ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.
బడ్జెట్ స్వరూపం..
2026-27 వార్షిక బడ్జెట్: రూ.3,32,205 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,56,143 కోట్లు
మూలధన వ్యయం: రూ.53,915 కోట్లు
రెవెన్యూ లోటు: రూ.22,002 కోట్లు
ద్రవ్య లోటు: రూ.75,868 కోట్లు
బడ్జెట్ కేటాయింపు వివరాలు ఇవే:
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు
విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు
రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టులకు రూ.13,546 కోట్లు
‘వీబీ జీ రామ్ జీ’కి రూ.8,365 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు
పరిశ్రమలకు రూ.3,161 కోట్లు
సర్దుబాటు నిధి రూ.1,500 కోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్కు రూ.1,037 కోట్లు
ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4,000 కోట్లు
జల్ జీవన్కు రూ.4,000 కోట్లు
2026-27 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం-నీటి భద్రత కేటాయింపులు:
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు – రూ.9,906 కోట్లు
అన్నదాత సుఖీభవ – రూ.6,600 కోట్లు
పోలవరం – రూ.6,105 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ.1,927 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి – రూ.500 కోట్లు
మత్స్యకార సేవలో – రూ.260 కోట్లు
పంటల బీమా – రూ.250 కోట్లు
పీఎం కృషి సించాయి యోజన – రూ.190 కోట్లు


