భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్లో ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్ష్యాలు అన్నిటినీ మిసైల్ అందుకుందని రక్షణ శాఖ తెలిపింది. ఈ పరీక్షతో భారత దళాల సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత మరింత పెరిగిందని పేర్కొంది.
అగ్నీ సిరీస్కు సంబంధించి భారత్ వద్ద వివిధ రకాల మిసైల్స్ ఉన్న విషయం తెలిసిందే. అగ్నీ-1 మిసైల్ 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అగ్నీ-2 మిసైల్ రేంజ్ 2 వేల కిలోమీటర్లు. అగ్నీ-3 మిసైల్ 3 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను, అగ్నీ-4 మిసైల్ 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇక అగ్నీ-5 మిసైల్ రేంజ్ అత్యధికంగా 5 వేల కిలోమీటర్లు.అగ్నీ-1 మిసైల్తో 220 కిలోమీటర్ల కనిష్ఠ దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయొచ్చని డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా 150-300 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించే పృథ్వి సిరీస్ మిసైల్స్కు అనుబంధంగా అగ్నీ-1 మిసైల్స్ను వినియోగించుకోవచ్చని అన్నాయి.


