అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ లాక్డౌన్. ఈ సినిమాకు ఏ. ఆర్. జీవా దర్శకత్వం వహించగా, లైకా ప్రోడక్షన్ నిర్మిస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతు న్నారు మేకర్స్. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే కరోనా మహామ్మారి వలన ఇండియాలో లాక్డౌన్ పడిన అనంతరం జరిగిన పరిస్థితులు ఏంటి అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ ఇందులో అనిత అనే పాత్రను పోషిస్తోంది.


