బంగ్లాదేశ్ పర్యటనలో దారుణ ఓటమిని మరిచిపోకముందే పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకా టెస్టులో స్లో ఓవర్ రేటు కు పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఆ జట్టు ర్యాంకింగ్లోనూ దిగజారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో కీలకమైన పాయింట్లు కోల్పోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా 8 పాయింట్లు కోతకు గురైంది షాన్ మసూద్ బృందం. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో పాకిస్థాన్కు ఊహించని షాక్. బంగ్లాదేశ్ చేతిలో 104 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఓటమి పాక్ ర్యాంకింగ్స్ను దెబ్బతీసింది. ఆ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోల్పోయింది. నిర్ణీత సమయానికి ఎనిమిది ఓవర్లు వెనుకంజలో ఉండడంతో జరిమానా కింద డబ్ల్యూటీసీలో 8 పాయింట్ల కోత పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, న్యూజిలాండ్ రెండులో ఉంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ వరసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.


