ఈ ఏడాది జూన్లో మహిళల టీ20 వరల్డ్కప్ జరగనున్నది. దీని కోసం ఐసీసీ ప్రైజ్మనీ ప్రకటించింది. వరల్డ్కప్లో విజేతలకు అందజేసే ప్రైజ్మనీని రికార్డు స్థాయిలో పెంచేసింది. రెండు నెలల పాటు ఇంగ్లండ్, వేల్స్లో జరిగే వరల్డ్కప్ కోసం సుమారు 82 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది ఐసీసీ. గత ఎడిషన్తో పోలిస్తే సుమారు 10 శాతం ప్రైజ్మనీ పెంచారు. ఈసారి ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. 2024లో కేవలం 10 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. జూన్ 12 నుంచి జూలై 5వ తేదీ వరకు ఏడు వేదికల్లో టోర్నీ జరగనున్నది. లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆడుతారు.
గత వరల్డ్కప్లో ప్రైజ్మనీ 74 కోట్లు కాగా, ఈసారి 82 కోట్లు ఇవ్వనున్నారు. వరల్డ్కప్ విజేతలు ఈసారి 21.8 కోట్ల ప్రైజ్మనీ గెలుచుకుంటారు. ఇక రన్నరప్కు 10 కోట్లు ఇవ్వనున్నారు. సెమీఫైనల్లోకి ఎంటరైన జట్లకు 6.29 కోట్లు ఇవ్వనున్నారు. ఇక గ్రూపు మ్యాచ్ ఆడిన ప్రతి జట్టుకు 29 లక్షలు ఇవ్వనున్నారు. ప్రతి జట్టుకు కనీసం రెండు కోట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొన్నది. జూన్ 12వ తేదీన బర్మింగ్హామ్లో శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్ , స్కాట్ల్యాండ్, దక్షిణాప్రికా, వెస్ట్ ఇండీస్ కూడా టోర్నీలో ఉన్నాయి. 24 రోజుల్లో మొత్తం 33 మ్యాచ్లు ఆడనున్నారు.


