బండ్ల గణేష్ కుమార్తె జనని బండ్ల పెండ్లి పీటలెక్కబోతున్నారు. ఈ శుభకార్యానికి సంబంధించి తొలి అడుగుగా ఇంట్లో పసుపు కుంకుమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం. చిరంజీవి సూర్యతేజ చిలుకూరి మరియు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జనని బండ్ల ల వివాహ సందర్భంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించాం అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


