రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నాలుగేళ్లకు చేరుకున్నది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడో మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. రష్యాపై కాలుదువ్వడాన్ని సమర్ధించుకున్న జెలెన్స్కీ, తామేమీ యుద్ధం నుంచి విరమించడం లేదన్నారు. ఈ యుద్ధంలో తాము విజేతలుగా నిలుస్తామని
మెక్సికో కు చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెంచో ను హతమార్చిన ఘనతను పూర్తిగా తన ఖాతాలో వేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ మెక్సికో మాత్రం ఎల్ మెంచో అంతానికి పక్కా ప్లాన్ చేసింది అమెరికా కాదని, తమ స్పెషల్ ట్రూప్స్ అని చెబుతోంది. మెక్సికో సైన్యం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో ఎల్ మెంచో హతమయ్యాడు. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు
ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. గత నెలలో జరిగిన ఆందోళనను ప్రభుత్వం కఠినంగా అణచివేయడంతో సద్దుమణిగినట్టు కనిపించినా మళ్లీ మతపాలకులకు నిరసన తెలుపుతూ వీధుల్లోకి వచ్చారు. టెహ్రాన్లోని షరీఫ్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ విద్యార్థులు బి షరఫ్ (సిగ్గుచేటు) అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనెయ్ను హంతక నేత గా అభివర్ణించారు. ప్రవాసంలో ఉన్న రాకుమారుడు రెజా పహ్లవీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఖరారైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. ఈ మేరకు వైట్హౌస్ అధికారి ఒకరు అధికారికంగా పర్యటన తేదీలను ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, ఆర్థిక సంబంధాలను చక్కదిద్దడమే
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్లు చెల్లవని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం సుంకాలను విధించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. ప్రపంచ దేశాలపై సుంకాలకు సంబంధించి అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ట్రంప్ తప్పుబట్టారు. అత్యంత
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల నిబంధనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్జియాలోని రోమ్ నగరంలో జరిగిన ఒక సభలో ట్రంప్ ప్రసంగించారు. ఓటు వేయాలంటే ఓటర్ ఐడీ కార్డుతో పాటు పౌరసత్వ రుజువును తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కఠినమైన నిబంధనలు అవసరమని స్పష్టం చేశారు. డెమోక్రాట్లు కేవలం ఎన్నికల్లో మోసం చేసేందుకే ఓటర్ ఐడీని వ్యతిరేకిస్తున్నారని
బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య వీసాల జారీ రెండు నెలలక్రితం నిలిచిపోయింది. మూడు నెలల క్రితం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగాయి. అలాగే ఇండియాలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్
అమెరికా- ఇరాన్ మధ్య ఉన్న వివాదం ఎటూ తేలడం లేదు. తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాల్సిందే అని ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అయితే, ఈ అంశంపై ఇరాన్ కొన్ని షరతులు విధించింది. ఒకవైపు ఒప్పందంపై చర్చలు అంటూనే, రెండు దేశాలూ యుద్ధ సన్నాహాలు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. 10-15 రోజుల్లో ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకుని
అమెరికాకు చెందిన ప్యాక్స్ సిలికా తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్యాక్స్ లికా డిక్లరేషన్పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో రెండు దేశాలు ఈ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ప్రతినిధి సెర్గియో గోర్ సమక్షంలో ఈ డిక్లరేషన్పై సంతకం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవహారాల మంత్రి జాకబ్ హెల్బర్గ్ కూడా పాల్గొన్నారు.
చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందన్న అమెరికా ప్రకటనపై రష్యా ఘాటుగా స్పందించింది. ఆ వార్తలను విశ్వసించేందుకు తగిన ఆధారం లేదని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ తన వైఖరి మార్చుకుందని విశ్వసించేందుకు ఎటువంటి ఆధారం లేదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. ఈ కొనుగోళ్లు రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని కొనసాగించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు.
