అమెరికాకు చెందిన ప్యాక్స్ సిలికా తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్యాక్స్ లికా డిక్లరేషన్పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో రెండు దేశాలు ఈ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ప్రతినిధి సెర్గియో గోర్ సమక్షంలో ఈ డిక్లరేషన్పై సంతకం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవహారాల మంత్రి జాకబ్ హెల్బర్గ్ కూడా పాల్గొన్నారు.
వర్కింగ్ కల్చర్ను ఏఐ మార్చేస్తోంది. రాకెట్లా దూసుకెళ్తున్న ఏఐని ఇప్పుడు కొన్ని కంపెనీలు వరప్రసాదంలా భావిస్తున్నాయి. ఉద్యోగుల చేత ఏఐని తప్పనిసరిగా వాడేలా చేస్తున్నాయి. తాజాగా టెక్ కంపెనీ యాక్సెంచర్ ఈ విషయంలో ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు ఏఐని తప్పనిసరిగా వాడాలని సూచించింది. లేకుంటే ప్రమోషన్లు కట్ చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు
కృత్రిమ మేధస్సు (ఏఐ)లో సరికొత్త సంచలనం, అమెరికాకు చెందిన కంపెనీ ఆంథ్రోపిక్తో, భారతీయ ఐటీ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ జట్టు కట్టింది. టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి తదితర కంపెనీల కోసం అత్యాధునిక సంస్థాగత ఏఐ సొల్యూషన్స్ను అందుబాటులోకి తేవడం, అభివృద్ధిపర్చడానికి ఆంథ్రోపిక్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మంగళవారం ఇన్ఫోసిస్ ప్రకటించింది. ముందుగా టెలికాం రం గంలో ఆంథ్రోపిక్ సహకారాన్ని ఇన్ఫోసిస్ తీసుకోనున్నది. ఈ మేరకు
దేశంలో ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న కరెన్సీ రూ.100, రూ.500. అయితే, ఈ నోట్లు త్వరలో మారబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది కరెన్సీ నోట్ల విషయంలో కీలక మార్పులు తీసుకునే ఆర్బీఐ రూ.100, రూ.500 నోట్లలో మార్పులు తీసుకురానుంది. అలాగని పాత నోట్లను ఆర్బీఐ రద్దు చేయడం లేదు. కాబట్టి, వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో చెలామణిలో ఉన్న నోట్ల విషయంలో సెక్యూరిటీ, ఎక్కువ కాలం మన్నిక వంటి
వాల్మార్ట్ కు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ, ఫుడ్ డెలివరీ విభాగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నదన్న వార్తల నేపథ్యంలో, ఇప్పటికే ఈ రంగంలో హవా నడిపిస్తున్న స్విగ్గీ, జొమాటోల షేర్లు నష్టపోయాయి. ఈ ఏడాది మే-జూన్ నెలల
వాట్సాప్ తన వెబ్ వెర్షన్ లో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. కొత్తగా వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. దాంతో యూజర్లు ఎలాంటి అదనపు సాఫ్ట్వేర్ ఉపయోగించకుండానే నేరుగా వెబ్ నుంచే ఆడియో/ వీడియో కాల్స్ చేయవచ్చు. యూజర్ల వ్యక్తిగత చాట్ విండోలో కాల్ బటన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది. వాట్సాప్లో ప్రస్తుతం ఆడియో, వీడియో కాల్స్
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) గుడ్న్యూస్ చెప్పింది. మెరుగైన పనితీరు, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు ఇచ్చే హామీ రహిత రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలని బ్యాంకులకు సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతోపాటు బ్యాంక్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీం ప్రయోజనాలు కూడా కల్పించాలని పేర్కొంది.బ్యాంకులు మంజూరు చేసే రుణాల కోసం రుణగ్రహీతలు స్వచ్ఛందంగా తాకట్టుపెట్టే బంగారం, వెండిని తాకట్టు రహిత పరిమితికి
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా హైదరాబాద్లో రెండో షోరూంను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మరో షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు, ఇది మరో మైలురాయిగా నిలువనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో లగ్జరీ కార్ల మార్కెట్ 8-10 శాతం వరకు వృద్ధిని నమోదు చేసుకుంటున్నట్టు తెలిపారు.
