My Telugu NRI

Mobile Scrollable Menu
జగిత్యాల కేసీఆర్‌ సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్

కేసీఆర్ భారీ బహిరంగ సభ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ జగిత్యాల కేసీఆర్‌ సభ పోస్టర్ ని ఆవిష్కరించారు. ప్రజలంతా కేసీఆర్‌ సందేశం కోసం ఎదురుచూస్తున్నారని, అలాగే

అమెరికా యూ టర్న్ .. ఇండియాకు ఊరట

చమురు సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు ఊరటనిచ్చేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలకు అమెరికా అనుమతినిచ్చింది. ఇది ఇండియా సహా అనేక దేశాలకు ఊరట కలిగించే విషయం. గతంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షల్ని అమెరికా విధించింది. అనంతరం ఇరాన్ యుద్దం నేపథ్యంలో ఆంక్షల్ని సడలించింది. తిరిగి మళ్లీ ఆంక్షలు విధించింది. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని, రష్యా నుంచి

జగిత్యాల సభను విజయవంతం చేయాలి : రాధారపు సతీష్

జగిత్యాల లో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్‌ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చడానికి బీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించి అనేక పోరాటాలు చేసి తన ప్రాణాలను పణంగా

వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ దారుణం

అమెరికా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ (47) తన భార్య డాక్టర్ సెరీనా ఫెయిర్‌ఫాక్స్ (49)ను కాల్చి చంపి, ఆపై తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన వాషింగ్టన్ డిసి శివారు ప్రాంతమైన అన్నందలేలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ తన భార్యను ఇంటి బేస్‌మెంట్‌లో కాల్చి చంపి, ఆ

శాంతి చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం : అమెరికా హెచ్చరిక

అమెరికా, ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు జరగబోతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా రెండో దశ శాంతి చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు అమెరికా తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. ఈసారి శాంతి చర్చలు విఫలమైతే యుద్ధం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తామని, ఇందుకు సిద్ధమవుతున్నామని అమెరికా రక్షణ శాఖ సెక్రెటరీ పీట్ హెగ్సెత్ అన్నారు. ఇరాన్

ఇరాన్-అమెరికా మ‌ధ్య మ‌రోసారి చ‌ర్చ‌లు: పాకిస్థాన్

ఇరాన్ -అమెరికా తదుపరి చర్చల దశ త్వరలో ఉండవచ్చని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. పార్లమెంట్ భవనం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకోలేదని, దీంతో చర్చలు కొంత మేర ఫలించాయన్న భావన కలిగిందని అన్నారు. కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు నిర్మాణాత్మక దిశలో సాగుతున్నాయని సూచించారు.అమెరికా, ఇరాన్ మధ్య 21గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ, శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన సంగతి

న్యూయార్క్ అటార్నీ జనరల్ పోటీలో సరితా కోమటిరెడ్డి

అమెరికాలో మరో భారత సంతతి మహిళ ఉన్నత పదవికి పోటీ పడుతున్నారు.ఈ క్రమంలో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం  తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు స్వయంగా వెల్లడించిన ఆమె, విజయంపై  ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం న్యూయార్క్ అటార్నీ జనరల్‌గా ఉన్న లటీషియా జేమ్స్‌తో సరిత తలపడనున్నారు. ఈ నవంబర్‌లో ఎన్నిక జరగనుంది. అమెరికా రాజకీయాల్లో

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం … 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా

ఆస్ట్రేలియా చరిత్రలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళను ఆర్మీ చీఫ్ గా నియమించింది. దేశ రక్షణ దళాల నాయకత్వంలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా, చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ తమ సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు ఆస్ట్రేలియా సోమవారం (ఏప్రిల్ 13) ప్రకటించింది. ప్రస్తుత జాయింట్ క్యాపబిలిటీస్ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయిల్ జూలైలో సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆస్ట్రేలియా

ఈ విషయంలో మద్దతు ఇవ్వడం లేదు .. డొనాల్డ్ ట్రంప్‌నకు బ్రిటన్ షాక్

హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే, ఈ విషయంలో అమెరికా మిత్ర దేశంగా పేరున్న బ్రిటన్ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తాము ట్రంప్‌నకు మద్దతు ఇవ్వడం లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. హార్ముజ్‌ను దిగ్బంధించాలంటూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తమ దేశం ఉద్రిక్తతలు

యూకేలో శాశ్వత నివాసం … నిబంధనలు కఠినతరం!

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లో శాశ్వత నివాసం కోరే వలసదారులకు నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఈ విషయాన్ని యూకే హోంశాఖ మంత్రి షబానా మహమూద్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రి వెల్లడించిన ప్రకారం యూకేలో శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అక్కడ ఐదేళ్లు ఆవాసం ఉండి ఉండాలి. ఇప్పుడు ఆ ఐదేళ్ల గడువును పదేళ్లకు పెంచేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మరికొందరికి ఈ వ్యవధిని 20 ఏళ్లకు పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మేం మీకోసం ఎదురు చూస్తున్నాం .. ప్రపంచ దేశాలకు ట్రంప్‌ పిలుపు

ఇరాన్‌తో శాంతి చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు అతిపెద్ద చమురు ఆర్థిక వ్యవస్థలైన రష్యా, సౌదీ అరేబియా కంటే తమ వద్దే ఎక్కువ చమురు  ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత కలిగిన చమురు, గ్యాస్‌ను నింపుకోవడానికి ప్రపంచ దేశాలకు చెందిన అనేక ఖాళీ చమురు ట్యాంకర్లు అమెరికా తీరంవైపు వస్తున్నాయని పేర్కొన్నారు. మేం మీకోసం ఎదురు చూస్తున్నాం.. త్వరితగతిన స్పందించండి అంటూ

ఆ  ప్ర‌తిపాద‌న‌ను ట్రంప్ ఒక్క‌రే  ఒప్పుకున్నారు : జాన్ కెర్రీ

అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్‌పై దాడి చేయాల‌ని అమెరికాపై ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్య‌హూ అనేక‌సార్లు వ‌త్తిడి చేసిన‌ట్లు చెప్పారు. అమెరికా మాజీ అధ్య‌క్షుల‌పైన కూడా గ‌తంలో ఒత్తిడి జ‌రిగిన‌ట్లు ఆయ‌న చెప్పారు. కానీ నెత‌న్య‌హూ ప్రెజ‌ర్‌కు ట్రంప్ ఒక్క‌రూ ఒప్పుకున్నార‌ని తెలిపారు. నెత‌న్య‌హూతో అనేక సార్లు చ‌ర్చ‌లు జ‌రిపాన‌ని, ఆ స‌మ‌యంలో ఇజ్రాయెల్ ప్ర‌ధాని అమెరికాపై వ‌త్తిడి తెచ్చేవార‌ని, ఇరాన్‌పై మిలిట‌రీ

అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదు : మెలానియా ట్రంప్

వాషింగ్టన్‌లో వైట్ హౌస్‌లో విడుదల చేసిన ప్రకటనలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం అబ్బద్ధమని, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. అలాగే ఆయన నేరాల గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను పూర్తి అసత్యాలుగా పేర్కొంటూ, ఇవి తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలని విమర్శించారు.

