విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటవుతున్నా రు. ఈ ప్రముఖ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులతో కలిసి ఉదయ్పూర్కు చేరుకున్న ఈ జంట, అక్కడి లగ్జరీ వేదిక మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎంపిక చేసుకున్నారు. సన్నిహితుల నడుమ సాంప్రదాయ వేడుకగా ఈ వివాహాన్ని అత్యంత ప్రైవేట్గా నిర్వహించనున్నట్లు సమాచారం.
మంగళవారం నుంచి హల్దీ, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కేవలం 50-100 మంది అత్యంత సన్నిహిత కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలోనే ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. అతిథుల కోసం నో-ఫోన్ పాలసీని కఠినంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో పెళ్లి వేడుకల ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. ఈ రోజు (ఫిబ్రవరి 24) మెహందీ, రేపు (ఫిబ్రవరి 25) హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి.


