బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. బాలికను లైంగికంగా వేధించిన కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. అయితే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం పోలీసులు ఇప్పటికే వెతుకున్నారు. నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపడుతుండగా, భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదైన తర్వాత పోలీసులు కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్లో బండి భగీరథ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బండి
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన,
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా మే 22న సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ వేదికగా జరిగే చివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉందని సిపి సజ్జనార్ ఫ్యాన్స్ని హెచ్చరించారు. ఐపిఎల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తాయని సజ్జనార్ తెలిపారు. అధికారిక
తెలంగాణ రైజింగ్తో త్రీ ట్రిలియన్ ఎకానమీ కోసం తాము పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కొండాపూర్ మండలం తొగర్పల్లిలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహలు పర్యటించారు. రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో భారీ ఫుడ్ ఇండస్ట్రీకి మంత్రులు భూమి పూజ చేశారు. ఈ
బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో, ఆయన వెకేషన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈనెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రైల్ రోకో కేసులో బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుకావాలని హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. 2025 నవంబర్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళా కమిషన్కు కొత్త నియామకాలు చేపట్టింది. మహిళా హక్కుల పరిరక్షణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలకమైన తెలంగాణ మహిళా కమిషన్కు చైర్ పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని నియమించింది. అలాగే కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పలువురు ప్రముఖ మహిళలకు అవకాశం కల్పించింది. ఈ నియామకాల్లో తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల నుంచి మొదలుకొని మండల, గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాలు ఎగురవేసి, పార్టీ ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారంపై చర్చ జరిపారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్ లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాలని, పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదయినట్లు సమాచారం. 17 ఏళ్ల బాలికకు బండి సంజయ్ కుమారుడు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్హౌస్తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం. దీంతో బాలిక రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరకు నిన్న అర్ధరాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. అయితే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సమర్పించిన సిఫార్సుల మేరకు పలు కులాల పేర్లను మారుస్తూ, మరికొన్ని కులాలకు గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బీసీ జాబితాలోని గ్రూప్-ఎ, గ్రూప్-డీ విభాగాల్లో ఈ మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ లోని వరుస సంఖ్య 7లో ఇప్పటి వరకు ఉన్న దొమ్మర అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో గడ వంశీయ
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆ నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే లేదన్నారు. దేశ రాజధాని నుంచి తాము నిధులు తెస్తుంటే, కాంగ్రెస్
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రిపీటెడ్గా డ్రగ్స్ కేసులో పట్టుబడితే పీడీ యాక్ట్ తరహా చట్టాన్ని ఉపయోగిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈగల్ ఫోర్స్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. నార్కోటిక్స్పై అలర్ట్గా ఉన్నామని, డ్రగ్స్ కట్టడి
ఉత్తరాది, దక్షిణాది అని పదపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి కరీంనగర్ లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రులకు వెళ్లిన బండి సంజయ్ కుమార్ పిఎంజే జువెలర్స్ దోపిడీ
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను రాష్ట్ర మంత్రి హోదాతో ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వీ.హెచ్ కు నెలకు రూ. 1,00,000 వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ క్వార్టర్ కేటాయించని పక్షంలో, నెలకు రూ. 50,000 ఇంటి అద్దె పొందే వీలుంది. ప్రభుత్వ పనులకు
కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కవిత సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. “తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావులపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు కాంగ్రెస్ నేత సంపత్కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ పార్టీపై తనపై తప్పుడు ప్రచారం చేసి పరువుకు భంగం కల్గిస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు. జన్వాడా ఫాం హౌజ్లో కట్టుకథలు రచించి లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లను రూ.8కోట్లు అడిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందనున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రస్తుత డీజీపీ కె. శివధర్ రెడ్డి ఏప్రిల్ 30వ తేదీన
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 26వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా లండన్లో ఏన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి గులాబీ జెండా పండుగ నిర్వహించి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. యూకే లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎందరో
