భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు పంజాబ్, హరియాణా, ఢిల్లీ, త్రిపుర రాష్ట్ర విభాగాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ వివరాలు వెల్లడించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాను నియమించింది. పంజాబ్ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు కేవల్ సింగ్ ధిల్లాన్ పేరును ప్రకటించింది. హరియాణా అధ్యక్షురాలిగా అర్చనా గుప్తాను, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్రాయ్ను నియమించింది.
తొలిసారి ఎంపీ అయిన హర్ష్ మల్హోత్రాకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ప్రస్తుతం ఆయన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గానికి హర్ష్ మల్హోత్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశ రాజధానిలో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేసేందుకు మల్హోత్రాను అధ్యక్షుడిగా ప్రకటించారు.
………….


