కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ అందించారు. రెండు రోజుల పర్యట నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుమలకు చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బసచేశారు. తిరుమల పర్యటన అనంతరం హైదరాబాద్కు చేరుకోనున్నారు.


