దొరలకు సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చని, పేదల మధ్య పెరిగిన తనకు సమస్యలు తెలియవా? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లాలోని మిడ్జిల్లో కృతజ్ఞత సభ జరిగింది. సభలో రేవంత్ మాట్లాడుతూ తట్ట పనికి, మట్టి పనికి మనమే కావాలి కానీ, పరిపాలనకు పాలమూరు బిడ్డలు పనికిరారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అహంకారులకు
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ అయిన డీజీపీలను కొందరిని ప్రభుత్వం వివిధ పదవులలో కొనసాగిస్తున్న నేపథ్యంలో, పదవుల్లో ఉన్నవారికి ప్రస్తుతం కొనసాగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 26 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారుల తోపాటు ప్రస్తుత అధికారులకు బుల్లెట్ వాహనాలు తీసివేసింది. మాజీ డీజీపీలు స్వరణ్జిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తమకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ను చర్చకు రమ్మంటారని, వస్తే అరెస్ట్ చేస్తారని, తెలంగాణ భవన్ కు మంత్రి జూపల్లి వస్తానని ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. జూపల్లి తక్షణమే రాజీనామా చేయాలని, నిన్నటి వరకు రూ.8 లక్షల
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పాటు అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి కూడా విద్యార్థులతో కలిసి భోజనం అందించనున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు అందించే
ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసిఆర్ హెచ్ఆర్డి లోని బోధి పెవిలియన్లో ఇరువురు సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రగతిశీల పాలన, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు మరియు రాష్ట్రానికి దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చిన కీలక సంస్కరణల గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే రామకృష్ణా రావు (ఐఏఎస్) పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసిందని
హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ సమీపంలో ప్రధాన రహదారికి డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రంప్ స్పందించారు. భారతదేశంలోని హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన అవెన్యూకు నా పేరు పెట్టారు. ఈ విధంగా గౌరవం పొందిన తొలి అధ్యక్షుడిని నేనే, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగనీయబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మూసీ ప్రాజెక్టుకు భూ సేకరణ, పునరావాసంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ మానవీయ కోణంలో భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. భూములు కోల్పోయే వారికి పరిహారం, పునరావాసం విషయంలో రాజీ పడబోమన్నారు.
ప్రజల్లో చైతన్యం వచ్చిందని సర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్ ప్రక్రియను ఇసి పార్టీలకు అతీతంగా నిర్వహిస్తోందని, సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కొందరికి నాలుగైదు ఓట్లు ఉన్నాయని గతంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారని, డూప్లికేట్ ఓట్లు, దొంగఓట్లను తొలగించేందుకే ఇసి
రాష్ట్ర జలహక్కులపై సిఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ట్రిబ్యునల్, అపెక్స్ లేకుండానే దొడ్డి దారిన ఒప్పందాలు జరిగాయని అన్నారు. మన జలహక్కులకు ప్రమాదమని తెలిసినా రేవంత్ వత్తాసు పలుకుతున్నారని, ఎపి, కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల కోసం తెలంగాణ జలహక్కుల తాకట్టు సర్కార్ కుట్రని విమర్శించారు. తుంగభద్ర డ్యామ్ నూతన
తెలంగాణ నూతన సీఎస్గా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ముగియనుంది. ఆ వెంటనే సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, రాష్ట్ర పరిపాలనపై ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయనను తెలంగాణ కేడర్కు కేటాయించారు.
