తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ కూడా ఓ భాగమని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకు వెళ్తోందని తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ఎదగాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తోందని.. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఆ లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్తో ముందుకు వెళ్తోందని అన్నారు.
కాగా, సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతోపాటు కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, దేశ విదేశీ కంపెనీ ప్రతినిధులు, పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.


