ప్రజాకవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. కోవిడ్-19 సమయంలో సమాజంలోని వేదన, భయం, మానవీయ కోణాలను వ్యక్తపరుస్తూ సిధారెడ్డి రచించిన అనిమేష గ్రంథానికి గాను ఈ అవార్డు ప్రకటించినట్లు అకాడమీ తెలిపింది.ఈ నెల 31న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు.