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన షాపుసాని మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు షాపుసాని శ్రీనాథ్ రెడ్డి (25) బ్రిటన్లో హఠాన్మరణం చెందాడు. ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లిన శ్రీనాథ్ రెడ్డి, అక్కడ లీసెస్టర్ పట్టణంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఎంఎస్ మొదటి సంవత్సరం
త్వరలో వినాయక చవితి సందడి మొదలు కానుంది. దేశమంతా గణపతి విగ్రహాల తయారీ మొదలైంది. తెలుగురాష్ట్రాల్లో ఖైరతాబాద్ విఘ్నేశునిది ప్రత్యేక స్థానం. ప్రతిసారీ లంబోదరుడు అత్యంత ఎత్తైన, విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. ఈసారి బడా గణేశుడు 69 అడుగుల్లో పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నమూనా చిత్రం విడుదల చేసింది. విగ్రహానికి ఓవైపు కాళీమాత, మరోవైపు సోమనాథ జ్యోతిర్లింగం ప్రతిమలను ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆఱ్) సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి జులై 24 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా హిమాయత్నగర్ వార్డు కార్యాలయంలో బిఎల్ఒలకు ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు అందించారు. బిఎల్ఒలు ఇంటింటికీ వెళ్లి వీటిని ఓటర్లకు అందజేస్తారు. ఓటర్లే ఈ దరఖాస్తులను పూర్తి చేసి, బిఎల్ఒలకు అందజేయాలను అధికారులు సూచించారు. రెండు రోజుల తర్వాత బిఎల్ఒలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు సేకరిస్తారు.
ఎస్ఐఆర్ విషయంలో సీరియస్గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ తో బీజేపీ కుట్ర చేస్తోందని, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉంటూ మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. తనకి ఒక నియోజకవర్గం కేటాయిస్తే వెళ్లి పనిచేస్తానని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం జూన్ 30తో ముగియనుండటంతో అదే రోజున సంజయ్ జాజు నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారని అధికారిక వర్గాల సమాచారం.1992 బ్యాచ్ తెలంగాణ
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంయుక్తంగా భేటీ అయ్యారు.ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నిన్న(సోమవారం) కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో రేవంత్ సమావేశమయ్యారు. మెట్రో రైల్ విస్తరణపై సానుకూల వాతావరణంలో
అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) అనారోగ్యంతో మృతిచెందాడు. ఉన్నత విద్య కోసం కొంతకాలం కిందట అమెరికాకు వెళ్లిన అరుణ్ ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. టెంపాలో స్టెమ్ ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)గా ఉన్నాడు. ప్రస్తుతం ఫుల్ టైమ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 13వ తేదీన అరుణ్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ
బండి భగీరథ్కు బెయిల్ లభించింది. ఏడు రోజుల పాటు హైదరాబాద్ మల్కాజ్గిరిలో ప్రత్యేక పోక్సో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. భగీరథ్ తన చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా కోర్టు ఈ తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మధ్యంతర బెయిల్ ఏడు రోజుల కాలానికి మాత్రమే పరిమితమని, కోర్టు
హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఎట్టకేలకు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు లభించాయి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు ప్రారంభించడానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ఈ కీలక పరిణామంపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ
ప్రాంతీయవాదాన్ని వేర్పాటువాదంతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. కరీంనగర్లో తెలంగాణ రక్షణ సేన జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసు పెట్టడం చేతకాని ప్రభుత్వం తెలంగాణలో ఉందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ విషయాన్ని ప్రాధాన్యత లేని
దక్షిణాఫ్రికాలో ప్రముఖ బ్రాండ్ అయిన హాల్స్ సంస్థ సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ దేశవ్యాప్తంగా కొంతమందిని వింటర్ హీరోస్ గా ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా తెలంగాణ బిడ్డ గుర్రాల నాగరాజు చోటు దక్కించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. గత 18 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడి, సమాజ సేవలో నిబద్ధతతో పని చేస్తూ నాగరాజు అనేక
తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ను చర్చలకు ఆహ్వానించామని, చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించాలని కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఆర్ అండ్ బీలో రూ.4వేల కోట్లు బకాయిలు పెట్టిందని, కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. యాదగిరిగుట్ట నిర్మించామని గొప్పలు చెబుతున్నారని, గుట్ట బిల్లులు కూడా రూ.350 కోట్లు బకాయిలు పెట్టారన్నారు.బిల్లుల కోసం
హైదరాబాద్ ను విశ్వనగరమని చెప్పుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాతో రవాణా సౌకర్యాలు కూడా ఉండాలని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో హైదరాబాద్ లో మెట్రో నిర్మించాలని, 2017 నాటికి 15 వేల కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలనే ప్రణాళికతో ప్రారంభించారు తెలియజేశారు. చారిత్రక ప్రాంతాలు ఉన్నాయని బిఆర్ఎస్ హయాంలో మెట్రో పనులు పెండింగ్
