ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ నేతృత్వంలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా భూ సమస్యల పరిశీలన, రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, కొత్తగా వచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేశామని స్పష్టం చేశారు. 11 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేశామని పేర్కొన్నారు. బ్యాంక్ ఉద్యోగుల నివాసాల కోసం భూ కేటాయింపులు చేశామని చెప్పుకొచ్చారు. రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్కు రెండు ఎకరాలు కేటాయించామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు.


