గుంటూరుకు చెందిన విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య టీటీడీ శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం గా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.


