వైసీపీ నుంచి జగన్ అవకాశం ఇవ్వకపోతే, సొంతగా పోటీ చేసి నా బలం చూపిస్తా అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనమండలి లో తన వాణి వినిపిస్తానని చెప్పారు. త్వరలోనే జగన్ను కలుస్తానని ఆయన పేర్కొన్నారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని అన్నారు.

