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ప్రస్తుత సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించంది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా 2026లో 24వేల నుంచి 25 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నట్టు కంపెనీ సీఈవో రవి కుమార్ ఎస్ తెలిపారు. 2025లో నియమించుకున్న 20 వేల మందితో పోలిస్తే 20 శాతం అధికమని ఆయన పేర్కొన్నారు. కొత్తగా నియమించుకునే వారిలో ఏఐ టెక్నాలజీపై మంచి పట్టున్న వారిని
టెక్నాలజీ దిగ్గజం, వాట్సాప్ ఓనర్లు మెటా కంపెనీకి, సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంశంలో కోర్టు తన హెచ్చరిక జారీ చేసింది. ఓ కేసులో సుప్రీంలో వాదనలు జరిగాయి. మా దేశ ప్రైవసీతో మీరు ఆటలాడుకోలేరని, మాకు చెందిన సింగిల్ డిజిట్ డేటాను కూడా షేర్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వబోమని, మా దేశ చట్టాలను ఫాలో అవ్వకుంటే, మీరు ఈ దేశాన్ని విడిచి వెళ్లవచ్చు అని
అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఊరటనిచ్చేలా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న డ్యూటీ-ఫ్రీ దిగుమతి పరిమితిని పెంచుతూ, కొత్తగా రూ. 75 వేల వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్కు తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మార్పులు బ్యాగేజ్ రూల్స్, 2026 కింద చేపట్టగా, ఫిబ్రవరి 2, 2026 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. దాదాపు పదేళ్ల
ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్. ఇప్పుడు మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని సమాచారం. నేటి నుంచే ఉద్యోగుల్ని తొలగించబోతుంది. ఈసారి దాదాపు 16,000 మందిని తీసేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేటి నుంచి వారం రోజుల్లోపు ఇందుకు సంబంధించి ఆదేశాలొచ్చే అవకాశం ఉంది. గత ఏడాది చివర్లో అమెజాన్ సంస్థ దాదాపు 14,000 మంది స్టాఫ్ను
ఆన్లైన్ ఫుడ్డెలివరీ సంస్థ జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ కీలక బాధ్యతల నుంచి వైదొలిగారు. మాతృసంస్థ ఎటెర్నల్ సీఈఓగా సేవలందిస్తున్న గోయల్ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు మేనేజింగ్ డైరెక్టర్గానూ గోయల్ తప్పుకున్నారు. ఏకకాలంలో రెండు పదవులకు గుడ్ బై చెప్పేసిన దీపిందర్ గోయల్ ఎటరన్స్ వైస్ ఛైర్మన్గా, డైరెక్టర్గా పగ్గాలు చేపట్టనున్నారు. జొమాటో, బ్లింకిట్కు మాతృసంస్థ అయిన ఎటెర్నల్లో నాయకత్వ మార్పుకు వేళైంది. దీపిందర్ గోయ్ సీఈఓగా
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఇండోనేషియా ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గ్రోక్ చాట్బాట్ వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించింది. డిజిటల్ వేదికలో వస్తోన్న అసభ్యకర కంటెంట్ను మానవ హక్కులు, గౌరవం, పౌరుల భద్రతా ఉల్లంఘనగా తమ ప్రభుత్వం చూస్తోందని ఇండోనేసియా మంత్రి మోత్యా హఫీద్ పేర్కొన్నారు. ఈ చర్యలు తీసుకున్న తొలి ముస్లీం దేశంగా ఇండోనేషియా నిలిచింది. అయితే, ఎక్స్లోని గ్రోక్ చాట్బాట్లో అసభ్యకర కంటెంట్కు సంబంధించి
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కు పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. వర్క్-ఫ్రమ్-ఆఫీస్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీస్కు రావాల్సిందేనని స్పష్టం చేసింది. లేనిపక్షంలో వారి యాన్యువల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వంటివి నిలిపివేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు రోజుకు 9 గంటలు ఆఫీసులో గడపాలి. దేశంలోని
అమెరికా వీసా ఇంటర్వ్యూలలో ఏర్పడిన తీవ్ర ఆలస్యాల కారణంగా భారత్లోనే చిక్కుకుపోయిన తమ హెచ్-1బి ఉద్యోగులకు అమెజాన్ సంస్థ ఊరటనిచ్చింది. వీసా సమస్యలతో మానసిక ఒత్తిడిలో ఉన్న సిబ్బందికి తాత్కాలిక వెసులుబాటు కల్పిస్తూ, మార్చి 2 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూ ఎఫ్ హెచ్) చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం వీసా ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులు ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందకుండా ఉండేందుకు తీసుకున్న
నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక హెచ్చరిక జారీ చేసింది. జనవరి 1 నుంచే అమలులోకి వస్తున్న ఈ కొత్త సంస్కరణల ప్రకారం.. నిబంధనలు పాటించని, నిరుపయోగంగా ఉన్న లక్షలాది బ్యాంకు ఖాతాలు మూతపడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి, ముఖ్యంగా పెరుగుతున్న డిజిటల్ ఫ్రాడ్స్ (మోసాలను) అరికట్టడానికి ఆర్బీఐ