మాజీ సిఎం కెసిఆర్ పార్టీకే మనుగడ లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి గతం ఉందని, భవిష్యత్ లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై సిఎం స్పందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త పార్టీ సంగతి తరువాత, ఉన్న పార్టీ ఉంటుందా, ఊడుతుందా? అని ప్రశ్నించారు. ఉద్యమం అప్పుడు ఎలా మాట్లాడినా సహంచారని, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా
బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు కెసిఆర్ తెలిపారు. బిఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు
తెలంగాణ రాజకీయాల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. శాసనమండలిలో ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో న్యాయపరమైన చిక్కుల వల్ల ఆగిపోయిన ఈ నియామకాలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలపడంతో లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంత్రి అజారుద్దీన్
ఇటీవల మృతి చెందిన ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం, పొలాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగారాజం గల్ఫ్లో ఉండగా అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లడంతో స్వదేశానికి తరలించాల్సి వచ్చింది. ఇక్కడ చికిత్స పొందుతూ పదిరోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధితుడి కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం
కాళేశ్వరం ప్రాజెక్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం తీర్పును సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని టీజీ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే న్యాయ విభాగంతో చర్చలు పూర్తయ్యాయని, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై న్యాయస్థానంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ
జగిత్యాలలో మాజీ సిఎం కెసిఆర్ సభ జరిగే సమయానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. పులిని చూసి నక్క వాలు పెట్టుకున్నట్లు చేశారని అన్నారు. కెసిఆర్ స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి స్థాయి ఏందో ప్రజలకు అర్థమైందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి మాత్రం కడుపుమంటతో మాట్లాడారని
భూముల ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయని బిజెపి ఎంపి అర్వింద్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ చెప్పినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 72 ఏళ్ల వయసులోనూ కెసిఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, భారీగా బకాయిలు పెట్టి పోయారని విమర్శించారు. కెసిఆర్ హయాంలోనే సివిల్ సప్లయ్ లో అక్రమాలు ప్రారంభమయ్యాయని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాటి
కేసీఆర్ భారీ బహిరంగ సభ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ జగిత్యాల కేసీఆర్ సభ పోస్టర్ ని ఆవిష్కరించారు. ప్రజలంతా కేసీఆర్ సందేశం కోసం ఎదురుచూస్తున్నారని, అలాగే
మహిళా బిల్లు వీగిపోవడం బిజెపి విధానాల ఓటమిగా భావిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లు పేరుతో డీలిమేషన్ బిల్లు తీసుకు వచ్చిందని అన్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని తెలియజేశారు. మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్రమోడీకి నిజాయితీ లేదని విమర్శించారు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే మద్దతు
జగిత్యాల లో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక పోరాటాలు చేసి తన ప్రాణాలను పణంగా
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అత్యంత దారుణమని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. బిల్లును వ్యతిరేకించిన వారికి చీకటి రోజులు దగ్గర పడ్డట్టేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే. ఓటింగ్ ప్రక్రియలో 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. దీంతో
అమెరికా నేషనల్ వార్ కాలేజ్ బృందంతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ సిద్ధంగా ఉందని, టిజి-ఐపాస్ ద్వారా 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అమెరికాతో దీర్ఘకాలిక వ్యూహాత్మక
లోక్సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత ఏపీలో
మహిళ రిజర్వేషన్లు, డీలిమిటేషన్ల రెండు అంశాలను బిజెపి కలిపి రాజకీయం చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డీ-లిమిటేషన్పై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు కీలకమైన అంశాలు. రెండు అంశాలు దేశ ప్రజలందరికీ సంబంధించిన కీలక అంశాలు. బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని బిజెపి దుష్ప్రచారం చేస్తోంది. మహిళలకు రాజకీయ
బిఆర్ఎస్ అధినేత మాజీ సిఎం కెసిఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు జారీ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. అంగన్వాడీ మొబైళ్ల కొనుగోలుతో తనకు సంబంధం లేదని సీతక్క అన్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కెసిఆర్దే బాధ్యత అని సూచించారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి
తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పు తెగుతుంది జాగ్రత్త అంటూ మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై స్కాం అంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. కేంద్రం నిర్దేశించిన స్పెసిఫికేషన్స్, ధరల ప్రకారం
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మద్దతునివ్వాలని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. ఈ బిల్లు ఆమోదంతో దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పడుతుందని ఆమె తెలిపారు.యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే మన భారతీయ సంస్కృతి ప్రకారం, ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారని, అటువంటి గొప్ప సంప్రదాయం మన దేశంలో ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో,
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 100 స్థానాలు గెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముక్కలైంది, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని, కాంట్రాక్టర్లు నుంచి కమీషన్లు తీసుకోవడం వల్లే కాళేశ్వరం కూలిందని మండిపడ్డారు.
