హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్పై ఇప్పుడు ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఆషికా రంగనాథ్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ సరసన నటించి ఆకట్టుకుంది ఆషికా రంగనాథ్. అయితే, ఈ వార్తపై ఇంకా అధికారిక అప్డేట్ రాలేదు. మరోవైపు శర్వానంద్ ఈ సినిమాలో కొత్త లుక్లో కనిపించబోతున్నట్లు తెలిసింది. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ముందుగా హీరో శర్వానంద్పై ఎంట్రీ సీన్స్ను షూట్ చేస్తారట. ఈ సీక్వెన్స్కి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ను కూడా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.