దేశ సమగ్రత, శ్రేయస్సే జనసేన ఎజెండా అని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఢిల్లీలో పవన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని పార్టీలు స్వలాభం కోసం దేశ సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని అన్నారు. దేశ శ్రేయస్సే జనసేన ముఖ్య ఉద్దేశమని, అధికారంలోకి రావాలన్న ఆశతో పార్టీ పెట్టలేదని తెలియజేశారు. తెలుగు రాష్ట్ర్రాల్లో 20 లక్షలకు పైగా జనసైనికులు ఉన్నారని, పార్టీ బాగుపడాలంటే, దేశ సమగ్రతకు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వర్షాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హై అలర్ట్ ప్రకటించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, యుద్ధ ప్రాతిపదికన వర్ష ప్రభావిత
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హైకమాండ్ సీరియస్గా స్పందించింది. మహిళలను కించపరిచేలా, అలాగే పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వైరల్ అయిన ఆడియోలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో పాటు
తెలంగాణకు వచ్చేందుకు, వెళ్లేందుకు, పోటీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే, పవన్ కల్యాణ్పై తమ మంత్రులు మాట్లాడారన్నారు. శాంతిభద్రతల కారణం తోనే ఆయన సభకు అనుమతి ఇవ్వలేదు. తనకు హిట్లర్ ఆదర్శం అని తానెప్పుడూ చెప్పలేదని
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డును యథావిధిగా ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మెడికల్ బోర్డును పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ బోర్డులో అక్రమాలు, మధ్యవర్తిత్వానికి తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంచిర్యాలలో 335 మంది వారసులకు ఉద్యోగ
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిగా దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించడం వెనుక రాష్ట్రంలోని ఆ పార్టీ నేత హస్తం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. మీనాక్షి నటరాజన్పై కేసు ఉన్నట్లు తెలంగాణ నుంచే తమకు సమచారం అందిందని మధ్యప్రదేశ్
మాజీ ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్)పై బిఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టిఆర్ఎస్ పేరు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉందని, అందువల్ల ఆ పేరు కేటాయించ వద్దని ఇసిని కోరింది. ఇప్పటికీ ప్రజలు బిఆర్ఎస్ను టిఆర్ఎస్గానే గుర్తిస్తారని పేర్కొంది. టిఆర్ఎస్ పేరుపై ఇసి దాదాపు 700 అభ్యంతరాలు అందాయి. కవిత పార్టీపై అభ్యంతరాలు చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ వేయగా, అది తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రాలతో సమర్పించిన అఫిడవిట్లో ఒక పెండింగ్ కేసుకు సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నామినేషన్ల పరిశీలన సమయంలో బీజేపీ నాయకులు రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం తెలిపారు. పెండింగ్లో ఉన్న ఒక
మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదని మీకు ఏం కావాలన్నా చేయడానికి ముఖ్యమంత్రిగా మీ సోదరుడు ఉన్నాడని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన మహిళాశక్తి సభలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతులోనే ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తానని వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సరఫరా అంతా మహిళలకు అప్పగించే బాధ్యత తానే తీసుకుంటాన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణిలో యాత్ర చేశానని, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు చేస్తానని బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను అడిగినా చేయలేదని, 2028లో అధికారంలోకి రాగానే ఖచ్చితంగా వారికి ఆదాయపుపన్ను మినహాయింపు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో గత 12 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలపై
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సింగపూర్లో జరుగుతున్న అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక అంశాలపై కేటీఆర్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. అలాగే గతంలో కేసీఆర్ సింగపూర్,
తెలంగాణలో రేపటి నుంచి భూముల మార్కెట్ విలువలు పెంచుతున్నట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.సచివాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకర్లతో మీడియాతో మాట్లాడారు. భూముల ధరలు ఏరియాను బట్టి 50 నుంచి100 శాతం పెరుగుతాయని తెలిపారు. ప్రైమ్ ఏరియాలో 100 శాతం పెరుగుతాయన్నారు. భూముల వ్యాల్యూ పెరగటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1200 నుంచి రూ.1400 కోట్ల మేర ఆదాయం వస్తుందని చెప్పారు. హయ్యర్ సైడ్ ఏరియాలు శేరిలింగంపల్లి,
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్కి అనుమతి ఇస్తే ఏమవుతుంది? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా, పవన్ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ని మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంని ఎందుకు దగ్గరకు తీసుకున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, జనసేన సభ కోసం అనుమతి అడిగారని, ఇచ్చి ఉంటే
