ ను
మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దు అని ప్రధాని మోదీ అన్నారు. లోక్సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ పార్టీకి అనుకూలం కాదు అన్నారు. దానికి రాజకీయ రంగు పూయవద్దు అన్నారు. ఎవరు బాధ్యులైనా, ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆలస్యం చేశామన్నారు. ఈ బిల్లులను తీసుకువచ్చిన సక్సెస్ ట్రెజరీ బెంచ్లకు కానీ, మోదీకి కానీ
లోక్సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత ఏపీలో
రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడారు. తన ప్రసంగంలో విపక్షాలను ఆయన తప్పుపట్టారు. బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు వ్యవస్థీకృత ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాయిదా రాజకీయాలను మోదీ సర్కారు ప్రోత్సహించదన్నారు. దక్షిణాది రాష్ట్రాలను విపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయని, జనాభాను నియంత్రించిన దక్షిణాదితో పాటు చిన్న రాష్ట్రాలకు మోదీ సర్కారు అందించే
బీహార్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు సమ్రాట్ చౌదరి (ఏప్రిల్ 15) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు చౌదరితో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. నితీష్ కుమార్ సిఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత, సమ్రాట్ చౌదరి బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు. బీహార్లో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సమ్రాట్ చౌదరి పేరును
హోర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్భందించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా రియాక్ట్ అయ్యింది. ఇరానీ నౌకాశ్రయాలను మూసివేయడం ప్రమాదకరమని, బాధ్యతారాహితం అవుతుందని చైనా పేర్కొన్నది. నౌకలను అడ్డుకోవడం వల్ల పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని చైనా విదేశాంగ కార్యాలయ ప్రతినిధి గూవో జియాకున్ తెలిపారు. రెండు వర్గాలు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయని, జలసంధి వద్ద అమెరికా తన బలగాల సంఖ్యను పెంచుతోందని, టార్గెట్ చేసి నౌకలను బ్లాక్ చేస్తున్నదని,
కాంగ్రెస్ ప్రభుత్వం డీలిమేషన్ ను వ్యతిరేకించడం దారుణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. డీలిమేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని అన్నారు. ఈ సందర్భంగా డీలిమేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను బంట్రోతు ఉద్యోగం చేస్తానని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ బంట్రోతులుగా చూసిందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అద్దాల మేడలో కూర్చోని ఇతరులపై రాళ్లు విసురుతున్నారని, అనేక
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్భవన్ చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. నితీశ్కుమార్ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజీనామాను సమర్పించడానికి ముందు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని చివరిసారిగా ఏర్పాటుచేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్న విషయాన్ని కేబినెట్కు తెలియజేశారు. నితీశ్కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలు కొనసాగారు. ఇటీవల ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి జేపీ నద్దా ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. తమిళ నూతన సంవత్సరం కావడం విశేషం. ఈ సందర్భంగా పార్ట మేనిఫెస్టో విడుదల చేయడం మంచి పరిణామం అని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, బీజేపీ నేతలు కే అన్నామలై, తమిళిసై సౌందరరాజన్
ఇరాన్తోపాటు లెబనాన్పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కు ఇటలీ షాకిచ్చింది. ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దీనిపై ప్రకటన చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం పొడిగింపును రద్దు చేసుకుంటూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని జార్జియా మెలోని ప్రకటించారు. వెరోనాలో జరిగిన ఒక కార్యక్రమంలో జార్జియా ఈ ప్రకటన
ఈ ఏడాది జూన్లో మహిళల టీ20 వరల్డ్కప్ జరగనున్నది. దీని కోసం ఐసీసీ ప్రైజ్మనీ ప్రకటించింది. వరల్డ్కప్లో విజేతలకు అందజేసే ప్రైజ్మనీని రికార్డు స్థాయిలో పెంచేసింది. రెండు నెలల పాటు ఇంగ్లండ్, వేల్స్లో జరిగే వరల్డ్కప్ కోసం సుమారు 82 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది ఐసీసీ. గత ఎడిషన్తో పోలిస్తే సుమారు 10 శాతం ప్రైజ్మనీ పెంచారు. ఈసారి ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. 2024లో కేవలం
హంగేరి విపక్ష నేత పీటర్ మాగ్యార్ స్టన్నింగ్ విక్టరీ కొట్టారు. పార్లమెంటరీ ఎన్నికల్లో మాగ్యార్కు చెందిన టిజా పార్టీ అనూహ విజయాన్ని సాధించింది. 16 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న విక్టర్ ఓర్బాన్ షాకింగ్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మాగ్యార్కు ఫోన్ చేసిన ఓర్బాన్, విక్టరీ విషెస్ తెలిపారు. ఆదివారం రాత్రి వరకు 98 శాతం ఓట్లను లెక్కించారు. దాంట్లో టిజా పార్టీకి 53.72 శాతం ఓట్లు పోలయ్యాయి. ఫిడేజ్ పార్టీకి
హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న వేళ, ఇరాన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా అలాంటి చర్యలకు దిగితే, తాము కూడా పర్షియన్ గల్ఫ్ తీరంలోని పోర్టులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది. పర్షియన్ (అరేబియన్) గల్ఫ్, ఒమన్ సముద్ర తీరంలో భద్రత ఉంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికీ ఉండకూడదని పేర్కొంది. ప్రాంతీయ సముద్ర జలాల్లో రక్షణ అందరికీ ఒకేలా ఉండాలని అభిప్రాయపడింది. హార్ముజ్ను అమెరికా దిగ్బంధిస్తే గల్ఫ్ తీరంలోని
భవానీపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించడానికి బీజేపీ ప్రయత్నించిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. తనపై తప్పుడు కేసులు పెట్టడానికి ఆ పార్టీ నేతలు ఈసీతో కలిసి కుట్ర పన్నారని అన్నారు. ఈ ప్రయత్నాలను తమ పార్టీ నేతలు భగ్నం చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక, మోసపూరిత మార్గాల్లో ఓట్లు రాబట్టుకోవడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. అందుకే సర్ పేరుతో వేల సంఖ్యలో ఓటర్ల పేర్లను
పార్లమెంట్ ఆవరణలో ఇవాళ అరుదైన దృశ్యం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ప్రధాని మోదీ కాసేపు మాట్లాడారు. కారు నుంచి దిగి వెళ్తున్న మోదీ కాసేపు ఆగి రాహుల్తో ముచ్చటించారు. చాలా దగ్గర నిలుచుకున్న ఆ ఇద్దరూ ఓ నిమిషం పాటు మాట్లాడుకున్నారు. పార్లమెంట్లో ఎప్పుడూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఆ మీటింగ్ పట్ల ఆసక్తి కనబరిచారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న ప్రేరణ
జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో ఆయన జడ్జీగా ఉన్నారు. అవినీతి ఆరోపణ కేసులో ఆయనపై అభిశంసన ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. జడ్జీ హోదా నుంచి ఆయన్ను తప్పించేందకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. గత ఏడాది ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి భారీ ఎత్తున
బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో హిందీ భాషలో నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జేడీయూ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా,
అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం, కేరళంలో 75.01 శాతం పోలింగ్ నమోదు అయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోం (126), కేరళం (140), పుదుచ్చేరి (30) లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు
అమెరికా,ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో పాకిస్థాన్ పాత్రపై ఇజ్రాయెల్ సందేహం వ్యక్తంచేసింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ను తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాక్ మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నదని తాము భావిస్తున్నట్లు అజార్ తెలిపారు. ఈ సందర్భంగా ఖతార్, తుర్కియే వంటి సమస్యాత్మక దేశాల
హర్మూజ్ జలసంధి లో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్రం అత్యవసర అడ్వయిజరీ జారీచేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా నౌకల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటన విడుదలచేసింది. భద్రతాకారణాల దృష్ట్యా ఇరాన్ దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన భారత నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఎప్పటికప్పుడు భారత
చత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2003 నాటి హత్య కేసులో తాజాగా తీర్పు వెల్లడించింది. సీనియర్ ఎన్సీపీ లీడర్ అయిన రామావతార్ జగ్గి జూన్ 4, 2003న హత్యకు గురయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దుండుగులు అతడిని కాల్చి చంపారు. జగ్గితోపాటు పక్కనే ఉన్న ఆయన ప్రధాన అనుచరుడు విద్యాచరణ్ శుక్లా కూడా ఈ
యుద్ధం వేళ వరుసగా దేశ అగ్రనేతల్ని కోల్పోతున్న ఇరాన్కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైన్యం అయిన ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న మాజిద్ ఖదేమీ మరణించాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై సోమవారం అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో మాజిద్ ఖదేమి మరణించినట్లు ఇరాన్ పేర్కొంది. కొద్దిసేపటి క్రితం ఐఆర్జీసీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఐఆర్జీసీలోని ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహించిన మేజర్ జనరల్ మాజిద్ ఖదేమి
పశ్చిమాసియా సంక్షోభాన్ని ఆపేందుకు ఈజిప్ట్, పాకిస్థాన్, టర్కీ దేశాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడిని ఆపేందుకు ఆ దేశాలు ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ప్లాన్ను రెఢీ చేసినట్లు భావిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి రీఓపెనింగ్ అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధానికి బ్రేక్ వేయాలంటే,
