అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ మధ్య వివాదం కొనసాగుతోంది . 2021 జనవరి 6వ తేదీన ఆయన చేసిన ప్రసంగాన్ని బీబీసీ ఛానల్ తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసి ప్రసారం చేయడం వల్లే క్యాపిటల్ హిల్లో అల్లర్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీకి ట్రంప్ తాజాగా గట్టి షాకిచ్చారు. సంస్థపై పరువు నష్టం దావా వేశారు. 10 బిలియన్ డాలర్లు నష్టపరిహారం డిమాండ్ చేశారు. మియామిలోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ దావా వేశారు.