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీనే అని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెటిఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పాలన అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ను కలిసిన సమయంలో జీవన్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అన్నా… నన్ను మీతో కలిసి పని చేయమని దేవుడే పంపిండు అంటూ ఆయన కేసీఆర్ను ఆలింగనం చేసుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.జీవన్
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం పెంపును ప్రకటిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేలమంది ఆర్టీసీ కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది. తాజా నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెరిగింది. గతంలో ఇది 50.7 శాతం ఉండగా, తాజా పెంపుతో 52.8 శాతానికి చేరుకుంది. గత ప్రభుత్వం చివరిసారిగా
కొత్త పార్టీపై కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తాను స్థాపించబోయే కొత్త పార్టీని ఏప్రిల్ 25న ప్రకటిస్తానని వెల్లడించారు. ఆ రోజు నిర్వహించనున్న సభ కోసం ఇప్పటికే 21 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారని, కార్యక్రమం సజావుగా జరిగేలా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు 500 మంది వాలంటీర్లను నియమించినట్లు కవిత తెలిపారు. సభకు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన్ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ శేష జీవితంలో కెసిఆర్తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని అన్నారు. బిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్తో కలిసి పని చేస్తే, రాష్ట్ర భవిష్యత్కు పాటుపడవచ్చని పేర్కొన్నారు. 27 నెలలుగా చాలా క్షోభ
జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పిప్రి నుంచే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ చేపట్టి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు, నిరంకుశత్వంపై పోరాడిన వీరులంటూ జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.695
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఉప్పరపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది. ఉప్పరపల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో ముగ్గురు నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకెళ్లారు. ఈ డ్రగ్స్ కేసులో లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో
ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హెచ్ఐసిసి లో ఆసియా టెక్స్ టైల్స్ కాన్పరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదు, చేనేతలకు జీవితమని అన్నారు. టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదని, చేనేత జీవితమని అన్నారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేశామని అనేక
కేరళ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటిలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం చేశారని, కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కెసిఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. బిసిలకు అన్యాయం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఫ్రీ అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆడబిడ్డకు ఓటు వేయాలన్న అంశం కంటే మించిన ఎమోషన్ ఏముంటుంది? అని ప్రశ్నించారు. తమ పార్టీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందని, తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరని
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లుపై ప్రస్తుతం రాజ్యసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ తమ పార్టీ తరపున ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి
లోక్సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి తెలంగాణ బీజేపీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి అభివృద్ధి పథంలో సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, తెలంగాణలో కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం
దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి విడత ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. రెండో దశలో జనాభా లెక్కల్ని సేకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇది ప్రారంభం కానున్నది. జనగణన కోసం పౌరులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా
మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమమని, ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని ఆయన తెలిపారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే
దేశంలో ప్రస్తుతం ఆహారభద్రత ఉంది కానీ పౌష్టికాహారం అందట్లేదు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా తొలి ముద్ద పథకాన్ని సిఎం ప్రారంభించారు. రెడీ టూ కుక్ ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్ ఫాస్ట్ గా ప్రభుత్వం అందించింది. అంగన్వాడీ వర్కర్స్ కు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణం తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. భద్రాచలం వీధులు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకు ముందు భద్రాచలం ఆలయ అభివృద్ధికి సిఎం రేవంత్ భూమి పూజ చేయడంతో తొలి విడతలో రూ.351 కోట్లతో
నూతన రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. మేడ్చల్లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలోనే పార్టీ పేరును కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా సమయానికి చేరుకోవాలని, ప్రతి గ్రామం నుంచి తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని
పాత బకాయిలను సర్దుబాటు చేయడమే ఇబ్బందిగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పాత బకాయిలపై సిఎం మాట్లాడారు. బకాయిలు ఉన్నవాటిలో కూడా ఎక్కువ ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉన్నాయని అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎప్పటికప్పుడు బకాయిలను చెల్లించామని, రూ. 2,408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశాం
రికార్డు స్థాయిలో మూడోసారి పొట్టి ప్రపంచకప్తో చరిత్ర సృష్టించిన భారత జట్టు ఐపీఎల్ తర్వాత బిజీగా ఉండనుంది. టీమిండియా 2026-27 సీజన్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ తెలిపింది. ఇవి మొత్తం 22 మ్యాచ్లు ఉండగా, వీటిలో రెండింటికి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికవ్వనుంది. బెంగళూరు, గువాహటి, అహ్మదాబాద్, రాంచీలోనూ భారత జట్టు రెండేసి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న శ్రీరామనవమి రోజు పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశముందని సమాచారం. శ్రీరామనవమి రోజు ఉదయం 8 గంటలకు కొత్త పార్టీ ఏర్పాటు తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణ జాగృతి వర్గాలు చెబుతున్నాయి.ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన ముఖ్య అంశాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన మెట్టినిల్లు నుంచి
మాజీ మంత్రి, ఎంఎల్సి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాలలో ఆయన అనుచరులు, మద్దతుదారుల సమక్షంలో పార్టీకి గుడ్ బై చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నుంచి అవమానాలతోనే గడిచిపోయిందని తెలిపారు. తన అనుచరుడు గంగారెడ్డిని నడి రోడ్డుపై నరికి చంపితే కాంగ్రెస్ అధిష్టానం, సిఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శలు గుప్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో పాటు
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర హైకోర్టు ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇటీవల పార్టీ ఫిరాయింపు కేసులో 10మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో విచారణను సుప్రీంకోర్టు ముగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం, బండ్ల
కేంద్ర ప్రభుత్వం లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయించింది. ఈ పెంపు జనాభా తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, లోక్సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, లోక్సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి. ఈ నిర్ణయం రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని,
మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయిట్లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు. తాను మంత్రి పదవి కోసం పాకులాడటం లేదని పేర్కొన్నారు. ఏ పదవి లేకున్నా తనకి ప్రజల్లో తగిన గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్కి, రాష్ట్ర
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ను కలుస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల బిల్లుకు మద్దతు కోసం అన్నిపార్టీలకు లేఖలు రాస్తామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన చరిత్ర అసెంబ్లీకి ఉందని ప్రస్తావించారు.
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ల భేటీ ముగిసింది. పార్టీ పెద్దల తీరుపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి, బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో జీవన్ రెడ్డిని కలిసిన మంత్రులు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చాలా సమయం జీవన్ రెడ్డితో చర్చలు జరిపిన మంత్రులు,పార్టీలో ఆయనకు సముచిత ప్రాధాన్యం దక్కేలా
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం విలువ రూ.3,24,234 కోట్లుగా ఆయన వెల్లడించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతమని ప్రకటించారు. తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బోగస్, బడా జూటా అని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఘోరీ కట్టారని దెప్పిపొడిచారు. ఈ బడ్జెట్ను చూస్తే ఎన్నికల హామీలపై కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమైందని అన్నారు. ఈ బడ్జెట్లో గతం
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 22వ తేదీన రైతు భరోసా పథకం కింద నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే తమ
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో కవిత చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆమె ఏర్పాటు చేయనున్న పార్టీకి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. కల్వకుంట్ల కవిత స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీ పేరు ఖరారైంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పొలిటికల్ పార్టీని ఆమె ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఈ పార్టీ పేరిట
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు. ఈ
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తమ ప్రమేయం ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశాం అని చెప్పారు. 2029లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. 2028లో ఎన్నికలు రావని తెలిపారు. మహిళ రిజర్వేషన్లు ముందుగా
కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సత్యదూరమైన మాటలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. స్త్రీ నిధి పథకం కింద రూ.57 వేల కోట్లు ఇప్పటివరకు అందించామని తెలియజేశారు.ఫ్రీ బస్పై కేటీఆర్ సెటైర్లు, తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ సత్యదూరమైన
తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అసెంబ్లీలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు జీవో చూపించండి. ఇక్కడే రాజీనామా చేసి నేను వెళ్లిపోతాను అంటూ సవాల్ విసిరారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించవద్దంటూ డిప్యూటీ సీఎంకు
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. రోహిత్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పార్టీ అధిష్ఠానం. డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు మీడియా ద్వారా వార్తలు వచ్చాయి. అదే విధంగా పోలీస్ కేసు నమోదు అయిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసినట్లు నోటీసుల్లో
ప్రజాకవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. కోవిడ్-19 సమయంలో సమాజంలోని వేదన, భయం, మానవీయ కోణాలను వ్యక్తపరుస్తూ సిధారెడ్డి రచించిన అనిమేష గ్రంథానికి గాను ఈ అవార్డు ప్రకటించినట్లు అకాడమీ తెలిపింది.ఈ నెల 31న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు.
