గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇది భారత దేశానికి, గుజరాత్కు గర్వకారణమన్నారు. ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాల కల్పనకు, క్రీడా టాలెంట్ను వెలికి తీసేందుకు ప్రధాని మోదీ విజన్ నిదర్శనంగా పనిచేస్తుందన్నారు. అయితే 2036లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలనుకుంటున్న భారత్కు, కామన్వెల్త్ క్రీడల నిర్వహణ ఓ ప్లాట్ఫామ్గా నిలిచే అవకాశం ఉన్నది. నవంబర్ 26వ తేదీన స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్లో జరగనున్న జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో అహ్మదాబాద్ అంశాన్ని పరిశీలించనున్నారు.


