గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచందర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయింది. అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెండింగ్లో ఉంది. వీబీ జీ రామ్ జీ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే అని విమర్శించారు.