ప్రపంచ టెక్ రంగంలో అత్యంత సంపన్న సీఈవోలు ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల , సుందర్ పిచాయ్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇద్దరూ టెక్ రంగంలో భారత సంతతికి చెందిన అత్యంత సంపన్న ఎగ్జిక్యూటివ్లుగా కొనసాగుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆ స్థానాన్ని వారు కోల్పోయారు. తాజా నివేదికల ప్రకారం ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టి అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ
ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు, ముంబై నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ విమాన సర్వీసులను నిలివేసింది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి నాన్ స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తర అమెరికా నెట్వర్క్ను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు ఎయిరిండియా తెలిపింది. విమానాల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న గగనతల పరిమితుల కారణంగా పెరుగుతున్న ఆపరేషన్ ఖర్చులను నియంత్రించడానికే ఈ నిర్ణయం
అమెరికన్ టైకూన్, ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. వ్యక్తిగత సందప పరంగా మస్క్ ఏకంగా 600 బిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరారు. తద్వారా ప్రపంచం లోనే తొలిసారి ఈ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా మస్క్ చరిత్ర సృష్టించారు. మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్లకు చేరుకుని, ఐపీఓగా వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన సంపద
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రేపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ వడ్డీ రేట్లకు కోత విధించింది. అన్నిరకాల రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేటు (ఈబీ ఎల్ఆర్) 25 బేసిస్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ శాటిలైట్ వ్యవస్థ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత్లో రంగం సిద్ధమైంది. ఇప్పటికే మన దేశానికి చెందిన జియో, ఎయిర్టెల్తో స్టార్లింక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. త్వరలో ఇండియాలో కమర్షియల్ సేవలు అందించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలను సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ సేవలు పొందాలంటే రెసిడెన్షియల్ కస్టమర్లు
ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్కు యూరోపియన్ యూనియన్ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్పై 120 మిలియన్ యూరోల జరిమానా విధించింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం నియమాలను ఉల్లంఘించిందని విచారణలో తేలడంతో జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 27 దేశాల యూరోపియన్ యూనియన్లో డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద ఒక ప్లాట్ఫామ్పై నిబంధనలు పాటించడం లేదంటూ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. డీఎస్ఏ సోషల్ మీడియా కంపెనీలను యూజర్ల
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్ న్యూస్ ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు పేర్కొంది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రావెల్లడించారు. అయితే. ఈ ఏడాదిలో ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించింది ఆర్బీఐ. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో కీలక వడ్డీరేట్లపై
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కి మరో షాక్ తగిలింది. యస్ బ్యాంక్ను మోసం కేసులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన రూ.1,120 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా అటాచ్ చేసింది. ఇందులో 18 ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్హోల్డింగ్ వంటివి ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందిన 7 ఆస్తులు, రిలయన్స్ పవర్ లిమిటెడ్కు చెందిన
ఫ్రెంచ్ దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన ఏ-320 సిరీస్లోని 6వేల విమానాల్లో సాంకేతిక లోపాల కారణంగా రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద రీకాల్ కావడం విశేషం. ఈ నిర్ణయం విమానాయాన పరిశ్రమలో సంచలనంగా మారింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో విమానాలను గ్రౌండింగ్ చేయడం వల్ల విమానాల షెడ్యూల్కు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఎయిర్లైన్స్
