ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడిపోతున్నారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను నోబెల్ కమిటి ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్కు టెన్షన్ పట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తనకు వస్తుందో? రాదో? అన్న భయంతో నిద్రకూడా పట్టనట్లు కనిపిస్తోంది.తాను భారత్-పాక్తోపాటూ మొత్తం ఎనిమిది యుద్ధాలు ఆపానని అందుకు గానూ తనకు నోబెల్ బహుమతి రావాలని కోరుకుంటున్నారు. తనను తాను పీస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నోబెల్ శాంతి ప్రకటన నేపథ్యంలో తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పై తన అక్కసు వెళ్లగక్కారు. ఒబామా ఏమీ చేయకపోయినా తనకు నోబెల్ శాంతి ఇచ్చారని, ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.


