గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్లకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్లకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్లకు నేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. పెద్ద గ్రామాలకు రూ. 10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు చొప్పున ఇస్తామన్నారు. సర్పంచ్లకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇస్తామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధం లేకుండా నిధులు ఇస్తామని తెలిపారు. అలాగే గ్రామాల్లో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తాని ప్రకటించారు.


