మహానటీ సావిత్రి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతి లో డిసెంబర్ 1 నుంచి 6 వరకు సావిత్రి మహౌత్సవ్ పేరిట నిర్వహిస్తున్నాము. ప్రముఖ కళా సంస్థ సంగమం ఫౌండేషన్ తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 1 నుంచి 5 వరకు సావిత్రి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్ 6న జరిగే సావిత్రి 90 వ జయంతి సభలో మహానటి చిత్ర దర్శక, నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంకాదత్, స్వప్నాదత్ , సావిత్రి క్లాసిక్స్ పుస్తక రచయిత సంజరు కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్య లను ప్రత్యేకంగా సత్కరిస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సభకి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా, చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు అని సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి చెప్పారు.