సంపన్నులపై బ్రిటన్ ప్రభుత్వం పన్నుల భారాన్ని భారీగా పెంచేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం సంపన్నులను ఆలోచనలో పడేసింది. పలువురు బిలియనీర్లు యూకేను వీడి, పన్ను మినహాయింపు దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు యూకేని వీడగా, ఇప్పుడు ఆ జాబితాలోకి భారత్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ వచ్చి చేరారు. భారత్కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గత నెలలో భారీగా లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్లౌడ్ సర్వీసెస్, డివైజెస్, రిటెయిల్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయితే, ఈ లేఆఫ్స్కు సంబంధించిన కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ కోతల్లో అత్యధికంగా నష్టపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనని తాజా నివేదికలు
అమెరికాకు చెందిన మరో టెక్నాలజీ దిగ్గజం తెలంగాణలో అడుగపెట్టింది. తాజాగా సోనోకో ప్రొడక్ట్స్ కంపెనీ నూతన కార్యాలయాన్ని తెరిచింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో హోవార్డ్ కూకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో పెట్టుబడులు నిరంతరంగా కొనసాగించనున్నట్టు, ఇక్కడ ప్రతిభ కలిగిన ఐటీ ఉద్యోగులు అత్యధికంగా లభించడంతోపాటు ఇన్నోవేషన్ కేంద్రంగా ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ సెంటర్ 145 మంది ప్రొఫెషనల్స్ విధులు నిర్వహిస్తుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. ఐఓఎస్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ను తీసుకువస్తున్నది. దాంతో ఒకే డివైజ్లో రెండు వాట్సాప్ అకౌంట్స్ను వాడుకునే సౌకర్యం అందుబాటులోకి తేబోతున్నది. ఈ అప్డేట్ ఐఓఎస్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వేర్వేరు వ్యక్తిగత, ప్రొఫెషనల్ నంబర్లు ఉన్న వారికి మంచి ఆప్షన్గా
ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ ను టిమ్ కుక్ త్వరలోనే వీడే అవకాశం కనిపిస్తోంది. టిమ్ కుక్ ఈ నెలలో 65 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యాపిల్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. దీంతో టిమ్ కుక్ తర్వాత యాపిల్కు తదుపరి సీఈవో ఎవరు? అన్న చర్చ మొదలైంది. టిమ్ కుక్ వారసుడిగా ఎవరు రానున్నారు? అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ
ఫాస్టాగ్ లేకుండా జాతీయ రహదారుల పై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్లేనివారికి టోల్ ప్లాజాల వద్ద విధిస్తున్న రెట్టింపు ఛార్జీ ల నిబంధనను సడలించింది. ఇకపై కేవలం 25 శాతం అదనపు రుసుము చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్ తప్పనిసరిగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫాస్టాగ్ లేనివారు టోల్ రుసుముకు
అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ సేవల సంస్థ బ్లాక్బడ్ తాజాగా హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. గడిచిన ఏడాదిగా భారత్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థకు ఇదే తొలి ఆఫీస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు ఇన్నోవేషన్, ఏఐ ఇంటగ్రేషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ సేవలు అందించడానికి ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి కెవిన్ గ్రెగోయిర్ తెలిపారు.ప్రపంచస్థాయి ప్రతిభా వ్యవస్థ కలిగిన నగరంలో ఈ టెక్నాలజీ
సంగీత ప్రియులకు గుడ్న్యూస్. మీకు ఇష్టమైన పాటలు, ఆల్బమ్, పాడ్కాస్ట్లను నేరుగా వాట్సాప్ స్టేటస్కు షేర్ చేసుకునే వీలుంటుంది. ఇందుకోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్పై పని చేస్తుంది. స్పాటిఫై నుంచి మాత్రమే ఈ పాటలను నేరుగా షేర్ చేసుకునే వీలుంటుంది. ఇప్పటి వరకు ఫొటోలు, వీడియోలు మాత్రమే స్టేటస్గా పెట్టుకునే అవకాశం ఉండగా, ఇకపై స్టేటస్లో పాటలు సైతం షేర్ చేసుకోవచ్చు. ప్రతి పాట, ఆల్బమ్, పాడ్కాస్ట్లో కొత్త షేర్
ప్రతీ బ్యాంకుకు దాని సొంత పరిమితులను నిర్దేశిస్తుంటాయి. బ్యాంకులు కొన్ని లావాదేవీలు ఉచితంగా అందిస్తాయి. ఆ తర్వాత ప్రతి విత్డ్రాకు ఛార్జీలు విస్తాయి. ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతా ఉంటే, సాధారణంగా మూడు నుంచి ఐదుసార్లు ఉచితంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అనంతరం ప్రతి లావాదేవీకి రూ.10 నుంచి రూ.20 వరకు ఛార్జీలు విధిస్తారు. ఈ పరిమితి ఏటీఎంలకు సైతం వర్తిస్తుంది.
