దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ మాట్లాడుతూ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఇప్పటికే శివాజీ క్షమాపణలు కూడా తెలియజేశాడు. తాజాగా తన స్పీచ్పై మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు శివాజీ. తనతోపాటు స్టేజ్పై ఉన్న ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాడు. నా 30 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా జరుగలేదు. నా స్టేట్మెంట్కు కట్టుబడే ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రం తప్పుగా మాట్లాడానన్నాడు. ఆ రోజు స్టేజీ మీదున్న నా తోటి నటీనటులు, ఆడబిడ్డలకు మొదట క్షమాపణలు చెప్పాలి. ఆ పదాలు దొర్లకూడదు. నేనిక్కడికి వచ్చి 30 సంవత్సరాలైంది. నా జీవితంలో ఎప్పుడూ ఇలా జరుగలేదన్నాడు.


