పశ్చిమాసియా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ గగనతలం, భూభాగం మీదగా ఎలాంటి మిలటరీ దాడులకు పాల్పడ్డకుండా నిషేధం విధించింది. క్రౌన్ ప్రిన్స్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో సంభాషణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా, ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుంది, ఏ పార్టీ నుండి అయినా, వారి మూలంతో సంబంధం లేకుండా, దేశంపై దాడులు లేదా సైనిక కార్యకలాపాలను అనుమతించదు. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించడానికి రాజ్యం మద్దతును కూడా ఆయన పునరుద్ఘాటించారు.