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇండియా చమురు కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాకు మరింత చమురు సరఫరా చేయాలని రష్యా నిర్ణయించింది. ఆయిల్, లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) సరఫరాను పెంచబోతున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా మొదటి డిప్యూటీ ఛైర్మన్ డెనిస్ మాంటురోవ్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా చమురు సరఫరాపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ విమానాన్ని కూల్చినట్లు ఇరాన్ పేర్కొన్నది. సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఆ విమానం కూలినట్లు తెలుస్తోంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ దీనిపై ప్రకటన చేసింది. పైలెట్ తీవ్రంగా గాయపడి ఉంటాడని, అతను బ్రతికి ఉండే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఎఫ్-35 విమానాన్ని ఇరాన్ కూల్చడం ఇది రెండో సారి అవుతుంది. అయితే అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ మాత్రం దీనిపై ప్రకటన చేయలేదు. ఇప్పటికే అమెరికా
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన బొమ్మ భారీ ధర పలికింది. యశోద, కృష్ణుడు ఉన్న ఫోటో సుమారు 167 కోట్లకు అమ్ముడుపోయింది. భారతీయ ఆర్ట్వర్క్ ఆ ధరకు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. వేలంలో కొత్త వరల్డ్ రికార్డు స్థాపించినట్లు చెబుతున్నారు. రవివర్మ గీసిన ఆయిల్ పెయింటింగ్ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థాపకుడు డాక్టర్ సైరస్ ఎస్ పూనావాలా సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన జరిగిన ఆర్ట్స్
మాల్దా జిల్లాలో సర్ విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆ అధికారుల నిర్బంధం గురించి తనకు తెలియదని, ప్రస్తుతం బెంగాల్ పాలన తన చేతుల్లో లేదని చెప్పారు. కాగా ఈ నెలలో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారుల నిర్బంధం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. సాగర్దిఘిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ
బట్టమేక పిట్ట అనేది అరుదైన పక్షి. దీని సంతతి చాలా అరుదుగా వృద్ధి చెందుతుంది. దీనినే గోదావన్గా కూడా వ్యవహరిస్తుంటారు. గుజరాత్లో పదేండ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 26న ఈ పక్షి పిల్ల జన్మించింది. అంతరించిపోయే జాతిలో ఉన్న దీనిని రక్షించడం అటవీ శాఖకు పెద్ద పరీక్షగా మారింది. దీంతో ఆ శాఖ దీని రక్షణ కోసం 50 మంది గార్డులను ఏర్పాటు చేసింది. దాంతో వారు మూడు
భారత్పై నిరంతరం కుట్రలకు తెరతీసే పాకిస్తాన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. కేరళలో జరిగిన సైనిక్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఇండియా కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని, ఇండియాపై పాకిస్తాన్ ఎలాంటి కుట్రలకు తెరతీసినా,
పశ్చిమాసియా లో యుద్ధం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఇటీవల అమెరికా ప్రకటించింది. దాంతో ఇరాన్ చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఇరాన్ నుంచి ఓ ఆయిల్ ట్యాంకర్ భారత్ వైపు బయల్దేరింది. మార్చి 4న ఖర్గ్ ద్వీపం వద్ద ట్యాంక్లోకి చమురు లోడింగ్ చేశారని, ఏప్రిల్ 4న గుజరాత్ లోని వాడినార్ పోర్టుకు ఇది
పశ్చిమాసియా యుద్ధంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే మళ్లీ దాడులు జరగవని విశ్వసనీయమైన హామీలు ఇస్తేనే ఇది సాధ్యం అని పేర్కొన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఫోన్ సంభాషణలో మాట్లాడుతూ భవిష్యత్తు దాడుల నుంచి రక్షణ కల్పించే చర్యలు ఏ తీర్మానంలోనైనా తప్పనిసరిగా ఉండాలని పెజెష్కియన్ డిమాండ్ చేశారు. భవిష్యత్లో దురాక్రమణ
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు విజయ్పై ఈసీ కేసు నమోదు చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు పెరావల్లూర్ పోలీస్ స్టేషన్లో విజయ్పై కేసు నమోదైంది. ఒక పబ్లిక్ మీటింగ్ సందర్భంగా రూల్స్ అతిక్రమించినందుకుగాను, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్పై కేసు రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఏప్రిల్లో అసెంబ్లీ
స్పెయిన్ తరహాలోనే ఇటలీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్పై దాడులకు అమెరికా యుద్ధ విమానాలకు తమ దేశ గగనతలం నుంచి అనుమతి లేదని పేర్కొంది. ఈ మేరకు ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ప్రకటన విడుదల చేశారు. సిసిలీలోని నేవల్ ఎయిర్ స్టేషన్ సిగోనెల్లా వంటి స్థావరాల వినియోగం, దీర్ఘకాలంగా అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల పరిధిలోని లాజిస్టికల్, సాంకేతిక మద్దతుకు మాత్రమే పరిమితమై ఉంటుందని ఇటలీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గత పాలకులు మూఢనమ్మకాలతో నొయిడా అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. నొయిడాలో పర్యటిస్తే అది నాయకుల కెరీర్కు అపశకునంగా మారుతుందనే ప్రచారం చాలా కాలంగా ఉందని, అయితే తాను మాత్రం దీనిని పట్టించుకోలేదని చెప్పారు. మూఢనమ్మకాల కారణంగానే నొయిడాను నాయకులు పట్టించుకోలేదు. గత పాలకులు ఇక్కడకు వస్తే పదవి కోల్పోతామని భయపడుతుండేవారు. అందుకే నొయిడాకు రావడం మానేశారు
అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం కొనసాగుతున్న వేళ పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాలకు ఇరాన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ శతృదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్లకు తమ దేశాల్లో చోటు ఇవ్వొద్దని సూచించింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా మిలిటరీ స్థావరాలు ఏర్పాటు చేసుకుని, అక్కడ్నుంచి ఇరాన్పై దాడిచేస్తోంది. అందువల్ల తమ దేశంపై దాడి చేసేందుకు అనువుగా అమెరికా సహా ఏ దేశానికి స్థలం ఇవ్వొద్దని ఇరాన్ కోరింది. ఈ మేరకు ఇరాన్
ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ కూడా చేరారనడం నిజం కాదని వెల్లడించింది. ఈ
ఇండియాకు మరో గుడ్ న్యూస్. చమురు ఉన్న రెండు భారత నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి బయల్దేరాయి. వీటికి భారత నేవీ రక్షణ కల్పిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన చమురు నౌకలు జలసంధి మార్గంలో సముద్రంపై నిలిచిపోయాయి. పరిమితంగా ఇరాన్ కొన్ని నౌకలకు అనుమతిస్తోంది. వాటిలో ఇండియా నౌకలు కూడా ఉన్నాయి. భారత
ఇరాన్ తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో అట్టుడుకుతున్న పర్షియన్ గల్ఫ్లో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధి లో తమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించిన ఓ ఆయిల్ ట్యాంకర్ పై శుక్రవారం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ క్షిపణులతో దాడిచేసి ధ్వంసం చేసింది. దాడికి గురైన ట్యాంకర్ పాకిస్థాన్ జెండాతో ఉన్నట్లు కథనాలు సూచిస్తున్నాయి. ఇరాన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి జలసంధిని దాటేందుకు ప్రయత్నించడంతోనే ఈ దాడి జరిగినట్లు ఇరాన్
భారతదేశం రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకొనే దిశగా కీలక ముందడుగు పడింది. ఆధునిక పరిస్థితులకు తగ్గట్టుగా సైనిక అవసరాల కోసం భారీగా యుద్ధ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ( డీఏసీ) ఆమోదం తెలిపింది. రూ.2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాలను కొనేందుకు రక్షణ శాఖకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆధునిక కాలానికి తగ్గట్టుగా భారత దేశ
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం సమీపంలో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. దాడికి పాల్పడిన ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరికలు చేసింది. తాము ఖతార్ మాదిరి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నది. టెహ్రాన్లోని పాకిస్థాన్ ఎంబసీకి అత్యంత సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్
ఇజ్రాయెల్తో యుద్ధంలో వరుసగా అగ్రనాయకత్వాన్ని కోల్పోతున్న ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ ఎలైట్ నావెల్ ఫోర్స్ (నావికా దళం) చీఫ్ అలీరెజా తాంగ్సిరి మరణించాడు. తాము జరిపిన వైమానిక దాడుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ నావికా దళానికి నాయకత్వం వహిస్తున్న టాప్ కమాండర్ అలీరెజాను పోర్ట్ సిటీ అయిన బందాకం అబ్బాస్ వద్ద హతమార్చినట్లు ప్రకటించింది. అలీరెజా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీలోని నావికా దళ
నీరవ్ మోదీకి లండన్లో మరోసారి చుక్కెదురైంది. నీరవ్ను భారత్కు అప్పగించాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఆఫ్ జస్టిస్ కింగ్స్ బెంచ్ డివిజన్ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్నారు. ఆయనను స్వదేశానికి పంపించాలని భారత్ కోరగా గతేడాది అక్కడి కోర్టు అంగీకరించింది.
హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ కు హార్ముజ్ తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా దాడులు చేయడంతో ఇరాన్, హార్ముజ్ ను మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో హార్ముజ్ ను ఓపెన్ చేయాలంటూ అమెరికా హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. అయితే, హార్ముజ్ ను పూర్తిగా మూసివేయకుండా తమ మిత్ర దేశాలకు మాత్రమే అనుమతిస్తామని
రికార్డు స్థాయిలో మూడోసారి పొట్టి ప్రపంచకప్తో చరిత్ర సృష్టించిన భారత జట్టు ఐపీఎల్ తర్వాత బిజీగా ఉండనుంది. టీమిండియా 2026-27 సీజన్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ తెలిపింది. ఇవి మొత్తం 22 మ్యాచ్లు ఉండగా, వీటిలో రెండింటికి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికవ్వనుంది. బెంగళూరు, గువాహటి, అహ్మదాబాద్, రాంచీలోనూ భారత జట్టు రెండేసి
ఇరాన్తో శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ ఆచితూచి స్పందిస్తోంది. ముందుగా చర్చల ప్రసక్తే లేదని తేల్చిన ఇరాన్, ఇప్పుడు మాత్రం స్వరం మార్చింది. తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తే అమెరికాతో చర్చలు జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు అమెరికాకు కీలక ప్రతిపాదనలు చేసింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక క్యాంపులను ఎత్తివేయడం అన్నింటికంటే కీలకమైన షరతు. అలాగే, ఇరాన్పై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడంతోపాటు నౌక
ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం వందేమాతరం పాడాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్పై విచారణ జరిపేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆ సర్క్యులర్ కేవలం సలహా పూర్వకమైనదే తప్ప తప్పనిసరి కాదని స్పష్టంచేసింది. ప్రభుత్వ ఉత్తర్వులలో ఎలాంటి శిక్షార్హమైన చర్యలు పేర్కొనందున ఈ పిటిషన్పై విచారణ తొందరపాటు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.