అమెరికాతో ఆటలొద్దు..  హెచ్చరించిన జేడీ వాన్స్!

అమెరికాతో ఆటలు ఆడాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌ను హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధానికి విరామం ప్రకటించినందున శాంతి చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లే ముందు వాన్స్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా వైఖరిని స్పష్టం చేశారు. తమ అధ్యక్షుడి ఆదేశాల మేరుకు దౌత్యపరమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సమయంలో ఇరాన్‌ తమతో ఆటలు ఆడాలని చూస్తే సహించబోమని వాన్స్ స్పష్టం చేశారు. ఆరు

భార‌తీయ సంత‌తి వ్య‌క్తి 15 ఏళ్ల జైలుశిక్ష‌

భార‌తీయ సంత‌తికి చెందిన బ్రిటీష్‌-అమెరిక‌న్ డ్ర‌గ్ డీల‌ర్ జ‌స్వీన్ సంఘాకు 15 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. హాలీవుడ్ ప్ర‌ముఖ‌ల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు ఆమెపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జ‌స్వీన్ సంఘా వ‌య‌సు 42 ఏళ్లు, ఆమెను కీట‌మైన్ క్వీన్‌ గా పిలుస్తారు. ఫ్రెండ్స్ న‌టుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో ఆమెకు ఆ శిక్ష ప‌డింది. భార‌తీయ సంత‌తికి చెందిన జ‌స్వీన్‌కు ద్వంద్వ పౌర‌సత్వం ఉన్న‌ది. అమెరికా, బ్రిటీన్‌లో ఆమెకు

ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం : డొనాల్ట్ ట్రంప్

అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది ఇరాన్ చుట్టూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఒప్పందం కుదిరేవరకు అమెరికా బలగాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఏదైనా కారణంతో ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం మొదలవుతుందని అన్నారు. ఒప్పందం కుదరకపోతే ఈ సారి మరింత తీవ్రమైన దాడులు చేస్తామని సూచించారు. ఇరాన్ ఇప్పటికే బలహీనపడిందని, అవసరమైతే పూర్తిగా నాశనం

అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల ఒప్పందం .. ఆ వెంటనే లెబనాన్‌ పై

అమెరికా-ఇరాన్‌  దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటన వెలువడిన వెంటనే లెబనాన్‌ పై ఇజ్రాయెల్‌  క్షిపణులతో విరుచుకుపడింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. మొత్తం 254 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై దాడికి పాల్పడటంతో ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ

బే ఏరియాలో ఘనంగా ఎన్నారై టీడీపీ నేతలు సంబరాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రాజ్యసభలోనూ ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్ర లభిస్తే ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుంది.  తాజాగా అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న డబ్లిన్, ప్లజెంటన్ నగరాల్లో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా

అమెరికాకు మరో ఎదురు దెబ్బ

ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధంలో అమెరికా దళాలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన ఎఫ్‌-15ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్‌ కూల్చేయడం, దానిలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు గల్లంతైన విషయం తెలిసిందే. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ విమానాన్ని కూడా కూల్చేశామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు ప్రకటించారు. పైలట్‌ను రక్షించామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన చేసిన తర్వాత ఇరాన్‌ అందించింది. దాని ప్రకారం…కూలిపోయిన

భారత్‌కు హామీ ఇచ్చిన రష్యా… భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇండియా చమురు కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాకు మరింత చమురు సరఫరా చేయాలని రష్యా నిర్ణయించింది. ఆయిల్, లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) సరఫరాను పెంచబోతున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా మొదటి డిప్యూటీ ఛైర్మన్ డెనిస్ మాంటురోవ్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో  భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా చమురు సరఫరాపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తన సన్నిహితురాలినే తప్పించిన ట్రంప్ .. మరో బాధ్యత ఇవ్వనున్నట్లు ప్రకటన

అమెరికా అటార్నీ జ‌న‌ర‌ల్ పామ్ బాండీ పై డోనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. వ్యాపారి, సెక్స్ అఫెండ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో ఫైళ్ల‌ను స‌రైన రీతిలో హ్యాండిల్ చేయ‌లేద‌న్న నెపంతో పామ్ బాండీపై వేటు వేసిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ట్రంప్‌, బాండీ స‌న్నిహితులే. కానీ ఎప్‌స్టీన్ ఫైళ్ల కేసును హ్యాండిల్ చేసిన తీరు ప‌ట్ల డెమోక్రాట్లు, రిప‌బ్లిక‌న్లు ఆమెపై ఆగ్ర‌హంగా ఉన్నారు. మ‌న్‌హ‌ట్ట‌న్ జైలులో ఎప్‌స్టీన్ మృతిచెందిన అంశాన్ని కూడా

తానా ఆధ్వర్యంలో విజయవంతంగా సి.పి.ఆర్ శిక్షణ కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తానా సౌత్ ఈస్ట్ విభాగం వారు అట్లాంటాలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మార్చి 29న స్థానిక అకేషన్స్ వేదికగా జరిగిన ఈ శిబిరానికి ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు వారు హాజరై ఆపద సమయంలో చేయాల్సిన వైద్య చికిత్స చర్యలను తెలుసుకున్నారు. నాయకత్వం సమన్వయం.. తానా

అమెరికా ఎన్నికల్లో కొత్త రూల్స్!

అమెరికా కొత్తగా నేషనల్‌ ఎలిజిబుల్‌ ఓటర్‌ లిస్ట్‌  ను రూపొందిస్తున్నది. ఈ మేరకు అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌  యంత్రాంగం పనులు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల జాబితాను రూపొందించాలనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం కూడా చేశారు. ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్‌పై మరిన్ని ఆంక్షలు విధించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేషనల్ ఎలిజిబుల్ ఓటర్‌ లిస్టు రూపకల్పనలో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ

వాషింగ్టన్ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి (వర్జీనియా) ప్రాంతంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భాను మాగులూరి మాట్లాడుతూ 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని తెలిపారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ముందు, ఆ తరువాత అనే విధంగా తెలుగునాట ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో పార్టీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. దేశంలో సంక్షేమ

వార్ కోసం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా?