బాల్క సుమన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత కోపమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో బాల్క సుమన్ కలిసేందుకు కెటిఆర్, చంచల్ గూడ జైలుకు వెళ్లారు.బాల్క సుమన్ తో ములాఖత్ అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్పై
మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ కెటిఆర్ కాంగ్రెస్ సర్కార్కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినప్పటికీ, ఇవ్వక తప్పనిసరి పరిస్థితి కల్పించింది మాత్రం కెసిఆరేనని అన్నారు. కెసిఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందనేది నిర్వవాదాంశమని స్పస్టం చేశారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడారు. 2014లో తెలంగాణలో సాగుబూమి విస్తీర్ణం 1.50 కోట్ల ఎకరాలు మాత్రమే. 2023 బిఆర్ఎస్ సర్కార్ దిగిపోయే సమయానికి సాగు భూమి విస్తీర్ణం
జనసేన కనుమరుగు అవుతుందేమో గానీ, కమ్యూనిజం చచ్చిపోదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ మీడియా సమావేశంపై ఆయన విమర్శలు గుప్పించారు. నేను, మా నాన్న కమ్యూనిస్టులమని పదేపదే చెప్పావు, మరి ఆ కమ్యూనిజం ఎక్కడికి పోయింది పవన్? సనాతన ధర్మాన్ని ఎవరు అవమానించారు? ప్రపంచ కార్మికులారా విడిపోండి అని మేము పిలుపునిచ్చామా? మమ్మల్ని ఎందుకు
తెలంగాణ భారతదేశంలో అంతర్భగం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతుందని అడుగుతున్నారని అన్నారు. జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్ నడిబొడ్డున అని ఇది తెలంగాణపై కొత్తగా తెచ్చుకున్న ప్రేమకాదని తెలియజేశారు. ఇప్పుడు విమర్శించే గొంతుకలు 2007 లో లేవని, ఆదిలాబాద్ లాంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో
నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సిఎం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ప్రముఖ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజీ అన్నారని తెలిపారు. ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై టిపిసిసి ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడి పవన్ ను ఆదరిస్తామని, రాజకీయ నాయకుడి విభేదిస్తామన్నారు. పవన్ ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తి అని, నటుడిగా ఆయనను ప్రజలు అభిమానిస్తారని, రాజకీయ నాయకుడిగా వ్యతిరేస్తామన్నారు. పవన్ ఎపికి డిప్యూటీ సిఎంగా సేవలందిస్తున్నారు. ఆయన వెనక ఉండి ఎవరో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2వ తేదీల్లో అమెరికా మేరీల్యాండ్లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానించింది. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను కేటీఆర్కు
మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బిఆర్ఎస్ తప్పుకుంటుందా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిఆర్ఎస్కు సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఎంసిఆర్హెచ్ఆర్డిలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం కెసిఆర్ రైతుల ముసు గులో లైఫ్లైన్ కోసం ప్రయత్నిస్తున్నార న్నారు. రైతులను అడ్డుపెట్టుకొని బిఆర్ఎస్ రా
ధాన్యం సేకరణలో దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్యా లేదని తెలిపారు. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రైతుల నుంచి ధాన్యం సేకరించలేకపోవటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, అధికారులు,
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భట్టి విక్రమార్క ఆదేశాలతో తొలి విడత రూ.2 వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్
ఫోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్కు 3 రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. ఇవాళ్టితో 3 రోజుల పోలీసు కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత మల్కాజ్గిరి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించారు. . ప్రధానంగా బాధితురాలితో ఇన్స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్చాట్లలో ఛాటింగ్లకు సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వాటి ఆధారంగానే భగీరథ్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రీవనం చౌరస్తాలో కొలువుదీరింది. నూతనంగా ఏర్పాటుచేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గతంలో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, మైత్రీవనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నగరంలోని ఎన్టీఆర్ అభిమానుల చిరకాల వాంఛను
పోక్స్ కేసులో నిందితుడు బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని మొయినాబాద్లోని అరణ్య ఫామ్హౌస్కు తరలించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం భగీరథ్ను పోలీసులు ఈ ఫామ్హౌస్కు తీసుకెళ్లినట్ల తెలుస్తోంది. మరోవైపు భగీరథ్ను మూడు రోజులపాటు ప్రశ్నించేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. పోక్స్ కేసులో అరెస్టయిన బండి భగీరథ్ చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడిని కస్టడీకి కోరుతూ మేడ్చల్
సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని చెప్పారు.
