యువ నటుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మౌగ్లీ 2025. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో రోషన్ సరసన సాక్షి సాగర్ మదోల్కర్ నటిస్తున్నారు. వైవా హర్ష ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. కాలా భైరవ సంగీతం అందిస్తున్నాడు.


