భారతీయ జనతా పార్టీకి గత ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తం విరాళాలు అందాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.6654 కోట్లు ఆ పార్టీకి విరాళంగా అందినట్లు తెలుస్తోంది. సభ్యత్వం రికార్డుల ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. లోక్సభ ఎన్నికలు జరిగిన సంవత్సరంలో ఆ పార్టీకి గత ఏడాదితో పోలిస్తే 68 శాతం విరాళాలు పెరిగినట్లు ఎన్నికల సంఘం రిపోర్టులో తెలిసింది. డిసెంబర్ 8వ తేదీన ఆ నివేదికను సమర్పించారు. ప్రస్తుతం ఈసీ వెబ్సైట్లో ఆ రిపోర్టు ఉన్నది. 20 వేల కన్నా ఎక్కువ విరాళం అందుకున్న పార్టీ వివరాలు మాత్రమే ఆ వెబ్సైట్లో వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 30, 2025 వరకు విరాళాలు ముట్టినట్లు తెలుస్తోంది.