రెండేళ్లలో పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేస్తానని ఆనాడు మాజీ సిఎం కెసిఆర్ అన్నారని మంత్రి జూపల్లి కృష్ణా రావు తెలిపారు. ఈ సందర్భంగా సిఎల్పి కార్యాలయంలో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు 90శాతం పూర్తిచేసినట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం దారుణమన్నారు. రూ. లక్షకోట్ల ప్రాజెక్టుపై రూ.25 కోట్లే ఖర్చు పెట్టారని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త హెల్త్ స్కీమ్ అమల్లో భాగంగా రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు వైద్య భద్రత
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం మరోసారి వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని తొలుత ఈ నెల 14వ తేదీన ఏర్పాటు చేశారు. అదే రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉండడంతో భేటీని ఈనెల 21వ తేదీకి గతంలో వాయిదా వేశారు. అయితే, ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దీంతో కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ విజ్ఞప్తి
బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. బాలికను లైంగికంగా వేధించిన కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. అయితే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం పోలీసులు ఇప్పటికే వెతుకున్నారు. నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపడుతుండగా, భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదైన తర్వాత పోలీసులు కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్లో బండి భగీరథ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బండి
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన,
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా మే 22న సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ వేదికగా జరిగే చివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉందని సిపి సజ్జనార్ ఫ్యాన్స్ని హెచ్చరించారు. ఐపిఎల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తాయని సజ్జనార్ తెలిపారు. అధికారిక
తెలంగాణ రైజింగ్తో త్రీ ట్రిలియన్ ఎకానమీ కోసం తాము పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కొండాపూర్ మండలం తొగర్పల్లిలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహలు పర్యటించారు. రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో భారీ ఫుడ్ ఇండస్ట్రీకి మంత్రులు భూమి పూజ చేశారు. ఈ
బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో, ఆయన వెకేషన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈనెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రైల్ రోకో కేసులో బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుకావాలని హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. 2025 నవంబర్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళా కమిషన్కు కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన తెలంగాణ మహిళా కమిషన్కు చైర్ పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పలువురు ప్రముఖ మహిళలకు అవకాశం కల్పించింది. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల నుంచి మొదలుకొని మండల, గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాలు ఎగురవేసి, పార్టీ ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారంపై చర్చ జరిపారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్ లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాలని, పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదయినట్లు సమాచారం. 17 ఏళ్ల బాలికకు బండి సంజయ్ కుమారుడు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్హౌస్తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం. దీంతో బాలిక రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరకు నిన్న అర్ధరాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. అయితే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సమర్పించిన సిఫార్సుల మేరకు పలు కులాల పేర్లను మారుస్తూ, మరికొన్ని కులాలకు గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బీసీ జాబితాలోని గ్రూప్-ఎ, గ్రూప్-డీ విభాగాల్లో ఈ మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ లోని వరుస సంఖ్య 7లో ఇప్పటి వరకు ఉన్న దొమ్మర అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో గడ వంశీయ
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆ నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే లేదన్నారు. దేశ రాజధాని నుంచి తాము నిధులు తెస్తుంటే, కాంగ్రెస్
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రిపీటెడ్గా డ్రగ్స్ కేసులో పట్టుబడితే పీడీ యాక్ట్ తరహా చట్టాన్ని ఉపయోగిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈగల్ ఫోర్స్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. నార్కోటిక్స్పై అలర్ట్గా ఉన్నామని, డ్రగ్స్ కట్టడి
ఉత్తరాది, దక్షిణాది అని పదపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి కరీంనగర్ లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రులకు వెళ్లిన బండి సంజయ్ కుమార్ పిఎంజే జువెలర్స్ దోపిడీ
