అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మరో ఉచిత పథకానికి శ్రీకారం చుట్టారు. పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించారు. మార్చి 7, శనివారం నుంచే యువ సతి పేరుతో ఈ పథకం ప్రారంభమవుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు.
నిజానికి ఈ పథకం ఏప్రిల్ నుంచి ప్రారంభం కావాలని, కానీ, ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ప్రకారం పదో తరగతి పాసైన 21-40 ఏళ్ల మధ్య గల యువతీ యువకులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.1,500 ప్రభుత్వం నుంచి అందుతాయి. ఈ రోజు నుంచే ఈ పథకం ప్రారంభమవుతుంది. అయితే, నిరుద్యోగులకే కాకుండా ఇతర చదువులు చదువుతున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఉద్యోగం, వేతనాలు లేకుంటే చాలు ఈ పథకాన్ని పొందవచ్చు.


