స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఇప్పటివరకు భారీ కమర్షియల్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన జాన్వీ, ఇప్పుడు తన ఫోకస్ను తెలుగు సినిమాలపై ఎక్కువగా కేంద్రీకరిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పెద్ది. రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లలో ఆమె లుక్కు మంచి స్పందన లభించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుందనే ప్రచారం జరుగుతోంది. భారీ రెమ్యూనరేషన్ కారణంగానే ఆమె ఈ ప్రాజెక్ట్కు అంగీకరించిందని, సినిమాలో తన పాత్రకు అంత ప్రాధాన్యత లేదనే భావనతో ప్రమోషన్లలో పాల్గొనాలనే ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, అది జాన్వీ కెరీర్పై ప్రభావం చూపే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే పెద్ది వంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో ఆమెకు దక్షిణాదిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మరింత గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం జాన్వీ చేతిలో చెప్పుకోదగ్గ పెద్ద ఆఫర్లు లేని తరుణంలో, పెద్ది విజయం ఆమెకు టాలీవుడ్లో మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుంది. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడం జాన్వీ చేసే పెద్ద పొరపాటే అవుతుంది.