దాతృత్వంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. ఏటా కోట్లాది రూపాయలు దానం చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా దేశంలోనే అత్యంత దయాగుణం కలిగిన వ్యక్తిగా శివ్ నాడార్ నిలిచారు. ఎడెల్గివ్-హురున్ ఇండియా దాతలు 2025 జాబితా ప్రకారం 2025లో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి 26
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బి ఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.21,137 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,331 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధిని కనబరిచింది. యెస్ బ్యాంక్లో వాటాను విక్రయించడం తో రూ.4,593 కోట్ల నిధులు సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని
అంతర్జాతీయ ఆప్టికల్ దిగ్గజం జెడ్ఈఐఎస్ఎస్ తాజాగా హైదరాబాద్లో మరో ఎక్సలెన్స్ సెంటర్ను ప్రారంభించింది 4.500 చదపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సెంటర్తో నూతన పరిశోధనలు గావించడానికి వినియోగించనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0 ఒకదానికొకటి ముడిపడివున్నాయి. హైదరాబాద్లో ఏరోస్పేస్ రంగం వేగవంతంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, అలాగే మెడికల్ పరికరాల తయారీ హబ్గా మారిందని చెప్పారు.
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు అనిల్ అంబానీకి చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్ చేసింది. అక్టోబర్ 31న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో
బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్. బ్యాంకు నిబంధనల్లో కీలక మార్పులు జరుగబోతున్నాయి. మారిన నిబంధనలు నేటి (నవంబర్ ఒకటి) నుంచి అమలులోకి వచ్చాయి. అమలులోకి రానున్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంక్ అకౌంట్ల నామినీల విషయంలో కీలక మార్పులు చేసింది. ఇకపై నుంచి నలుగురు నామినీలను ఎంపిక చేసుకునే వీలు కల్పించింది. దాంతో బ్యాంకింగ్ సిస్టమ్లో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభతరం కానున్నది. ఇందు కోసం కేంద్రం బ్యాంకింగ్
కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకింగ్ సవరణ చట్టం కారణంగా నవంబర్ నెలలో కొన్ని మార్పులు జరుగనున్నాయి. బ్యాంక్ ఖాతా నామినీలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అకౌంట్ హోల్డర్ కి ఒక నామినీ మాత్రమే ఉండటం వల్ల ఆ నామినీ అందుబాటులో లేకపోవడం, నగదు క్లెయిమ్ చేసుకోకపోవడంతో ఆ డబ్బు అలాగే ఉండిపోతుంది. ఇలా మన దేశంలోని మన బ్యాంకుల్లో దాదాపు రూ.67,000 కోట్లకు పైగా డబ్బు అలాగే
యాపిల్ సంస్థ దూసుకెళ్తున్నది. తాజాగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ల డాలర్లు దాటింది. కొత్త ఐఫోన్ మోడల్స్ అమ్మకాల జోరు పెరగడంతో, యాపిల్ కంపెనీ షేర్లు కూడా దూసుకెళ్తున్నాయి. యాపిల్ కంపెనీ చరిత్రలో 4 ట్రిలియన్ మార్కెట్ వాల్యూను చేరుకోవడం ఇదే తొలిసారి. ఆ మైలురాయి అందుకున్న మూడవ టెకీ కంపెనీగా యాపిల్ సంస్థ నిలిచింది. గతంలో ఈ రికార్డు అందుకున్న కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, నిదియా ఉన్నాయి.