ఇరాన్‌పై అమెరికా భీక‌రంగా దాడి చేస్తున్న విష‌యం తెలిసిందే. విధ్వంస‌క‌ర పేలుడు ప‌దార్ధాలు, క్షిప‌ణుల‌ను ఆ దేశం వినియోగిస్తున్న‌ది. చాలా ఖ‌రీదైన ఆ ఆయుధాల వ‌ల్ల‌, అమెరికా అనూహ్య రీతిలో యుద్ధం కోసం ఖ‌ర్చు చేస్తున్న‌ది. ఇరాన్ వార్ కోసం అమెరికా ఖ‌ర్చు చేస్తున్న గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇరాన్ వార్ కోసం ప్ర‌తి సెక‌నుకు అమెరికా సుమారు 9.8 ల‌క్ష‌లు(10వేల డాల‌ర్లు) ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం

ఆ దేశంపై యుద్ధాన్ని ఆపేస్తాం : డోనాల్డ్ ట్రంప్

ఒక‌వేళ హోర్ముజ్ జ‌ల‌సంధిని ఇరాన్ తెర‌వ‌కున్నా, ఆ దేశంపై చేప‌ట్టిన యుద్ధాన్ని నిలిపివేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న స‌హ‌చ‌రుల‌తో వెల్ల‌డించినట్లు తెలుస్తోంది. హోర్ముజ్‌ను మ‌రో సంద‌ర్భంలో తెరిచేందుకు వ‌త్తిడి చేయ‌నున్న‌ పేర్కొన్నారు. ట్రంప్ స‌ర్కారులో ఉన్న అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. హోర్ముజ్ జ‌ల‌సంధిని విదేశీ నౌక‌ల‌కు ఓపెన్ చేసే వ‌ర‌కు ఇరాన్ అంతుచూస్తామ‌ని ట్రంప్ ప‌దేప‌దే వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే

అమెరికాలో ఐటీ పారిశ్రామికవేత్తలతో ..  ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అమెరికాలోని ప్రముఖ ఐటీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ కోరారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ల ఆధ్వర్యంలో ఐటీ రంగం వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో

ఈ ప్రచారంలో నిజం లేదు  .. స్పందించిన కేంద్రం

ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్‌ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ కూడా చేరారనడం నిజం కాదని వెల్లడించింది. ఈ

మరో మెట్టు దిగిన డొనాల్డ్‌ ట్రంప్‌ .. డెడ్‌లైన్ పొడిగింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో మెట్టు దిగారు. యూఎస్‌-ఇజ్రాయెల్‌తో యుద్ధ విరమణకు అమెరికా ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్‌ నిర్దంద్వంగా తిరస్కరించినప్పటికీ హొర్ముజ్‌ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్‌ వ్యవస్థలను నాశనం చేస్తామంటూ గతంలో ఇచ్చిన డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించారు. గతంలో తాను ఇచ్చిన 48 గంటల డెడ్‌లైన్‌ను ఉపసంహరించి ఇరాన్‌కు మరో ఐదు రోజులు గడువిస్తున్నట్టు ఈ నెల 23న ట్రంప్‌ ప్రకటించారు. అయితే దానికి స్పందన

చరిత్ర సృష్టించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చరిత్ర సృష్టించనున్నారు. అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని అధ్యాయానికి అధ్యక్షుడు ట్రంప్ నాంది పలుకబోతున్నారు. త్వరలో ట్రంప్‌ సంతకం ఉన్న డాలర్ నోట్లను విడుదల చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్  తెలిపారు. అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వ్యక్తి సంతకంతో కరెన్సీ నోట్ల  ను ముద్రించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొత్తగా ముంద్రించబోయే అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్

యుద్ధం వేళ నరేంద్రమోదీపై ట్రంప్‌ కామెంట్స్‌ .. ఏమన్నారంటే!

భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ, తాను మాటల మనుషులం కాదని, చేతల మనుషులమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్  యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాట చాలామంది ఇతర దేశాల అధినేతలకు వర్తించదని అన్నారు. భారత్‌తో బంధం రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ నుంచి తమ దేశానికి వచ్చే సందర్శకులపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఆస్ట్రేలియా హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇరాన్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఆస్ట్రేలియాలోకి ప్రవేశించడానికి అనుమతి

ప్రవాస భారతీయులు ఏళ్లుగా వేచిచూస్తున్న కీలక బిల్లుకు .. కెనడా ఆమోదం

కెనడా చట్టసభ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. విద్వేషపూరిత చర్యలు, నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన కంబాటింగ్ హేట్ బిల్లుకు ఆ దేశ చట్టసభ ఆమోదం తెలిపింది. ఈ కీలక బిల్లుకు హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదముద్ర వేసింది. అనంతరం ఆ బిల్లును ఎగువసభకు పంపించారు.ఈ బిల్లు చట్టంగా మారి అమలులోకి వస్తే ప్రార్థనా స్థలాలపై దాడులకు, ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం

నీరవ్ మోడీకి లండన్ హైకోర్టులో.. మరోసారి చుక్కెదురు

నీరవ్ మోదీకి లండన్‌లో మరోసారి చుక్కెదురైంది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఆఫ్ జస్టిస్‌ కింగ్స్ బెంచ్ డివిజన్ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్‌ జైల్లో ఉన్నారు. ఆయనను స్వదేశానికి పంపించాలని భారత్ కోరగా గతేడాది అక్కడి కోర్టు అంగీకరించింది.

తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తే .. అమెరికాతో చర్చలు

ఇరాన్‌తో శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ ఆచితూచి స్పందిస్తోంది. ముందుగా చర్చల ప్రసక్తే లేదని తేల్చిన ఇరాన్, ఇప్పుడు మాత్రం స్వరం మార్చింది. తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తే అమెరికాతో చర్చలు జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు అమెరికాకు కీలక ప్రతిపాదనలు చేసింది. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక క్యాంపులను ఎత్తివేయడం అన్నింటికంటే కీలకమైన షరతు. అలాగే, ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడంతోపాటు నౌక

ఆ నిర్ణ‌యం అమెరికా చేతుల్లోనే : కిమ్

ఇరాన్‌పై దాడి చేసిన అమెరికా దూకుడు వైఖ‌రిని ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్  త‌ప్పుప‌ట్టారు. పార్ల‌మెంట్‌లో మాట్లాడుతూ త‌మ దేశం స‌మ‌కూర్చుకుంటున్న అణ్వాయుధాల‌ను ఆయ‌న స‌మ‌ర్ధించుకున్నారు. కిమ్ ప్ర‌సంగానికి చెందిన అంశాల‌ను మంగ‌ళ‌వారం ఆ దేశ మీడియా రిలీజ్ చేసింది. దేశంలో అన్ని రంగాల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు కిమ్ చెప్పారు. సైన్యం, భ‌ద్ర‌త అంశంలోనూ త‌మ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ద‌న్నారు. ఇరాన్‌లో కొన‌సాగుతున్న అమెరికా దాడుల

తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

జపాన్‌లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా పార్క్‌లో ఉగాది పండుగను తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన

ఒమన్ లో అంగరంగ వైభవంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం

గల్ఫ్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఒమాన్ రాజధాని మస్కట్‌లోని శ్రీ కృష్ణ మందిర ప్రాంగణంలో  ఒమాన్ తెలంగాణ సమితి (ఒ.టి.యస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెల్లవారుజామున సుప్రభాతంతో మొదలై సాయంత్రం మహాప్రసాదంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో భారతీయ రాయబారి జి.వి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒమాన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలన్నీ కూడా సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని శివపార్వతులను ప్రార్థించామని ముఖ్య

ఇరాన్‌తో యుద్ధం వేళ కీలక పరిణామం.. ప్రధాని మోదీకి

ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇరాన్ యుద్ధం సహా పశ్చిమాసియా పరిస్థితులు, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇటు ప్రధాని మోదీ పేర్కొనగా, అటు అమెరికా తరఫున ఇండియాలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధిని తెరవడం చాలా

ఆ దేశానికి ఆ అవకాశం ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవ్ … బ్రిటన్‌కు ఇరాన్‌ వార్నింగ్‌

పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్‌ దేశాలు మిస్సైల్‌లు, డ్రోన్‌లతో ఇరాన్‌ పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్‌ తనచుట్టూ ఉన్న దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన, ఇజ్రాయెల్‌పైన భీకర దాడులు చేస్తున్నది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్, బ్రిటన్‌ కు తీవ్రమైన హెచ్చరికలు చేసింది. తమపై దాడుల కోసం అమెరికా దళాలకు బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకునే అవకాశం ఇస్తుందనే వార్తల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ వివాదంలో

ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి

గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఎన్నో కోట్ల విలువైన ఆస్తిలు ధ్వంసమయ్యాయి. ఇంత జరిగిన ఈ యుద్ధ వాతావరణం చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఇంధన లోటుతో పలు దేశాలు ఇబ్బందులు ఎదురుకుంటున్నాయి. తాజాగా హర్మూజ్ జలసంధిని తెరవాలని

ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ .. ఏం మాట్లాడారంటే!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్‌, పర్షియన్‌ నూతన సంవత్స నౌరుజ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు, ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ప్రధాని ఖండించారు. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగాలని, నౌకామార్గాలు తెరచి ఉంచడం,

బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి చేదువార్త .. ఏప్రిల్ 8 నుండి అమలు!

ఉన్నత చదువుల కోసం, పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని కేటగిరీల వీసా దరఖాస్తు రుసుములను పెంచుతున్నట్లు బ్రిటన్ హోమ్ ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది. సవరించిన ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8వ తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో విదేశీయులపై దాదాపు 6 నుంచి 7 శాతం వరకు అదనపు

ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ

ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్)కు చెందిన అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మరణించాడు. ఈ విషయాన్ని ఇరాన్  వెల్లడించింది. ఇజ్రాయెల్ జరిపిన మిస్సైల్ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు  తెలిపింది.టెర్రరిస్టులు అయిన అమెరికా, జియోనిస్టులు జరిపిన దాడిలో తమ జనరల్ నైని వీరమరణం పొందారని ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనితోపాటు సెక్యూరిటీ

జపాన్  ప్రధానికి షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

జ‌పాన్ ప్ర‌ధాని స‌నేయి త‌కాయిచికి షాకిచ్చారు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌. ఓవ‌ల్ ఆఫీసులో ట్రంప్‌ను జ‌పాన్ ప్ర‌ధాని క‌లిశారు. ఇటీవ‌ల ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాలు దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే మిత్ర దేశాల‌తో సంప్ర‌దింపులు చేయ‌కుండా ఇరాన్‌పై ఎందుకు దాడి చేశార‌ని ఓ రిపోర్ట‌ర్ అడిగారు. దానికి ట్రంప్ స్పందిస్తూ త‌నదైన స్ట‌యిల్‌లో జోకేశారు. తాము ఆ దాడి గురించి ఎవ‌రికీ చెప్ప‌లేద‌ని, ఎందుకంటే మేం స‌ర్‌ప్రైజ్

ఇరాన్‌లో అమానవీయ ఘటన.. బహిరంగంగా ముగ్గురిని

ఒక పక్క ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో పాల్గొంటూనే మరో పక్క తమ దేశంలో కార్యకలాపాల్ని ఇరాన్ సైలెంటుగా కానిచ్చేస్తోంది. తాజాగా ముగ్గురిని ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. మృతుల్లో 19 ఏళ్ల రెజ్లర్ కూడా ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై ఈ ముగ్గురికి ఉరిశిక్ష వేసింది. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఇరాన్‌లో ప్రజల్లో తిరుగుబాటు మొదలైన సంగతి తెలిసిందే. అక్కడి ధరల పెరుగుదల, నిరుద్యోగం, కరెన్సీ

ఉత్తర కొరియా ఎన్నికల్లో కిమ్‌ ప్రభంజనం.. అన్ని సీట్లలో

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ మరో సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ పార్టీ ఏకంగా 99.93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. కొరియాలో అతిపెద్ద వ్యవస్థ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఇదే అక్కడ దేశాన్ని పాలించే పార్లమెంటరీ. ఈ నెల 15న ఉత్తర కొరియాలో 15వ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఇందులో కిమ్ పార్టీ అయిన వర్కర్స్ పార్టీ

అక్రమ వలసదారులకు .. అమెరికా భారీ ఆఫర్

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. బలవంతంగా కాకుండా, వారంతట వారే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇలా వెళ్లేవారికి 2,600 డాలర్లు (సుమారు రూ.2.40 లక్షలు) ఎగ్జిట్ బోనస్ గా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు, వారి స్వదేశాలకు వెళ్లేందుకు అయ్యే విమాన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది.

