తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు హాజరైన విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెప్తారని అనుకుంటున్నా. రెండేళ్లవుతున్నా, ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపునకు రావట్లేదు. విచారణను త్వరగా ముగించాలి. దోషులకు శిక్షపడాలి. సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ మాట్లాడటం సరికాదు. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా. నాఫోన్, నా భర్త ఫోన్లు ట్యాప్ చేశారని అనుమానాలున్నాయి అని అన్నారు.


