దాతృత్వంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. ఏటా కోట్లాది రూపాయలు దానం చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా దేశంలోనే అత్యంత దయాగుణం కలిగిన వ్యక్తిగా శివ్ నాడార్ నిలిచారు. ఎడెల్గివ్-హురున్ ఇండియా దాతలు 2025 జాబితా ప్రకారం 2025లో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి 26 శాతం అధికంగా నాడార్ కుటుంబం రూ.2,708 కోట్లు దానం చేసింది. ఇక రిచ్ లిస్ట్లో తొలి స్థానంలో ఉండే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం మాత్రం ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా అంబానీ కుటుంబం రూ.626 కోట్లు దానం చేసింది. ఈ జాబితాలో బజాజ్ కుటుంబం రూ.446 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.


