గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో ట్రంప్ భేటీ అయ్యారు. తోమహాక్ క్షిపణులు, ఇతర ఆయుధాల కోసం జెలెన్స్కీ అమెరికా చేరుకున్నారు. వైట్హౌస్ లో ట్రంప్తో సమావేశమయ్యారు. అదేవిధంగా ఇరుదేశాలు వెంటనే యుద్ధం ముగించాలని ఈ సందర్భంగా ట్రంప్ పిలుపునిచ్చారు. జెలెన్స్కీతో సమావేశం చాలా ఆసక్తికరంగా, స్నేహపూర్వకంగా జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ గుర్తు చేశారు. ఇక దీన్ని ముగించి శాంతి నెలకొల్పాలని పుతిన్, జెలెన్స్కీని కోరినట్లు వెల్లడించారు. ఇకపై కాల్పులు, మరణాలు, అనవసరమైన భారీ ఖర్చులు వద్దు. నేను అప్పుడే అధ్యక్షుడిగా వుండి ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


