డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగాయి. రాఘవేంద్ర రావు, దిల్ రాజు, సురేశ్ బాబు, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తొలి షాట్ చిత్రీకరణ జరగ్గా, ఈ సినిమా రూ.200 కోట్లు వసూళ్లు చేయాలని కోరుకుంటూ అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దిల్ రాజు స్క్రిప్ట్ అందించి టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ సినిమాలో వెంకటేశ్కు జోడీగా కీర్తి సురేశ్, కల్యాణ్ రామ్కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అదిస్తున్నారు. 2027 సంక్రాంతి లక్ష్యంగా శరవేగంగా షూటింగ్ జరుగనుంది.


