భారత మహిళా జట్టులోని స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్ తో డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తాజా సమాచారం. నవంబర్ 20వ తేదీన స్మృతి-పలాశ్ వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి వివాహం మహారాష్ట్రలోని స్మృతి మంధాన స్వస్థలం సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా అందినట్లు తెలుస్తోంది. క్రికెట్, మ్యూజిక్ ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులను ఆ మ్యారేజ్కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై క్లారిటీ లేదు.