ఐఫోన్లు సహా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ తైవాన్ సంస్థ ఫాక్స్కాన్ హైదరాబాద్ ప్లాంట్ను రూ. 4,800 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. వచ్చే ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో కొంగరకలాన్ ప్లాంట్లో తమ ఉత్పత్తిని రెట్టింపు చేయాలనుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ నెలకు లక్ష ఎయిర్పాడ్లు ఉత్పత్తి అవుతుండగా, విస్తరణ పూర్తయ్యాక ఇది రెండు లక్షలకు చేరుకుంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకల్లో మొబైల్
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకింగ్ లాస్ సవరణ చట్టం 2025 కింద కొత్త మార్గదర్శకాల ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటించింది. బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు, లాకర్లకు నామినేషన్స్, సెఫ్ కస్టడీలోని ఆస్తులపై కస్టమర్లకు నియంత్రణ, సౌలభ్యాన్ని కల్పించేందుకు కీలక మార్పులు జరుగుతున్నాయి. ఈ కొత్త మార్గదర్శకాలు నవంబర్ 1, 2025 నుంచే అమలులోకి వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. డిపాజిట్ అకౌంట్లు, సేఫ్
సోషల్ మీడియా కంపెనీ మెటా ఆన్లైన్ మోసాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కొత్తగా సెక్యూరిటీ ఫీచర్స్తో పాటు అవెర్నెస్ టూల్స్ను ప్రారంభించింది. ప్రత్యేకంగా సైబర్ మోసాల బారి నుంచి వినియోగదారులను రక్షించడమే లక్ష్యంగా వీటిని తీసుకువచ్చింది. చూజర్లు ఇప్పుడు వాట్సాప్లో తెలియని వ్యక్తితో తమ స్క్రీన్ను షేర్ చేసిన సమయంలో వార్నింగ్ మెస్సేజ్ వస్తుందని మెటా కంపెనీ పేర్కొంది. చాలా మంది స్కామర్స్ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి సత్యనాదెళ్ల జీతం 22 శాతం పెరిగి 96.5 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. భారత కరెన్సీ ప్రకారం రూ.847.31 కోట్లు అన్నమాట. బాధ్యతలు చేపట్టిన గత పదేళ్లలో ఇదే అత్యధిక వేతనం. కృత్రిమ మేధస్సులో కంపెనీ పురోగతికిగాను నాదెళ్లకు ఈ ప్రోత్సాహం అందనుంది. గతేడాది
దీపావళి అమ్మకాలు ఈ ఏడాది దేశవ్యాప్తంగా రూ.6.05లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ.5.40 కోట్ల విలువైన వస్తువ వ్యాపారం, రూ.65వేల కోట్ల విలువైన సర్వీసెస్ వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) నివేదికను విడుదల చేసింది. ఇదే ఇప్పటి వరకు దేశ వాణిజ్య చరిత్రలో అతిపెద్ద పండుగగా నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు టైర్-2, టైర్-3 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 60 ప్రధాన
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో అంతర్జాతీయ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. కువైట్ ఆయిల్ కంపెనీ(కేవోసీ) నుంచి 225.5 మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టును పొందింది. కేవోసీ బూస్టర్ స్టేషన్ బీఎస్ 171 సమీపంలో ఈ ప్లాంట్ను 790 రోజుల్లో నిర్మించాల్సివుంటుందని మేఘా డైరెక్టర్ పీ దొరయ్య చెప్పారు. పశ్చిమ కువైట్లోని ఈ వ్యూహాత్మక గ్యాస్ స్వీటెనింగ్ ఫెసిలిటీ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం గర్వకారణంగా ఉన్నదన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సల్ఫర్
యావత్ దేశం దీపావళి పండుగకు సిద్ధమైంది. ఈ క్రమంలో వాహన మార్కెట్కు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. పండుగ సీజన్లో పెద్ద సంఖ్యలో జనం కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సర్వే దేశవ్యాప్తంగా 2800 మంది అభిప్రాయాలు సేకరించింది. సర్వే ప్రకారం మారుతున్న జీవనశైలి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, జీఎస్టీ 2.0 వంటి ప్రభుత్వ సంస్కరణలు మార్కెట్కు బూస్ట్ ఇచ్చాయని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని కొత్త 4జీ యూజర్లకు నెలరోజులపాటు ఉచితంగా సర్వీసులు అందించనున్నట్టు ప్రకటించింది. ఇందు కోసం రూపాయి చార్జీని విధించనున్నది. వచ్చే నెల 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనున్నదని ఒక ప్రకటనలో వెల్లడించింది. నూతన కస్టమర్లకు 30 రోజులపాటు అన్లిమిటెడ్ వాయిస్కాల్స్, రోజు 2జీబీ డాటా, 100 ఎస్ఎంఎస్లు, సిమ్ను