హార్ముజ్ జలసంధి మూసివేతతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చేలా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అది పాక్షికంగానే. అందులోనూ నౌకల రవాణాకు అనేక షరతులు వర్తిస్తాయి. తమ శతృదేశాలతో సంబంధం లేని నౌకల్ని మాత్రమే ఈ జలసంధి నుంచి అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. తమ శతృదేశాలతో సంబంధం లేని నౌకల్ని, తమ దేశ రక్షణ, భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటే మాత్రమే అనుమతిస్తామని
వంటగ్యాస్ (ఎల్ పిజి) సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. సిలిండర్ల బుకింగ్ గడుపు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్ సిలిండర్ ఉంటే 35 రోజుల తర్వాతే రీఫిల్
పాకిస్థాన్కు ఇరాన్ భారీ షాకిచ్చింది. పాక్కు వెళ్తున్న ఒక కంటైనర్ షిప్ను హార్ముజ్ జలసంధి దాటకుండా ఇరాన్ దళాలు నిలిపేశాయి. యూఏఈ షార్జా నుంచి కరాచీ వైపు వెళ్తున్న ఈ నౌకను నిలిపేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదవ వంతు ఈ జలసంధి గుండా వెళుతుంది. యుద్ధం
మతం మారిన వారి ఎస్సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా ఉండదని పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ప్రజలపై ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) హామీల వర్షం కురిపించింది. అన్నాడిఎంకె తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే, రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఉచిత రిఫ్రిజిరేటర్లు ఇస్తామని, మహిళలతోపాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్నికల్పిస్తామని హమీ ఇచ్చింది. మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు.. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు, 1 కిలో పప్పు, 1
ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇరాన్ యుద్ధం సహా పశ్చిమాసియా పరిస్థితులు, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇటు ప్రధాని మోదీ పేర్కొనగా, అటు అమెరికా తరఫున ఇండియాలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధిని తెరవడం చాలా
పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు మిస్సైల్లు, డ్రోన్లతో ఇరాన్ పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ తనచుట్టూ ఉన్న దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన, ఇజ్రాయెల్పైన భీకర దాడులు చేస్తున్నది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్, బ్రిటన్ కు తీవ్రమైన హెచ్చరికలు చేసింది. తమపై దాడుల కోసం అమెరికా దళాలకు బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకునే అవకాశం ఇస్తుందనే వార్తల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ వివాదంలో
ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్.ఐ.ఆర్)పై తాము సాగిస్తున్న పోరాటం కొనసాగుతుందని, ప్రజల ఓటింగ్ హక్కులను లాక్కునేందుకు ప్రధానమంత్రి మోదీ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రంజాన్ సందర్భంగా సెంట్రల్ కోల్కతాలో జరిగిన వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చేపట్టిన విస్తృత ప్రయత్నంలో భాగమే ఎస్ఐఆర్ ప్రక్రియ అని విమర్శించారు. మీ ఓటింగ్ హక్కులను
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్, పర్షియన్ నూతన సంవత్స నౌరుజ్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు, ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ప్రధాని ఖండించారు. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగాలని, నౌకామార్గాలు తెరచి ఉంచడం,
ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్)కు చెందిన అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మరణించాడు. ఈ విషయాన్ని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ జరిపిన మిస్సైల్ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.టెర్రరిస్టులు అయిన అమెరికా, జియోనిస్టులు జరిపిన దాడిలో తమ జనరల్ నైని వీరమరణం పొందారని ఐఆర్జీసీ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనితోపాటు సెక్యూరిటీ
భారత్ మరో ప్రతిష్టాత్మక క్రీడాటోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఇప్పటికే 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న భారత్ తాజాగా 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ టోర్నీకి వేదిక కాబోతున్నది. టూరన్(పోలండ్) వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు అదిల్లె సుమరివాల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్న భువనేశ్వర్లో కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
జపాన్ ప్రధాని సనేయి తకాయిచికి షాకిచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఓవల్ ఆఫీసులో ట్రంప్ను జపాన్ ప్రధాని కలిశారు. ఇటీవల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే మిత్ర దేశాలతో సంప్రదింపులు చేయకుండా ఇరాన్పై ఎందుకు దాడి చేశారని ఓ రిపోర్టర్ అడిగారు. దానికి ట్రంప్ స్పందిస్తూ తనదైన స్టయిల్లో జోకేశారు. తాము ఆ దాడి గురించి ఎవరికీ చెప్పలేదని, ఎందుకంటే మేం సర్ప్రైజ్
ఒక పక్క ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో పాల్గొంటూనే మరో పక్క తమ దేశంలో కార్యకలాపాల్ని ఇరాన్ సైలెంటుగా కానిచ్చేస్తోంది. తాజాగా ముగ్గురిని ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. మృతుల్లో 19 ఏళ్ల రెజ్లర్ కూడా ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై ఈ ముగ్గురికి ఉరిశిక్ష వేసింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇరాన్లో ప్రజల్లో తిరుగుబాటు మొదలైన సంగతి తెలిసిందే. అక్కడి ధరల పెరుగుదల, నిరుద్యోగం, కరెన్సీ
పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ నేతలతో మాట్లాడారు. సౌదీ అరేబియాలోని గ్యాస్ కేంద్రాలపై దాడులతో ప్రపంచ దేశాలకు గ్యాస్ కొరత ఏర్పడనున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తం కావాలని మోడీ కోరారు. పశ్చిమాసియాలో తక్షణమే శాంతి స్థాపనకు చొరవ చూపాలని ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మన్యుయేల్ మక్రాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఒమన్ సుల్తాన్ను విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయేల్, అమెరికా దాడులకు
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ మరో సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ పార్టీ ఏకంగా 99.93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. కొరియాలో అతిపెద్ద వ్యవస్థ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఇదే అక్కడ దేశాన్ని పాలించే పార్లమెంటరీ. ఈ నెల 15న ఉత్తర కొరియాలో 15వ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఇందులో కిమ్ పార్టీ అయిన వర్కర్స్ పార్టీ
కేరళలోని ధర్మదం నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 9న కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో అక్కడి నామినేషన్ల పర్వం మొదలైంది. అందులో భాగంగానే విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. తలస్సెరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు తన నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించారు. 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ప్రచారం మొదలుపెట్టిన విజయన్ తన రాజకీయ
హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై నౌకల రవాణా విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపింది. ఈ జలసంధి నుంచి వెళ్లే నౌకలపై పన్నులు విధించే ఆలోచన చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. ఇరాన్పై అమెరికా సహా యూరప్ దేశాలు అనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చమురు కొనుగోలుతోపాటు అనేక ఆర్థిక ఆంక్షల్ని పలు దేశాలు ఇరాన్పై విధించాయి. కానీ, ఇరాన్ అధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధిని
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. బలవంతంగా కాకుండా, వారంతట వారే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇలా వెళ్లేవారికి 2,600 డాలర్లు (సుమారు రూ.2.40 లక్షలు) ఎగ్జిట్ బోనస్ గా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు, వారి స్వదేశాలకు వెళ్లేందుకు అయ్యే విమాన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది.