అమెరికాలో వరంగల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) మృతిచెందాడు. భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం రాకేశ్ గుండెపోటుతో మరణించాడు. రాకేశ్కు 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లిన రాకేశ్, కుటుంబంతో కలిసి వర్జినీయాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడ్డాడు. పదేళ్లుగా విదేశాల్లో ఉంటూ ఉన్నత స్థితికి చేరుకున్న రాకేశ్, చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించాడనే వార్త వరంగల్లోని
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాను కాంగ్రెస్లో చేరనున్నారనే వార్తలను ఖండించారు. అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ తన వయసు 73 ఏండ్లని, ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసని, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి 50 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నా, అది మునిగిపోయే పడవనే అని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉన్నారో అందరికీ తెలుసని, ఇటీవల సీఎం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 31 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16 నుంచి మార్చి 31 వరకు సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, శివ ప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించారు. లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర
అనర్హత పిటిషన్ల విషయంలో ఎంఎల్ఎ కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు ఊరట లభించింది. కడియం, దానంలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించారు. బిఆర్ఎస్, బిజెపి వేసిన రెండు పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ డిస్మిస్ చేశారు. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండడంతో స్పీకర్
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి. ఇది ప్రజల తీర్పును అవమానించడమే. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ఇది కేవలం ఒక తీర్పు కాదు, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యులుగా సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నియామకపత్రం అందుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ పెద్దలు ఖర్గే, రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డికి నరేందర్ రెడ్డి ధన్యావాదాలు తెలిపారు. తాను ఎంపీ కావడానికి సహకరించిన
పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ విచారణ ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది విచారణను ముగించారు. సుప్రీ కోర్టు విధించిన గడువు నేటితో ముగియనుండటంతో, స్పీకర్ వెలువరించబోయే తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపై దాఖలైన పిటిషన్లపై నేడు
మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 130 మంది మావోయిస్టులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయారు. నాలుగు బస్సులలో కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న మావోయిస్టులు, సీఎం రేవంత్ రెడ్డికి తమ ఆయుధాలను సరెండర్ చేసి లొంగిపోయారు. 31 ఏకే 47 తుపాకులు, 124 ఆయుధాలు సరెండర్ చేశారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ దళం మొత్తం లొంగిపోయినట్లు తెలిసింది. లొంగిపోయినవారిలో ఏవోబీ కీలక నేత
ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నంలో ఉన్న తమకు మీరంతా అండగా నిలబడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీ అందరి అండదండలతో ఈ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్టినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం మమ్మల్ని గెలిపించారని, 2023 తమ దగ్గర అధికారం లేదు, అక్రమ సంపాదన లేదు
తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్గా నియమించిన ప్రభుత్వం, ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతో పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించిన రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను లద్దాఖ్ లెఫ్టినెంట్
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అమిత్షాతో రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. మూడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావించారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని రేవంత్రెడ్డి అన్నారు.ఆ సమయంలోనూ
మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. నాగోల్ లోని మూసీ రివర్ ఫ్రంట్ వాకింగ్ ట్రాక్ సందర్శించారు. నాగోల్ ఎస్టిపి పాయింట్ ను, మూసీ పరివాహక ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ హైడ్రా పేరుతో సిఎం రేవంత్ రెడ్డి అరాచకం సృష్టించాడని, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూలుస్తున్నారని అన్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరుచేయడంతో ఆయన బయటకొచ్చారు. చెన్నూర్ కోర్టులో ఉన్న మరో కేసులో పీటీ వారెంట్ పిటిషన్పై విచారణను ఆ కోర్టు ఈ నెల 5కు వాయిదా వేసింది. బాల్కసుమన్కు ఈ