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. తాజారౌండ్లో తన హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో 15% వరకు ఉద్యోగుల్ని ఇంటికి పంపించేందుకు రెడీ అయ్యింది. హెచ్ఆర్ విభాగంతోపాటూ ఇతర విభాగాలపై కూడా లేఆఫ్స్ ప్రభావం పడనున్నట్లుంది. అమెజాన్ సీఈఓగా ఆండీ జస్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా వరుసగా ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తూనే ఉంది. సంస్థ వ్యయ తగ్గింపు
సోషల్ మీడియా యూజర్లకు మెటా కంపెనీ గుడ్న్యూస్ చెప్పింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వివిధ దేశాలకు చెందిన రీల్స్ వస్తుంటాయి. దాంతో భాష అర్థం కాక ఇబ్బందిపడుతుంటారు. తాజాగా ఈ సమస్యకు మెటా కంపెనీ చెక్ పెట్టింది. హిందీ, పోర్చుగీస్ భాషలకు కూడా ఏఐ ఆధారిత వీడియో టాన్స్లేట్ ఫీచర్ను రిలీజ్ చేసింది. దాంటే కంటెంట్ క్రియేటర్లు తమ సొంత వాయిస్ను ఉపయోగించి ఇతర భాషల్లోనూ తమ వీడియోలను ఆటోమేటిక్గా డబ్
గోల్డ్ ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1860 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 4 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,1,860 తగ్గి రూ.1,22,290కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ,1,700 పతనమై
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానం లో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్లోని 100 మంది సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ ఫస్ట్ ప్లేస్ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 105 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ముకేశ్ సంపద 12 శాతం క్షీణించింది. ఇక ముకేశ్ అంబానీ తర్వాత 92 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ
ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ నూతన బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి సమంత ను నియమించుకున్నది. ఈ సందర్భంగా జోయాలుక్కాస్ గ్రూపు చైర్మన్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ సమంత నేటి మహిళ ఆత్మవిశ్వాసం, శైలి, ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబించనున్నారని, ఆమెను జోయాలుక్కాస్ కుటుంబంలోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. సమంత మాట్లాడుతూ ఆభరణాలు ఎల్లప్పుడూ నా వ్యక్తిగత శైలిని తెలియచేజే మార్గంగా భావిస్తాను, ప్రతి ఆభరణం వెనుక ఎన్నో భావోద్వేగాలు,
అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ దేశంలోనే మొదటిసారిగా తమ తయారీ యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నది. సుమారు రూ.9 వేల కోట్లు పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు తెలిపింది. ఈమేరకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసే మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ హబ్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తొలిసారి బిలియనీర్ల క్లబ్లో చేరారు. రూ.12,490 కోట్ల నెట్వర్త్తో తొలిసారి ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్లో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన ముకేశ్ అంబానీనే టాప్లో ఉన్నారు. ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 14వ ఎడిషన్ ప్రకారం ముకేశ్ అంబానీ కుటుంబం భారత్లో అత్యంత సంపన్నులుగా నిలిచారు. అంబానీ ఫ్యామిలీ రూ.9.55 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ
జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్స ఎయిర్లైన్స్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేండ్లలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. 2023 నాటికి 4,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. ఖర్చులను తగ్గించి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తన కార్యకలాపాల విస్తృత సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లుఫ్తాన్స తన ప్రకటనలో తెలిపింది. కాగా సంస్థ నిర్ణయంతో