టీవీకే అధినేత, నటుడు విజయ్కు తమిళనాడులో ఒక జాతీయ పార్టీ సీఎం పదవి ఆఫర్ చేసిందని టీవీకే నేత అధవ్ అర్జున అన్నారు. అయితే, అది ఏ పార్టీయో వెల్లడించలేదు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి, అది జాతీయ పార్టీ అని స్పష్టమవుతోంది. అయితే, ఈ ఆఫర్ను విజయ్ తిరస్కరించినట్లు అర్జున తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభావాన్ని కాదనలేం. ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్కు ఉన్న ఫాలోయింగ్
గత కొన్ని రోజులుగా పశ్చియాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా యుద్ధ వాతావరణం చల్లబడటం లేదు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్లోనే ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. అయితే
అమెరికా కిరాయి సైనికుడు మాథ్యూ వాన్డైక్ ను భారత్లో అరెస్ట్ చేశారు. అతడితోపాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులో ఉన్నారు. వారు పర్యాటక వీసాపై దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, భారత్ వ్యతిరేక సంస్థలతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ వెల్లడించింది. మాథ్యూ వాన్డైక్ అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రానికి చెందినవాడు. అతను తనను తాను ఒక అంతర్జాతీయ వ్యాపారవేత్తగా, సైనికుడిగా, వార్ కరస్పాండెంట్గా, కాలమిస్ట్గా వెబ్సైట్లో
అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో అగ్ర నేతల్ని కోల్పోతున్న ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్లో జరిపిన కాల్పుల్లో ఖతిబ్ మరణించినట్లు ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది. అయితే, ఈ విషయాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. ఇరాన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, నిఘా వ్యవస్థ, గూఢచర్యంతోపాటు ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్
తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రత్యర్ధులను విమర్శించే క్రమంలో కొందరు నాయకులు తమ నోటికొచ్చింది మాట్లాడి వివాదాల్లో నిలుస్తున్నారు. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ మాటల మధ్యలో నోరు జారారు. నాకు నయనతార కావాలి. నా కల నేరవేరుస్తారా? అని ఆయన స్టాలిన్ను ప్రశ్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సందడి మొదలవ్వడంతో తమిళనాడులో అధికార
తమ దేశంపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం అని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని స్పష్టం చేసినట్లు సమాచారం. ఖమేనికి సంబంధించిన వివరాలేవీ తెలియనప్పటికీ, ఆయన మాత్రం ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్లపై ప్రస్తుత యుద్ధ సమయంలో అనుసరించాల్సిన విధానంపై జరిగిన ఒక విధానపరమైన సమీక్షా సమావేశం సందర్భంగా ఖమేని ఈ మాటలు చెప్పినట్లు ఇరాన్ అధికార వర్గాలు
మాజీ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రధాని మోదీని కలిశారు. తన ఫ్యామిలీతో కలిసి ప్రధానిని వరుణ్ మీటయ్యారు. గతంలో ఫిలిబిత్ నియోజకవర్గం నుంచి వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. మళ్లీ బీజేపీలో వరుణ్ గాంధీ క్రియాశీలకంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల వేళ వరుణ్ గాంధీని పక్కనపెట్టారు. 2024లో ఫిలిబిత్ నుంచి మాజీ కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీ
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. ఈ దాడిలో లారిజానితోపాటు ఇరాన్ టాప్ కమాండర్ గోలాంరెజా సోలేమని కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే, ఈ విషయంపై ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అంతమైన తర్వాత కూడా అమెరికా, ఇజ్రాయెల్
అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కేర్ చరిత్ర సృష్టించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లో చెలరేగిపోతున్న కివీస్ కెప్టెన్ రెండో టీ20 మ్యాచ్లో వందో వికెట్ సాధించింది. తద్వారా టీ20ల్లో ఆమె అరుదైన మైలురాయిని అధిగమించింది. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా వెయ్యికి పైగా పరుగులు బాదేసి, వందకు పైగా వికెట్లు తీసిన మహిళా క్రికెటర్గా అమేలియా అవతరించింది. ఈ ఆల్రౌండర్ 94వ ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్
ఎల్పీజీ చమురు కలిగిన రెండో నౌక గుజరాత్ పోర్టుకు చేరుకుంది. ఎల్పీజీ ట్యాంకర్లతో కూడిన ఎంటీ నందాదేవి అనే పేరుగల నౌక గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నౌక హోర్ముజ్ జలసంధి నుంచి ఇక్కడికి రావడం విశేషం. ఇరాన్ యుద్ధం ప్రారంభమయ్యాక ఈ జలసంధి నుంచి ఇండియా చేరుకున్న రెండో నౌక ఇది. ఈ నౌకలో దాదాపు 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ఈ
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది.ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు
దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిందని, త్వరలోనే గ్యాస్ సిలిండర్ ధర రూ.2,000 దాటుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100 శాతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎల్పీజీ స్టాక్ గృహావసరాలకు సరిపోయేంత ఉందని తెలిపింది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కూడా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్రం
