బాలీవుడ్లోనే కాదు భారతీయ సినిమా చరిత్రలో అత్యద్భుత ప్రేమకథగా నిలిచిన దిల్వాలే దుల్హానియా లే జాయేంగే (డిడిఎల్జే) మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది. షారుఖ్ ఖాన్ ఉ కాజోల్ జంట కెమిస్ట్రీ, హృదయాలను తాకే సంగీతం, మరపురాని సంభాషణలు ఈ చిత్రాన్ని సాధారణ సినిమాగా కాకుండా ఒక అనుభూతిగా మార్చాయి. ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో ప్రదర్శించబడుతున్న అరుదైన క్లాసిక్గా నిలిచింది.30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లండన్లోని లీసెస్టర్ స్క్వేర్ వద్ద షారుఖ్ఉకాజోల్ జంటకు ప్రత్యేకంగా రూపొందించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి షారూఖ్-కాజోల్ జంట స్వయంగా హాజరై మరింత ఆకర్షణగా మార్చారు. నీలిరంగు ఆధునిక చీరతో కాజోల్ అందంగా మెరిసిపోగా, బ్లాక్ సూట్లో షారుఖ్ ఎప్పటిలాగే స్టైలిష్గా కనిపించాడు.