క్రోమా ప్రస్తుత పండుగ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి, ధంతేరస్లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ఆఫర్లు అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది. తొమ్మిది విభాగాల్లో టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఏసీలు కొనుగోలు చేసిన వారికి 20 శాతం వరకు క్యాష్బ్యాక్తోపాటు 45 శాతం వరకు తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, వాషింగ్మిషిన్లు, ల్యాప్టాప్లు, రిఫ్రిజిరేటర్లను ఆన్లైన్, ఆఫ్లైన్లో కొనుగోలు చేసిన వారికి క్యాష్బ్యాక్తోపాటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల మోత మోగించారు. తమ దేశంలోకి వచ్చే అన్ని బ్రాండెడ్, పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్స్ దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి 100 శాతం సుంకాలుంటాయని ప్రకటించారు. దీంతో భారతీయ ఫార్మా రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మెజారిటీ ఔషధ తయారీ సంస్థలకు అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయమే కీలకం. ఇప్పుడీ సుంకాలు దానికి గండికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి. విదేశీ సంస్థలు అమెరికాలో ఏర్పాటు
బంగారం, వెండి ధరలు రోజు రోజుకీ పరుగులు పెడుతూనే ఉ న్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.2700 పెరిగి రూ. 1,18,900కు చేరుకుంది. సురక్షితమైన ఆస్తిగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, అమెరికా హెచ్1బి వీసా పెంపు నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పడిపోవ డం వంటివి బంగారం ధర పెరుగుదలకు కారణవుతున్నాయి. ఆల్ ఇండి యా సరఫ అసోసియేషన్ ప్రకార.. క్రితం
హెచ్-1బీ వీసా విషయంలో ట్రంప్ తాజా నిర్ణయంతో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్, మెటా వంటి ప్రధాన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి. H-1B వీసాదారులందరూ కనీసం 14 రోజుల పాటూ అమెరికాను విడిచి వెళ్లొద్దని సూచించాయి.ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులు 24 గంటల్లోపు తిరిగి యూఎస్కు రావాలని ఆదేశించాయి. అమెరికాలో తమ భవిష్యత్తు కోసం విదేశీ ఉద్యోగులు ఈ ఆదేశాలను పాటించాలని
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుండి పెరుగుతున్న ఒత్తిడి, ఉద్యోగ గణాంకాల క్షీణతతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను 0.25శాతం తగ్గించింది. గతేడాది డిసెంబర్ తర్వాత ఫెడ్ నుండి ఇదే మొదటి వడ్డీ రేట్ల తగ్గింపు. దీంతో వడ్డీ రేట్లు 4-4.25శాతానికి పరిమితమయ్యాయి. ఈ ఏడాది మరో రెండు సార్లు, 2026లో మరోసారి రేట్లను తగ్గించాలని అధికారులు భావిస్తున్నారని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. వడ్డీ రేట్ల తగ్గుదల అంచనా
ఇటీవల బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో రోజురోజుకు సరికొత్త గరిష్టాలను చేరాయి. తాజాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ప్రకటనకు ముందు బంగారం ధరలు ఆల్టైమ్ హై నుంచి పతనమయ్యాయి. ఢిల్లీలో ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.1300 తగ్గి.. తులం ధర రూ.1,13,800కి తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను విభాగం నిర్ణయం తీసుకుంది. కేవలం ఒకే ఒక్కరోజు (సెప్టెంబర్ 16 వరకు) పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఆదాయపు పన్ను విభాగం ప్రకటన చేసింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో యూజర్ల ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల(సీబీడీటీ) బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. 2025-26 మదింపు సంవత్సరానికి గాను
రష్యా (Russia) నుంచి ముడి చమురు కొంటున్న భారత్ (India) పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు .. నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.