ఆయన ఎక్కడ ఉన్నా వెంబడించి.. అంతం చేస్తాం : ఇజ్రాయెల్‌ వార్నింగ్‌

గత కొన్ని రోజులుగా పశ్చియాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా యుద్ధ వాతావరణం చల్లబడటం లేదు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. అయితే

ఎన్ఐఏ అదుపులో అమెరికన్‌

అమెరికా కిరాయి సైనికుడు మాథ్యూ వాన్‌డైక్‌  ను భారత్‌లో అరెస్ట్‌ చేశారు. అతడితోపాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులో ఉన్నారు. వారు పర్యాటక వీసాపై దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, భారత్ వ్యతిరేక సంస్థలతో పనిచేస్తున్నారని ఎన్‌ఐఏ వెల్లడించింది. మాథ్యూ వాన్‌డైక్‌ అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రానికి చెందినవాడు. అతను తనను తాను ఒక అంతర్జాతీయ వ్యాపారవేత్తగా, సైనికుడిగా, వార్ కరస్పాండెంట్‌గా‌, కాలమిస్ట్‌గా వెబ్‌సైట్‌లో

ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ

అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో అగ్ర నేతల్ని కోల్పోతున్న ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతిబ్‌ హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్‌లో జరిపిన కాల్పుల్లో ఖతిబ్ మరణించినట్లు ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది. అయితే, ఈ విషయాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. ఇరాన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, నిఘా వ్యవస్థ, గూఢచర్యంతోపాటు ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్

ప్రతీకారమే లక్ష్యం .. కాల్పుల విరమణ లేదు : ఖమేని

తమ దేశంపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం అని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని స్పష్టం చేసినట్లు సమాచారం. ఖమేనికి సంబంధించిన వివరాలేవీ తెలియనప్పటికీ, ఆయన మాత్రం ఇజ్రాయెల్‌, అమెరికాలపై ప్రతీకారంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రస్తుత యుద్ధ సమయంలో అనుసరించాల్సిన విధానంపై జరిగిన ఒక విధానపరమైన సమీక్షా సమావేశం సందర్భంగా ఖమేని ఈ మాటలు చెప్పినట్లు ఇరాన్ అధికార వర్గాలు

ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ … కీల‌క నేత లారిజానిని

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. ఈ దాడిలో లారిజానితోపాటు ఇరాన్ టాప్ కమాండర్ గోలాంరెజా సోలేమని కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే, ఈ విషయంపై ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అంతమైన తర్వాత కూడా అమెరికా, ఇజ్రాయెల్

అమెరికాలో విషాదం.. వరంగల్ వాసి మృతి

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) మృతిచెందాడు. భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం రాకేశ్ గుండెపోటుతో మరణించాడు. రాకేశ్‌కు 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లిన రాకేశ్, కుటుంబంతో కలిసి వర్జినీయాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. పదేళ్లుగా విదేశాల్లో ఉంటూ ఉన్నత స్థితికి చేరుకున్న రాకేశ్, చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించాడనే వార్త వరంగల్‌లోని

అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో చేపట్టబోయే చైనా పర్యటనకు ముందు, ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధులు పారిస్‌లో సమావేశమయ్యారు. అమెరికా  ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ , చైనా వైస్ ప్రీమియర్ హీ లిఫెంగ్ నేతృత్వంలో ఆదివారం ఈ ఆర్థిక చర్చలు ప్రారంభమయ్యాయి. మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు ట్రంప్ బీజింగ్‌లో పర్యటించే అవకాశం ఉందని వైట్ హౌస్ ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. అమెరికన్

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత .. ఎందుకంటే!

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మూడో వారానికి చేరాయి. పశ్చిమాసియాలో పొరుగుదేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. డ్రోన్ దాడులతో అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఈ నేపధ్యంలో సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఒక డ్రోన్ ఇంధన ట్యాంక్‌ను లక్ష్యంగా ఢీకొట్టడం కారణంగా, భారీ మంటలు చెలరేగాయి. ఫలితంగా దుబాయ్ సివిల్ ఏవియేషన్

అమెరికాలో 11 మంది భారతీయుల అరెస్ట్ ..కారణమిదే!

అమెరికాలో గ్రీన్‌కార్డు పొందడం కోసం చోరీ నాటకాలు ఆడిన 11 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. యూ వీసా పొందడానికి తాము నేర బాధితులమని నమ్మించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో నేరాలకు బాధితులై, విచారణకు సహకరిస్తే యూ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌ (యూ వీసా) లభిస్తుంది. ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ వీరు ఈ నాటకానికి తెరలేపినట్లు ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

మేరీల్యాండ్ గవర్నర్‌కు ఆటా ఆహ్వానం

జులై 31, ఆగష్టు 1,2 తేదీల్లో మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌లో జరగనున్న 19వ అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభలకు మేరీల్యాండ్ రాష్ట్ర గవర్నర్ వెస్ మూర్‌ను ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ ఆహ్వానించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయస్థాయి తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జయంత్ గవర్నర్‌కు వివరించారు. 15వేల మందికి పైగా ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. అనంతరం మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్

విదేశీలకు ఊరటనిచ్చేలా భారత్‌ కీలక నిర్ణయం

ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం  విదేశీయులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగడంతో, భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయుల కోసం వీసా గడువు పెంపు, జరిమానాల మినహాయింపును ప్రకటించింది. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెల్లడించిన వివరాల ప్రకారం గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న వీసాలు,

డొనాల్డ్ ట్రంప్ కి మరో షాక్

పశ్చిమాసియాలోని ఇరాన్‌ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మరో షాక్ తగలనుంది. ప్రపంచక ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఫ్ఐఎఫ్ఎ) ఆయనపై నిషేధం విధించాలనే ఆలోచనతో ఉంది. పిఫా వరల్డ్‌కప్ పోటీలతో పాటు లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌ 2028కు హాజరవ్వకుండా ట్రంప్‌పై నిషేధం పడే అవకాశముంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడమే అందుకు కారణమని సమాచారం. గత కొన్నేళ్లుగా యూఎస్‌ఏ

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. దుబాయ్, బహ్రెయిన్ సహా పలు దేశాలపై దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో పోర్టులకు దూరంగా ఉండాలని యూఏఈ వాసులను ఇరాన్ హెచ్చరించింది. ఈ పోర్టులకు సమీపంలో దాడులకు దిగుతామని తెలిపింది. ఇక్కడి రహస్య మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడి చేస్తామని హెచ్చరించింది. ఇకపై యుద్ధంలో ప్రమాదకర బాలిస్టిక్ మిస్సైల్స్ ఉపయోగిస్తామని వెల్లడించింది. అలాగే మరింత ప్రభావవంతమైన ఆయుధాల్ని కూడా వినియోగించబోతున్నామని, అవి భారీ

వారిని అంతం చేస్తాను..  ట్రంప్ హెచ్చరిక

ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ వైమానికదళం కూడా ఇక ఉండదు అని అన్నారు. ఇరాన్ కు మరోసారి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మతి చెడిన నేతలకు ఇవాళ ఏం జరుగుతుందో మీరే చూస్తారని, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని తెలియజేశారు. ఇరాన్ నాయకులు భూమి పైనుంచి తుడిచిపెట్టుకుపోయారని, 47 ఏళ్లుగా ఇరాన్

కేంద్రం కీలక నిర్ణయం

భారతదేశంతో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్‌డీఐ) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా ఇతర సరిహద్దు దేశాల ఎఫ్‌డీఐలపై నిబంధనలను సరళతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న ముందస్తు అనుమతి నిబంధనను తొలగించింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తమిళనాడులోని మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

జపాన్ కీలక నిర్ణయం..  ఇండియా కూడా చేస్తుందా?