కృత్రిమ మేధ ఇప్పుడు శరవేగంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియను ఆర్థికంగా ముందుకు సాగుతున్న దేశాలు సద్వినియోగం చేసుకోవచ్చునని గుగూల్ సిఇఒ సుందర్ పిచాయ్ తెలిపారు. ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. ఏఐ హైపర్ ప్రోగ్రెస్ను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలననేది మన చేతుల్లోనే ఉందన్నారు. డిజిటల్ డివైడ్, ఏఐ డివైడ్లతో ప్రపంచ సార్వత్రిక ప్రగతి కుంటుపడుతుందన్నారు. ఏఐ రాకతో అనివార్యంగా వర్క్ఫోర్స్ మార్పులు జరుగుతాయి. కొన్ని
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. మేక్రాన్, ప్రధాని మోదీ మధ్య చర్చల అనంతరం అనేక అంశాల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం ఫ్రాన్స్లో చదివేందుకు భారతీయ విద్యార్థులకు అవకాశాలు మెరుగవ్వనున్నాయి. 2030 నాటికి అక్కడ భారతీయ విద్యార్థుల సంఖ్య 30,000కు పెంచాలని నిర్ణయించారు. ఇప్పుడు అక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 10,000గా ఉంది.అంటే రాబోయే నాలుగేళ్లలో మరో
మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్వహించిన ఈ శివాలయాల సందర్శన యాత్రకు విశేష స్పందన లభించింది. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు ఈ యాత్ర నిర్వహించారు. ఈ భక్తి యాత్రలో భాగంగా సింగపూర్లో ఉన్న 9-12 ప్రముఖ
అమెరికాలో భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (22) ఫిబ్రవరి 9వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతని కోసం ఐదు రోజులుగా అమెరికా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆచూకీ లభించలేదు. ఈ మిస్సింగ్పై శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ఐఐటీ మద్రాస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాకేత్, అమెరికా కాలిఫోర్నియాలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు.
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకింగ్ పెరిగింది. అంటే మన పాస్పోర్ట్ విలువ పెరిగింది. అయినా, ఇండియాకు ఫ్రీ వీసా ఇచ్చే దేశాల సంఖ్య తగ్గింది. తాజాగా రెండు దేశాలు ఇండియన్స్కు ఇప్పటిదాకా ఉన్న ఫ్రీ వీసా సౌకర్యాన్ని ఇటీవల రద్దు చేశాయి. ఇరాన్, బొలీవియా దేశాలు ఇండియాకు ఫ్రీ వీసా సౌకర్యాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మన పాస్పోర్ట్ 75వ స్తానంలో
పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా అమెరికాలో మరణించిన జాహ్నవి కందుల కుటుంబానికి అమెరికా ప్రభుత్వం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిహారంపై జాహ్నవి తల్లి విజయ లక్ష్మి స్పందించారు. ఆ డబ్బుతో ఏం చేసుకోవాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ పరిహారంతో మాకు కొంత మేలు జరుగుతుందని అనుకోవచ్చు. ఈ డబ్బుతో మేమేం చేసుకోవాలి. యాక్సిడెంట్ చేసి
అమెరికాలో ఓ బాద్యత గల పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు యువతి జాహ్నవి కందుల (23) అనే యువతి కుటుంబానికి న్యాయం జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు అధికారిని విధులనుంచి తొలగించడంతో పాటు మృతురాలు కుటుంబానికి అక్కడి ప్రభుత్వం రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. 2023 జనవరిలో సియాటెల్
ప్రపంచవ్యాప్తంగా పాస్పోర్ట్ శక్తిని అంచనా వేసే ప్రతిష్టాత్మక నివేదిక హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 విడుదలైంది. ఈ నివేదికలో భారత పాస్పోర్ట్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి 75వ స్థానానికి చేరుకుంది, అంటే ఒకే ఏడాదిలో 10 స్థానాలు పైకి ఎగబాకింది. ప్రస్తుతం భారత పాస్పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా లేకుండా లేదా అక్కడికి వెళ్ళాక వీసా తీసుకునే
అమెరికాలో జార్జియా రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెలుగు వ్యక్తి చాడ సుహృత్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. అట్లాంటా శివారు ప్రాంతాలైన శాండీ స్ప్రింగ్స్, డన్వుడీ పోలీసులు సంయుక్తంగా అండర్ కవర్ ఆపరేషన్ ఆపరేషన్ నిర్వహించిన వీరిని పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా, వ్యభిచార ముఠాలపై మానవ అక్రమ రవాణా లక్ష్యంగా జనవరి 29, 30వ తేదీల్లో ఆపరేషన్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా పర్యటనలో భాగంగా ఆయనను సత్కరించేందుకు మలేషియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, స్థానిక భారతీయులతో స్వాగత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాకారుల బృందాలతో ప్రధానమంత్రిని స్వాగతించి సత్కరించారు. ముఖ్యంగా మైటా (మలేషియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేదిక పైన తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకారుల బతుకమ్మ, బోనాలు, లంబాడి నృత్యాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మైటా అధ్యక్షుడు సైదం