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను రాష్ట్ర మంత్రి హోదాతో ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వీ.హెచ్ కు నెలకు రూ. 1,00,000 వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ క్వార్టర్ కేటాయించని పక్షంలో, నెలకు రూ. 50,000 ఇంటి అద్దె పొందే వీలుంది. ప్రభుత్వ పనులకు
కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కవిత సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. “తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావులపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు కాంగ్రెస్ నేత సంపత్కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ పార్టీపై తనపై తప్పుడు ప్రచారం చేసి పరువుకు భంగం కల్గిస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు. జన్వాడా ఫాం హౌజ్లో కట్టుకథలు రచించి లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లను రూ.8కోట్లు అడిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందనున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రస్తుత డీజీపీ కె. శివధర్ రెడ్డి ఏప్రిల్ 30వ తేదీన
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 26వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా లండన్లో ఏన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి గులాబీ జెండా పండుగ నిర్వహించి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. యూకే లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎందరో
మాజీ సిఎం కెసిఆర్ పార్టీకే మనుగడ లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి గతం ఉందని, భవిష్యత్ లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై సిఎం స్పందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త పార్టీ సంగతి తరువాత, ఉన్న పార్టీ ఉంటుందా, ఊడుతుందా? అని ప్రశ్నించారు. ఉద్యమం అప్పుడు ఎలా మాట్లాడినా సహంచారని, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా
బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు కెసిఆర్ తెలిపారు. బిఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు
తెలంగాణ రాజకీయాల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. శాసనమండలిలో ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో న్యాయపరమైన చిక్కుల వల్ల ఆగిపోయిన ఈ నియామకాలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలపడంతో లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంత్రి అజారుద్దీన్
ఇటీవల మృతి చెందిన ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం, పొలాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగారాజం గల్ఫ్లో ఉండగా అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లడంతో స్వదేశానికి తరలించాల్సి వచ్చింది. ఇక్కడ చికిత్స పొందుతూ పదిరోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధితుడి కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం
కాళేశ్వరం ప్రాజెక్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం తీర్పును సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని టీజీ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే న్యాయ విభాగంతో చర్చలు పూర్తయ్యాయని, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై న్యాయస్థానంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ
జగిత్యాలలో మాజీ సిఎం కెసిఆర్ సభ జరిగే సమయానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. పులిని చూసి నక్క వాలు పెట్టుకున్నట్లు చేశారని అన్నారు. కెసిఆర్ స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి స్థాయి ఏందో ప్రజలకు అర్థమైందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి మాత్రం కడుపుమంటతో మాట్లాడారని
భూముల ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయని బిజెపి ఎంపి అర్వింద్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ చెప్పినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 72 ఏళ్ల వయసులోనూ కెసిఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, భారీగా బకాయిలు పెట్టి పోయారని విమర్శించారు. కెసిఆర్ హయాంలోనే సివిల్ సప్లయ్ లో అక్రమాలు ప్రారంభమయ్యాయని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాటి
కేసీఆర్ భారీ బహిరంగ సభ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ జగిత్యాల కేసీఆర్ సభ పోస్టర్ ని ఆవిష్కరించారు. ప్రజలంతా కేసీఆర్ సందేశం కోసం ఎదురుచూస్తున్నారని, అలాగే
మహిళా బిల్లు వీగిపోవడం బిజెపి విధానాల ఓటమిగా భావిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లు పేరుతో డీలిమేషన్ బిల్లు తీసుకు వచ్చిందని అన్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని తెలియజేశారు. మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్రమోడీకి నిజాయితీ లేదని విమర్శించారు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే మద్దతు
జగిత్యాల లో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక పోరాటాలు చేసి తన ప్రాణాలను పణంగా
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అత్యంత దారుణమని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. బిల్లును వ్యతిరేకించిన వారికి చీకటి రోజులు దగ్గర పడ్డట్టేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే. ఓటింగ్ ప్రక్రియలో 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. దీంతో
అమెరికా నేషనల్ వార్ కాలేజ్ బృందంతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ సిద్ధంగా ఉందని, టిజి-ఐపాస్ ద్వారా 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అమెరికాతో దీర్ఘకాలిక వ్యూహాత్మక