ఇప్పుడు ప్రపంచాన్ని చమురు సంక్షోభం వేధిస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లకు మించి పెరిగింది. ఈ నేపథ్యంలో చమురు సరఫరా పెంచి, ధరల్ని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమ దగ్గర ఉన్న వ్యూహాత్మక చమురు రిజర్వ్‌ను విడుదల చేస్తాయి. ఇప్పుడు జపాన్ అదే పని చేసింది. తమ దేశంలో ఉన్న వ్యూహాత్మక చమురు

అలా చేస్తే వారి ఆస్తులు సీజ్ చేస్తాం.. ఇరాన్ హెచ్చరిక

విదేశాల్లో ఉంటున్న తమ దేశ పౌరులకు ఇరాన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ శతృవులకు మద్దతుగా నిలిస్తే ఇరాన్‌లోని వారి ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. విదేశాల్లో ఉంటున్న ఇరాన్ పౌరులు ఆ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. శతృవులకు సహకరించడం, మద్దతు తెలపడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికాలకు అనుకూలంగా ఉండకూడదు. ఒకవేళ అలా

గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. స్వదేశానికి 52 వేల మంది భారతీయులు

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఈ నెల 1 నుంచి 7 వరకు గల్ఫ్‌ దేశాల నుంచి 52 వేల మంది భారతీయులు సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చేశారని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) శనివారం తెలిపింది. వీరిలో 32,107 మంది ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా, మిగిలిన వారు ఇతర వాణిజ్య, నాన్‌ షెడ్యూల్డ్‌ విమానాల ద్వారా భారత్‌కు చేరుకున్నారని తెలిపింది. గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల

ఇరాన్‌కు అండగా ఉంటామని హామీ …  పుతిన్

ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన అయతొల్లా మొజ్తాబా ఖమేనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. ఇరాన్‌కు మద్దతుగా ఉంటామని పుతిన్ హామీ ఇచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మొజ్తాబాకు శుభాకాంక్షలు. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్‌కు రష్యా అండగా నిలబడుతుంది. ఇరాన్‌లోని మా స్నేహితులకు, వారి సమగ్రతకు రష్యా మద్దతుగా ఉంటుంది. మొజ్తాబా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఇరాన్ ప్రజల్ని ఏకతాటిపైకి తెస్తారని

క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు.. కానీ, ఒక షరతు

ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా దాడులకు దిగిన సంగతి తెలిసిందే. గల్ఫ్‌ దేశాలతోపాటు తుర్కియే, అజార్ బైజాన్ వంటి అనేక దేశాలపై ఇరాన్ మిస్సైల్ దాడులు చేసింది. అయితే, ఇలా పొరుగు దేశాలపై దాడులు చేసినందుకు ఇరాన్ తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పారు. పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా.

ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతలు స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం  బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి ఏపీఎన్నార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి జయరాం కృషి చేస్తారని అన్నారు. ఏపీఎన్నార్టీ అధ్యక్షుడు వేమూరి రవి, సైన్స్‌

భారతీయులకు శుభవార్త.. హెచ్‌-1బీ వీసాలపై కీలక ప్రకటన

విదేశీ ఐటీ నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అమెరికా హ్-1భ్ వీసా ప్రక్రియ మొదలైంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజిస్ట్రేషన్లను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) ప్రారంభించింది. అయితే, ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ పలు కీలక మార్పులు చేపట్టింది. ఈ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 19 వరకు కొనసాగనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ గడువులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా,

రోజుకు రూ.8,000 కోట్లు ఖర్చు చేస్తున్న అమెరికా

ఏ రెండు దేశాల మధ్య యుద్ధమైనా.. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఇరువైపులా భారీ నష్టం ఉంటుంది. అందులోనూ యుద్ధం కోసం భారీగా నిధులు ఖర్చు చేయాలి. యుద్ధాల కారణంగా కొన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు పెడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక సమాచారం బయటకు రాదు. కానీ,

ఆస్కార్ వేదికపై మరోసారి ప్రియాంక చోప్రా హవా

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై భారతీయ కీర్తి పతాకాన్ని ఎగురవేయబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) వేడుకలో అవార్డు ప్రజెంటర్‌గా ప్రియాంక‌ ఎంపికయిన‌ట్లు తెలుస్తుంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 15న జరగనున్న ఈ మహా వేడుకలో హాలీవుడ్ అగ్ర నటులైన రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ వంటి దిగ్గజాలతో కలిసి

భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత విమానయాన సంస్థలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఇవాళ‌ ఒక్కరోజే 58 ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఇండిగో 30 విమానాలను, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిసి 23 విమానాలను నడపనున్నాయి.పశ్చిమాసియాలోని చాలా దేశాలు తమ గగనతలాన్ని

భారత్‌-కెనడా మధ్య కీలక ఒప్పందం

కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ భారత్‌లో పర్యటిస్తున్న వేళ, భారత్‌-కెనడా దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పై చర్చలు జరిపేందుకు కూడా అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోదీ, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

భారతీయుల భద్రతపై  ప్రధాని మోదీ ఆరా

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్య, ఇందుకు ప్రతిగా ఇరాన్ జరుపుతున్న దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణలు, డ్రోన్ దాడులపై విరుచుకుపడుతుండటం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఇరాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ 

ఇరాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతొల్లా అలీ ఖమేనీ మృతిచెందారు.ఇరాన్‌ మీడియా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఖమేనీ మరణంతో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. డౌన్‌టౌన్‌లోని ఖమేనీ కాంపౌండ్‌ లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో 86 ఏండ్ల ఖమేనీ మృతి చెందారని ఆ దేశ మీడియా ప్రకటించింది. ఖమేనీ మృతితో 40 రోజుల సంతాప దినాలతో పాటు

ఆ రెండు దేశాలను వెంటనే వదిలి రండి … భారతీయులకు కేంద్రం కీలక సూచనలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతి దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో అటు ఇరాన్‌లోని, ఇటు ఇజ్రాయెల్‌లోని భారతీయులకు మన రాయబార కార్యాలయాలు కీలక సూచనలు జారీచేశాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌లోని రాయబార కార్యాలయం ఒక అప్‌డేట్ ఇచ్చింది. భారతీయులు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇజ్రాయెల్ అధికారులు, హోం ఫ్రంట్ కమాండ్ జారీచేసే సేఫ్టీ గైడ్‌లైన్స్‌ను అనుసరించాలని సూచించింది. ఇజ్రాయెల్‌లోని

