దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ వరుస చిత్రాలతో బిజీ అవుతున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు గాయపడ్డ సింహం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి కథానాయికలుగా నటించారు. దర్శకుడు పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కలిపిన విడుదల చేశారు. కామెడీ, వ్యంగ్యం, యాక్షన్ అంశాలను కలగలిపి సరదాగా రూపొందించినట్లు కనిపిస్తోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. దర్శకుడిగా ఇప్పటికే విజయాలు అందుకున్న తరుణ్ భాస్కర్కు నటుడిగా ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. వినోదంతో పాటు సమాజంలోని యువత సమస్యలను టచ్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