50 ఏళ్లలోపు మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంపై కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కేరళం సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. భక్తుల మనోభావాలు, ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాల్ని దృష్టిలో
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఎక్కడున్నారన్న సమాచారం చెప్పే వారికి 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.93కోట్లు )ఇస్తామని అమెరికా భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ విదేశాంగశాఖ ప్రకటన చేసింది. సుప్రీం నేత ఖమేనీతోపాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజాని సహా పలువురి పేర్లను యూఎస్ విదేశాంగశాఖ ప్రస్తావించింది. వీరు ప్రపంచ వ్యాప్తంగా
పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ఫలితంగా ఇతర దేశాలతోపాటు భారత్లో కూడా కమర్షియల్ వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దాంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి.ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన సీనియర్ అధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీస్టాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం విదేశీయులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగడంతో, భారత్లో చిక్కుకుపోయిన విదేశీయుల కోసం వీసా గడువు పెంపు, జరిమానాల మినహాయింపును ప్రకటించింది. దుబాయ్లోని భారత కాన్సులేట్ వెల్లడించిన వివరాల ప్రకారం గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న వీసాలు,
2026 టీ20 వరల్డ్కప్ గెలిచిన సూర్యకుమార్ నేతృత్వంలోని భారత బృందాన్ని (బీసీసీఐ) సన్మానించనున్నది. ఆదివారం జరిగే నమన్ అవార్డు ప్రదానోత్సవంలో సన్మాన కార్యక్రమం ఉండనున్నది. ఇటీవల ఐసీసీ టోర్నీల్లో అయిదు టైటిళ్లు గెలిచిన భారత జట్లను నమన్ అవార్డులతో సన్మానించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. మార్చి 8వ తేదీన జరిగిన ఫైనల్లో సూర్య కుమార్ నేతృత్వంలోని భారత జట్టు టీ20 వరల్డ్కప్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సూర్య
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. దుబాయ్, బహ్రెయిన్ సహా పలు దేశాలపై దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో పోర్టులకు దూరంగా ఉండాలని యూఏఈ వాసులను ఇరాన్ హెచ్చరించింది. ఈ పోర్టులకు సమీపంలో దాడులకు దిగుతామని తెలిపింది. ఇక్కడి రహస్య మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడి చేస్తామని హెచ్చరించింది. ఇకపై యుద్ధంలో ప్రమాదకర బాలిస్టిక్ మిస్సైల్స్ ఉపయోగిస్తామని వెల్లడించింది. అలాగే మరింత ప్రభావవంతమైన ఆయుధాల్ని కూడా వినియోగించబోతున్నామని, అవి భారీ
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలంటూ ఇండియా కూటమి పార్టీలు ఒక తీర్మానాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చాయి. ఇందుకు సంబంధించిన తీర్మానం నోటీసును పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్ష నేతలు ప్రవేశపెట్టారు. తీర్మానం నోటీసుపై 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్సభ, 63 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఈ తీర్మానానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చిన నోటీసు లోక్సభ సెక్రటేరియట్కు
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ వీకే శశికళ కొత్త పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఆల్ ఇండియా పురచ్చి తలైవార్ మక్కల్ మున్నేత్ర కజగం అని నామకరం చేశారు. ఏఐపీటీఎంఎంకే పేరును ఆమె వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రామనాథపురం జిల్లాలోని కాముతి లో జరిగిన సమావేశంలో పార్టీ జెండాను శశికళ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కొబ్బరిచెట్ల ఫార్మ్ను
ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ వైమానికదళం కూడా ఇక ఉండదు అని అన్నారు. ఇరాన్ కు మరోసారి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మతి చెడిన నేతలకు ఇవాళ ఏం జరుగుతుందో మీరే చూస్తారని, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని తెలియజేశారు. ఇరాన్ నాయకులు భూమి పైనుంచి తుడిచిపెట్టుకుపోయారని, 47 ఏళ్లుగా ఇరాన్
ప్రస్తుత సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొస్తామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ అన్నారు. ఒకవైపు ప్రపంచం సంక్షోభంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మోదీ విమర్శించారు. కేరళంలోని కోచిలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి నిర్వహించిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ అక్కడి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం
ఇండియాలోని గుజరాత్కు వస్తున్న థాయ్ కార్గో షిప్పై హోర్ముజ్ జలసంధి వద్ద దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో షిప్పులోని కొందరు సిబ్బందిని ఒమన్ నావికా దళం రక్షించింది. మరికొందరు ఇంకా షిప్పులోనే ఉన్నారు. స్పష్టమైన సమాచారం లేనప్పటికీ ఈ నౌక థాయ్లాండ్ నుంచి ఇండియా వస్తున్నట్లు తెలుస్తోంది. థాయ్లాండ్లోని ప్రీసియ్ షిప్పింగ్ సంస్థకు చెందిన మయూరీ నారీ అనే నౌక ఇండియాలోని గుజరాత్లోని కండ్ల పోర్ట్కు బయల్దేరింది. ఈ