తానా ఆధ్వర్యంలో రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు, టార్పాలిన్‌ పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో రైతులకు సహాయంగా రైతు కోసం కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం – పొనుకుమాడు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.10 లక్షల విలువైన బ్యాటరీ ఆధారిత వ్యవసాయ స్ప్రేయర్లు, టార్పాలిన్‌లను 350 మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తానా కోశాధికారి రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ

లండన్‌ అగ్ని ప్రమాదంలో నిజామాబాద్‌  విద్యార్థి మృతి

లండన్‌లోని క్రొయిడాన్‌ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిజామాబాద్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన గొంతి అభిషేక్‌ ప్రాణాలు కోల్పోగా, ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిజామాబాద్‌కు చెందిన సాయి శ్రీకర్‌ను వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధరించారు.బ్రెయిన్‌డెడ్‌ నేపథ్యంలో సాయి శ్రీకర్‌ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించినట్టు నిజామాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో ఉండే అతడి తల్లిదండ్రులు వెల్లడించారు. సాయి శ్రీకర్‌, గొంతి అభిషేక్‌

భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన అమెరికా.. అన్నాద‌మ్ముల‌ను ప‌ట్టిస్తే

అమెరికా ప్ర‌భుత్వం భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. మెక్సికోలోని సిన‌లోవా కార్టెల్‌ను నిర్వ‌హిస్తున్న ఇద్ద‌రు అన్నాద‌మ్ములను ప‌ట్టిస్తే కోటి డాల‌ర్లు న‌జారానా ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. సిన‌లోవా డ్ర‌గ్ ముఠాకు చెందిన 42 ఏళ్ల రీని అర్జేట్ గార్సియాతో పాటు 52 ఏళ్ల ఆల్ఫాన్సో ఆర్జేట్ గార్సియా ఆ లిస్టులో ఉన్నారు. రీని అర్జేట్‌ను లా రాణా, ద ఫ్రాగ్‌గా పిలుస్తారు. అల్ఫోన్సోను అచిలిస్‌గా పిలుస్తున్నారు. శాన్ డిగోలో జ‌రుగుతున్న డ్ర‌గ్ నేరాల్లో

ఇజ్రాయెల్‌లోనూ యూపీఐ సేవలు : ప్రధాని మోదీ

భారత్ – ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ప్రతి సవాల్‌ను తట్టుకుని కాలపరీక్షకు నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై ఏర్పడిన ఈ బంధం ఎంతో బలమైనదని పేర్కొన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో

కాశీలో గంగమ్మ అలలపై ..మెక్సికో జంటకు పడవ పెళ్లి

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించేవాళ్లు ఈ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు నచ్చి ఎంతో మంది భారత్‌లో పర్యటిస్తుంటారు. పర్యాటక ప్రదేశాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలను సందర్శించి వాటి గురించి ఆసక్తిగా తెలుసుకుంటారు. ఇక్కడి సంప్రదాయాలు నచ్చడంతో ఎన్నో విదేశీ జంటలు మన దేశంలో వారణాసి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలవద్ద వివాహబంధంతో ఒక్కటవుతుంటాయి. తాజాగా రూయిజ్‌ కాబోల్, గొంజాలో మిగ్వెల్‌  జంట సైతం ఇదే ఆలోచనతో మెక్సికో

ఇదే జరిగితే రెండు దేశాల మధ్య యుద్ధం : అబ్బాస్ అరాగ్చి

అమెరికా,ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయొచ్చు. ఇదే జరిగితే రెండు దేశాల మధ్య భారీ యుద్ధానికి దారి తీస్తుంది. అయితే, ఈ పరిస్థితిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందించారు. అమెరికాతో యుద్ధానికైనా, శాంతికైనా సిద్ధమేనని ప్రకటించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అమెరికాతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం

క్షమాపణలు చెప్పిన మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు  బిల్‌గేట్స్

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరు ఉండటంపై మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, సంపన్నుడు బిల్‌గేట్స్ స్పందించాడు. తన బిల్‌గేట్స్ ఫౌండేషన్ స్టాఫ్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇటీవల టౌన్‌హాల్ మీటింగ్‌లో తన ఫౌండేషన్ స్టాఫ్‌తో జరిగిన అంతర్గత సమావేశంలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ తన చర్యలకు తనదే పూర్తి బాధ్యత అన్నాడు. తన సంస్థ సిబ్బందికి క్షమాపణ చెప్పాడు. అదో పెద్ద పొరపాటు అంటూ వ్యాఖ్యానించాడు. తన చర్యల వల్ల ఫౌండేషన్‌కు కలిగిన ఇబ్బందిపై బిల్‌గేట్స్

ఇజ్రాయెల్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. రాజధాని టెల్ అవివ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. ఇరువురు ప్రధానులు రెడ్ కార్పెట్‌పై నడుస్తూ, అధికారులు, సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రెండు దేశాలకు చెందిన అధికారులను పరిచయం చేసుకున్నారు. ఈ పర్యటన సమయంలో మోదీ పాకెట్‌లో

సౌదీ అరేబియా కీలక నిర్ణయం

అరబ్‌ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ వెల్లడించింది. నిషేధించిన దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది.ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలు, అంటువ్యాధులు వంటి అంశాలను సమీక్షించి ఈ నిషేధం విధించినట్లు సౌదీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ వెల్లడించింది.

ఈ యుద్ధంలో తాము విజేత‌లుగా నిలుస్తాం :  జెలెన్‌స్కీ

ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం నాలుగేళ్ల‌కు చేరుకున్న‌ది. 2022 ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ఉక్రెయిన్‌పై ర‌ష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడో మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టార‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ అన్నారు. జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడారు. ర‌ష్యాపై కాలుదువ్వ‌డాన్ని స‌మ‌ర్ధించుకున్న జెలెన్‌స్కీ, తామేమీ యుద్ధం నుంచి విర‌మించ‌డం లేద‌న్నారు. ఈ యుద్ధంలో తాము విజేత‌లుగా నిలుస్తామ‌ని

ఏంటో అన్నింటిలో మేమే గెలుస్తున్నాం :  డొనాల్డ్‌ ట్రంప్‌

మెక్సికో కు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ నెమెసియో ఒసెగుయెరా అలియాస్‌ ఎల్‌ మెంచో ను హతమార్చిన ఘనతను పూర్తిగా తన ఖాతాలో వేసుకునేందుకు అమెరికా  ప్రయత్నిస్తోంది. కానీ మెక్సికో మాత్రం ఎల్‌ మెంచో అంతానికి పక్కా ప్లాన్‌ చేసింది అమెరికా కాదని, తమ స్పెషల్‌ ట్రూప్స్‌ అని చెబుతోంది. మెక్సికో సైన్యం చేపట్టిన స్పెషల్‌ ఆపరేషన్‌లో ఎల్‌ మెంచో హతమయ్యాడు. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు

