భారత ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం వరల్డ్కప్ ఫైనల్ల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. మహిళల కాంపౌండ్ ఆర్చరీలో పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. ఏషియన్ గేమ్స్ చాంపియన్ అయిన జ్యోతి సురేఖ, వరల్డ్కప్లో వరల్డ్ నెంబర్ 2 ప్లేయర్ ఎల్లా గిబ్సన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నది. కానీ ఆ బ్రిటన్ ప్లేయర్ను ఖంగుతినిపించింది. 15 పర్ఫెక్ట్ షూట్స్తో 150-145 స్కోరు సాధించిందామె. నాన్జింగ్లో జరిగిన వరల్డ్ కప్ సీజన్ ఫైనల్లో 29 ఏళ్ల భారతీయ షూటర్ 143-14- స్కోరుతో క్వార్టర్స్లో అలెక్సిస్ రుయిజ్పై గెలుపొందింది. సెమీఫైనల్లో తీవ్ర పోరాటం చేసింది జ్యోతి. వరల్డ్ నెంబర్ వన్ ఆండ్రియా బెకరా చేతిలో 143-145 స్కోరుతో ఓటమి పాలైంది. మూడవ రౌండ్లో ఓ దశలో జ్యోతి(87-86) ఒక్క పాయింట్ తేడాతో లీడింగ్లో ఉన్నది. కానీ ఫోర్త్ ఎండ్లో బెకరా వరుసగా మూడు 10 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత 116-115 స్కోరుతో లీడింగ్లోకి వెళ్లింది. ఇక ఫిఫ్త్ ఎండ్లో 29-28 స్కోరుతో బెకర దూసుకెళ్లింది.