లోక్సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత ఏపీలో
మహిళ రిజర్వేషన్లు, డీలిమిటేషన్ల రెండు అంశాలను బిజెపి కలిపి రాజకీయం చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డీ-లిమిటేషన్పై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు కీలకమైన అంశాలు. రెండు అంశాలు దేశ ప్రజలందరికీ సంబంధించిన కీలక అంశాలు. బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని బిజెపి దుష్ప్రచారం చేస్తోంది. మహిళలకు రాజకీయ
బిఆర్ఎస్ అధినేత మాజీ సిఎం కెసిఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు జారీ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. అంగన్వాడీ మొబైళ్ల కొనుగోలుతో తనకు సంబంధం లేదని సీతక్క అన్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కెసిఆర్దే బాధ్యత అని సూచించారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి
తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పు తెగుతుంది జాగ్రత్త అంటూ మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై స్కాం అంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. కేంద్రం నిర్దేశించిన స్పెసిఫికేషన్స్, ధరల ప్రకారం
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మద్దతునివ్వాలని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. ఈ బిల్లు ఆమోదంతో దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పడుతుందని ఆమె తెలిపారు.యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే మన భారతీయ సంస్కృతి ప్రకారం, ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారని, అటువంటి గొప్ప సంప్రదాయం మన దేశంలో ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో,
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 100 స్థానాలు గెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముక్కలైంది, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని, కాంట్రాక్టర్లు నుంచి కమీషన్లు తీసుకోవడం వల్లే కాళేశ్వరం కూలిందని మండిపడ్డారు.
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీనే అని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెటిఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పాలన అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ను కలిసిన సమయంలో జీవన్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అన్నా… నన్ను మీతో కలిసి పని చేయమని దేవుడే పంపిండు అంటూ ఆయన కేసీఆర్ను ఆలింగనం చేసుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.జీవన్
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం పెంపును ప్రకటిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేలమంది ఆర్టీసీ కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది. తాజా నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెరిగింది. గతంలో ఇది 50.7 శాతం ఉండగా, తాజా పెంపుతో 52.8 శాతానికి చేరుకుంది. గత ప్రభుత్వం చివరిసారిగా
కొత్త పార్టీపై కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తాను స్థాపించబోయే కొత్త పార్టీని ఏప్రిల్ 25న ప్రకటిస్తానని వెల్లడించారు. ఆ రోజు నిర్వహించనున్న సభ కోసం ఇప్పటికే 21 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారని, కార్యక్రమం సజావుగా జరిగేలా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు 500 మంది వాలంటీర్లను నియమించినట్లు కవిత తెలిపారు. సభకు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన్ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ శేష జీవితంలో కెసిఆర్తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని అన్నారు. బిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్తో కలిసి పని చేస్తే, రాష్ట్ర భవిష్యత్కు పాటుపడవచ్చని పేర్కొన్నారు. 27 నెలలుగా చాలా క్షోభ
జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పిప్రి నుంచే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ చేపట్టి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు, నిరంకుశత్వంపై పోరాడిన వీరులంటూ జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.695
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఉప్పరపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది. ఉప్పరపల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో ముగ్గురు నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకెళ్లారు. ఈ డ్రగ్స్ కేసులో లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో
ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హెచ్ఐసిసి లో ఆసియా టెక్స్ టైల్స్ కాన్పరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదు, చేనేతలకు జీవితమని అన్నారు. టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదని, చేనేత జీవితమని అన్నారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేశామని అనేక
కేరళ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటిలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం చేశారని, కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కెసిఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. బిసిలకు అన్యాయం
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.