సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ప్రమాదం చాలా బాధకలిగించిందని అన్నారు. మృతుల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ విషాదకర సమయంలో బాధిత కుటుంబాలకు ధైర్యం, ఓదార్పు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.