ఇరాన్‌లో కదంతొక్కిన విద్యార్థులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి

ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. గత నెలలో జరిగిన ఆందోళనను ప్రభుత్వం కఠినంగా అణచివేయడంతో సద్దుమణిగినట్టు కనిపించినా మళ్లీ మతపాలకులకు నిరసన తెలుపుతూ వీధుల్లోకి వచ్చారు. టెహ్రాన్‌లోని షరీఫ్‌ ఇంజినీరింగ్‌ యూనివర్సిటీ విద్యార్థులు బి షరఫ్‌ (సిగ్గుచేటు) అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమెనెయ్‌ను హంతక నేత గా అభివర్ణించారు. ప్రవాసంలో ఉన్న రాకుమారుడు రెజా పహ్లవీ

డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ..ఎప్పుడంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఖరారైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ అధికారి ఒకరు  అధికారికంగా పర్యటన తేదీలను ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, ఆర్థిక సంబంధాలను చక్కదిద్దడమే

సుప్రీంకోర్టు తీర్పుతో మారేదేమీ లేదు … మళ్లీ ప్రపంచ దేశాలపై

ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్‌లు చెల్లవని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం సుంకాలను విధించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. ప్రపంచ దేశాలపై సుంకాలకు సంబంధించి అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ట్రంప్ తప్పుబట్టారు. అత్యంత

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త రూల్స్ ..  ఇకపై తప్పనిసరి!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల నిబంధనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్జియాలోని రోమ్ నగరంలో జరిగిన ఒక సభలో ట్రంప్ ప్రసంగించారు. ఓటు వేయాలంటే ఓటర్ ఐడీ కార్డుతో పాటు పౌరసత్వ రుజువును తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కఠినమైన నిబంధనలు అవసరమని స్పష్టం చేశారు. డెమోక్రాట్లు కేవలం ఎన్నికల్లో మోసం చేసేందుకే ఓటర్ ఐడీని వ్యతిరేకిస్తున్నారని

ఇండియా విషయంలో ..బంగ్లాదేశ్ ప్రధాని కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య వీసాల జారీ రెండు నెలలక్రితం నిలిచిపోయింది. మూడు నెలల క్రితం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగాయి. అలాగే ఇండియాలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్

15 రోజుల్లో తేల్చాలి..ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

అమెరికా- ఇరాన్ మధ్య ఉన్న వివాదం ఎటూ తేలడం లేదు. తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాల్సిందే అని ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అయితే, ఈ అంశంపై ఇరాన్ కొన్ని షరతులు విధించింది. ఒకవైపు ఒప్పందంపై చర్చలు అంటూనే, రెండు దేశాలూ యుద్ధ సన్నాహాలు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. 10-15 రోజుల్లో ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకుని

ప్యాక్స్ సిలికాతో భార‌త్ ఒప్పందం

అమెరికాకు చెందిన ప్యాక్స్ సిలికా తో భార‌త్ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ప్యాక్స్ లికా డిక్ల‌రేష‌న్‌పై రెండు దేశాలు సంత‌కాలు చేశాయి. ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో జ‌రుగుతున్న ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్‌లో రెండు దేశాలు ఈ వ్యూహాత్మ‌క ఒప్పందంపై సంత‌కాలు చేశాయి. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, అమెరికా ప్ర‌తినిధి సెర్గియో గోర్ స‌మ‌క్షంలో ఈ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేశారు. అమెరికా ఆర్థిక వ్య‌వ‌హారాల మంత్రి జాక‌బ్ హెల్‌బ‌ర్గ్ కూడా పాల్గొన్నారు.

అమెరికా ప్ర‌క‌ట‌న‌పై త‌గిన ఆధారం లేదు: ర‌ష్యా

చమురు కొనుగోళ్లను భారత్‌ నిలిపివేసిందన్న అమెరికా ప్రకటనపై రష్యా ఘాటుగా స్పందించింది. ఆ వార్తలను విశ్వసించేందుకు తగిన ఆధారం లేదని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌ తన వైఖరి మార్చుకుందని విశ్వసించేందుకు ఎటువంటి ఆధారం లేదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా  తెలిపారు. ఈ కొనుగోళ్లు రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని కొనసాగించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు.

ఎదుగుతున్న దేశాలకు ఏఐతో మేలు :  సుందర్ పిచాయ్

కృత్రిమ మేధ ఇప్పుడు శరవేగంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియను ఆర్థికంగా ముందుకు సాగుతున్న దేశాలు సద్వినియోగం చేసుకోవచ్చునని గుగూల్ సిఇఒ సుందర్ పిచాయ్ తెలిపారు. ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ఏఐ హైపర్ ప్రోగ్రెస్‌ను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలననేది మన చేతుల్లోనే ఉందన్నారు. డిజిటల్ డివైడ్, ఏఐ డివైడ్‌లతో ప్రపంచ సార్వత్రిక ప్రగతి కుంటుపడుతుందన్నారు. ఏఐ రాకతో అనివార్యంగా వర్క్‌ఫోర్స్ మార్పులు జరుగుతాయి. కొన్ని

ఫ్రాన్స్‌తో ఇండియా కీలక ఒప్పందాలు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. మేక్రాన్, ప్రధాని మోదీ మధ్య చర్చల అనంతరం అనేక అంశాల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం ఫ్రాన్స్‌లో చదివేందుకు భారతీయ విద్యార్థులకు అవకాశాలు మెరుగవ్వనున్నాయి. 2030 నాటికి అక్కడ భారతీయ విద్యార్థుల సంఖ్య 30,000కు పెంచాలని నిర్ణయించారు. ఇప్పుడు అక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 10,000గా ఉంది.అంటే రాబోయే నాలుగేళ్లలో మరో

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్వహించిన ఈ శివాలయాల సందర్శన యాత్రకు విశేష స్పందన లభించింది. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు ఈ యాత్ర నిర్వహించారు. ఈ భక్తి యాత్రలో భాగంగా సింగపూర్‌లో ఉన్న 9-12 ప్రముఖ

అమెరికాలో భారత  విద్యార్థి అదృశ్యం

అమెరికాలో భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (22) ఫిబ్రవరి 9వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతని కోసం ఐదు రోజులుగా అమెరికా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆచూకీ లభించలేదు. ఈ మిస్సింగ్‌పై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాకేత్, అమెరికా కాలిఫోర్నియాలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు.

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.