భారతదేశంతో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్డీఐ) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా ఇతర సరిహద్దు దేశాల ఎఫ్డీఐలపై నిబంధనలను సరళతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న ముందస్తు అనుమతి నిబంధనను తొలగించింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తమిళనాడులోని మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
ఇప్పుడు ప్రపంచాన్ని చమురు సంక్షోభం వేధిస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లకు మించి పెరిగింది. ఈ నేపథ్యంలో చమురు సరఫరా పెంచి, ధరల్ని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమ దగ్గర ఉన్న వ్యూహాత్మక చమురు రిజర్వ్ను విడుదల చేస్తాయి. ఇప్పుడు జపాన్ అదే పని చేసింది. తమ దేశంలో ఉన్న వ్యూహాత్మక చమురు
టీ20 వరల్డ్ కప్ 2026 విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. విజేతగా ఇండియా నిలవగా, రన్నరప్గా న్యూజిలాండ్ నిలిచింది. దీంతో విన్నర్, రన్నరప్ జట్లతోపాటు టోర్నీలో పాల్గొన్న మిగతా జట్లకు కూడా ఐసీసీ నిబంధనల ప్రకారం నగదు బహుమతి దక్కుతుంది. ఈ టోర్నీకి సంబంధించి మొత్తం ప్రైజ్మనీ వివరాల్ని ఐసీసీ వెల్లడించింది. దీని ప్రకారం టోర్నీ మొత్తానికి కలిపి రూ.103 కోట్లు (11.25 మిలియన్ డాలర్లు) ప్రైజ్మనీగా కేటాయించింది. గ్రూప్స్,
దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు సోమ వారం నోటీసులు జారీ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు ఊరట కలిగిస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సిబిఐ
కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కి సీబీఐ మరోసారి సమన్లు జారీచేసింది. మార్చి10న విచారణకు హాజరుకావాలని సూచించింది. కాగా గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్ లో విజయ్ నిర్వహించిన ప్రచారసభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేసింది. కరూర్
ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ షాక్ తగిలింది. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) నాయకులు 47 మందికి యాంటీ టెర్రరిజం కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, ఒక్కొక్కరూ 1.52 కోట్ల పాకిస్తాన్ రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. 2023లో వివిధ అభియోగాల కింద ఇమ్రాన్ ఖాన్ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే
లోక్సభలో ఇద్దరు ఎంపీలు తమ వేతనం తీసుకోవడం లేదు. వారిలో ఒకరు బీజేపీ ఎంపీ కాగా మరొకరు కాంగ్రెస్ ఎంపీ. బీజేపీకి చెందిన హర్యానాలోని కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్, కాంగ్రెస్కు చెందిన ఇన్నర్ మణిపూర్ ఎంపీ డాక్టర్ బిమోల్ అకోయిజామ్ అంగోమ్చా తమ జీతాలు తీసుకోకూడదని నిర్ణయించారు. అంతేగాక అధికారిక భత్యాలతోపాటు ప్రోత్సాహకాలను కూడా నవీన్ జిందాల్ తీసుకోవడం లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు
ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా ఎన్నికైన అయతొల్లా మొజ్తాబా ఖమేనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. ఇరాన్కు మద్దతుగా ఉంటామని పుతిన్ హామీ ఇచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికైన మొజ్తాబాకు శుభాకాంక్షలు. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్కు రష్యా అండగా నిలబడుతుంది. ఇరాన్లోని మా స్నేహితులకు, వారి సమగ్రతకు రష్యా మద్దతుగా ఉంటుంది. మొజ్తాబా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఇరాన్ ప్రజల్ని ఏకతాటిపైకి తెస్తారని
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మరో ఉచిత పథకానికి శ్రీకారం చుట్టారు. పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించారు. మార్చి 7, శనివారం నుంచే యువ సతి పేరుతో ఈ పథకం ప్రారంభమవుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ ప్రకటన
ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్కు ఆయన భార్య సంగీత నుంచి మరో కొత్త షాక్ తగిలింది. వీరిద్దరి మధ్య జరుగుతున్న విడాకుల వివాదంలో తాజాగా ఆమె చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఒక కీలక పిటిషన్ను దాఖలు చేసింది. విడాకుల కేసు విచారణ పూర్తయ్యే వరకు చెన్నైలోని నీలంకరైలో ఉన్న తమ సొంత నివాసంలోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. ఒకవేళ
రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. ప్రొటోకాల్ వైఫల్యంపై స్వయంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్ లో అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు సీఎం నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు. తాను ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిన ఆదివాసీ సదస్సుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆమె
అనేక రాష్ట్రాలు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతుంటే, పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పంజాబ్లో ముఖ్యమంత్రి భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ (ఆప్) ప్రభుత్వం కొలువై ఉన్న సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వం కొద్ది రోజులుగా ఉచిత, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ప్రతి నెలా 300
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.