మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త ఆశలతో ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు. 2026 ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాఅని ప్రధాని తెలిపారు.


