తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 అధికారులు మీరే అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గ్రూప్-1 అధికారులు రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని అన్నారు. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరగడంతో పాటు పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని హైకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి స్పందించారు. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. హైకోర్టు తీర్పునిచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుట్రలు పన్నినా న్యాయ పోరాటంలో విజయం సాధించామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 563 మంది గ్రూప్-1 అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలు హైకోర్టు డివిజన్ బెంచ్ సక్రమమేనని తెలిపింది. గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ విచారణ జరిపింది. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరగడంతో పాటు కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.