అనర్హత పిటిషన్లకు సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. స్పీకర్ నుంచి తనకు వ్యక్తిగతంగా నోటీసులు అందలేదని వెల్లడించారు. నోటీసులు రేపు అందే అవకాశం ఉందని అన్నారు. అయితే రేపో ఎల్లుండో తాను నేరుగా తన అభిప్రాయాన్ని స్పీకర్కు తెలియజేస్తానని అన్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో దానం నాగేందర్ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి ఆయన కాసేపు హోలీ
అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య రేగిన భీకర పోరు ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుండటంతో గల్ఫ్ దేశాలన్నీ యుద్ధ క్షేత్రాలుగా మారాయి. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వారిని పరామర్శించేందుకు ఐదు రోజుల క్రితమే ఆయన
మధ్యప్రాచ్యంలో(పశ్చిమాసియా) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పౌరులకు సహాయం అందించేందుకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మధ్యప్రాచ్యం(పశ్చిమాసియా) ప్రాంతంలో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. తెలంగాణ భవన్లోని సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ
డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన, దేశం కోసం, మన అందరి కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. గత ఐదేళ్లుగా ఆయన చేసిన నిరంతర పోరాటాల ఫలితంగానే నేడు రాహుల్ గాంధీ దేశ ప్రధాన ప్రతిపక్ష
లండన్లోని క్రొయిడాన్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిజామాబాద్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గొంతి అభిషేక్ ప్రాణాలు కోల్పోగా, ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిజామాబాద్కు చెందిన సాయి శ్రీకర్ను వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధరించారు.బ్రెయిన్డెడ్ నేపథ్యంలో సాయి శ్రీకర్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించినట్టు నిజామాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉండే అతడి తల్లిదండ్రులు వెల్లడించారు. సాయి శ్రీకర్, గొంతి అభిషేక్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై ది రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. సీబీఐ వేసిన చార్జ్షీట్లో మెరిట్ లేదని కోర్టు పేర్కొంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటు ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు కూడా క్లీన్చిట్ ఇచ్చింది.
మావోయిస్టుల అగ్రనేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టుల లొంగుబాటు పాలసీపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని పలకరించారాయన. మావోయిస్టుల పునరావాసంపై హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావో నేతలపై ఉన్న రివార్డును వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే జైల్లో ఉన్న మావోయిస్టులను కలుస్తామని మావోయిస్టు నేతలు పేర్కొన్నారు. అలాగే, లొంగిపోయిన మావోయిస్టుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లొంగిపోవటానికి
తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వాటిలో ప్రధానంగా సంజయ్ కుమార్ను పరిశ్రమలు, ఐటి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పిఆర్ & ఆర్డి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇక సభ్యసాచి ఘోష్కు – ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ స్కిమ్స్ యూనిట్తో పాటు సిఎస్ఆర్గా బాధ్యతలు అందించారు. ఇక ఎం.దాన కిషోర్కి లేబర్, ఎంప్లాయ్మెంట్,
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీలో కలిశారు. ఖర్గేతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా ఈ విషయంపై మాట్లాడానని, వి. హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్లకి రాజ్యసభ ఇవ్వాలని కోరానని అన్నారు. ఇదే విషయంపై రాహుల్ గాంధీని, మల్లికార్జున్
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం శక్తిమంతమైన ప్రదేశం అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కొంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ అని, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి ఓటమికి కాంగ్రెస్ తో జతకట్టిందని ఎద్దేవా చేశారు. స్థానిక బిఆర్ఎస్ అండతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామని, తెలంగాణలో ఎన్నికలు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమి సర్వే వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మల్లారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భూమి వ్యవహారంలో సర్వే ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో తాము
మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో మొదలైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి దశకు వచ్చిందన్నారు. ఈ పరిణామంతో ఆ పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.