జపాన్ రాజకీయాల్లో ఓ మహిళ చరిత్ర సృష్టించింది. 2025 అక్టోబర్లోనే ఆ దేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి సనాయే తకైచి బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలం ప్రారంభమైన కొద్ది నెలలకే ఆమె ఖాతాలో మరో విజయం వేసుకుంది. 2026 ఫిబ్రవరి 8న జపాన్లో జరిగిన స్నాప్ ఎన్నికల్లో ఆమె లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. లోయర్ హౌస్లో సూపర్ మెజారిటీ సాధించింది. మొత్తం 465 సీట్లున్న హౌస్
పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఆంటోనియో జోస్ సెగురో అఖండ విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తంగా 95.37 శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిని లెక్కించినప్పుడు సోషలిస్టు పార్టీ (పిఎస్)కి చెందిన అధ్యక్ష అభ్యర్థి సెగురోకు 66.14 శాతం ఓట్లు రాగా, మితవాద చేగా పార్టీకి చెందిన వెంచురాకు 33.86 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం ఆంటోనియో అధ్యక్షుడిగా భారీ మెజార్జీతో ఎన్నికయ్యారు. ఈ
మలేసియా లో త్వరలో కొత్త కాన్యులేట్ ఏర్పాటు చేయనున్నట్టు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రెండ్రోజుల మలేసియా పర్యటన నిమత్తం కౌలాలంపూర్ చేరుకున్న ఆయనకు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సాదర స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు ఆహ్వానం పలికారు. అనంతరం కౌలాలంపూర్ లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. భారత్ పదేళ్లలో వేగంగా సాధిస్తున్న ప్రగతిని ఈ సందర్భంగా
భారత్లో పేద బస్తీల్లో గోడలనే తరగతి గదులుగా మార్చిన రూబుల్ నాగి గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్నారు.దుబాయ్లో నిర్వహించిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ వేదికగా పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డుతోపాటు మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.9 కోట్లు) నగదు ఆమెకు బహుమతిగా దక్కింది.సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా ఆమె చేసిన సేవలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. రూబుల్ నాగి తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా దేశంలోని వెనుకబడిన వర్గాల పిల్లల
స్కిడ్ గేమ్ వంటి దక్షిణ కొరియా టీవీ షోలను వీక్షించినా, కే-పాప్ను ఆలకించినా ఉత్తర కొరియా ప్రభుత్వం తన ప్రజలకు మరణశిక్ష విధిస్తున్నదని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజాగా వెల్లడించింది. దక్షిణ కొరియాకు చెందిన మీడియాను వినియోగించినా స్కూలు పిల్లలను సైతం ఉత్తర కొరియా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తున్నదని ఆమ్నెస్టీ తెలిపింది. విదేశీ కంటెంట్ వాడకంపై యువజనులను హెచ్చరించడానికి బహిరంగ మరణశిక్షలను బలవంతంగా వారికి చూపిస్తున్నదని ఉత్తర
ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్కు ఇతర మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నట్టు బయటపడడం వల్లనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పినట్టు బిల్గేట్స్ మాజీ భార్య మిలిందా వెల్లడించారు. ఈ వివరాలు తెలియడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు. వైవాహిక బంధం విలువలు ఆయన నిలబెట్టుకోకపోవడం వల్లనే విడాకులు తీసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తులో బయటపడిన విషయాలపై ఆయనే సమాధానం చెప్పుకోవాలని, తాను కాదని వ్యాఖ్యానించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల అధికారిక పర్యటనకు మలేసియా వెళ్తున్నారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 7,8 తేదీలో మలేసియాలో పర్యటించనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. మలేసియాలో మోదీ పర్యటించనుండటం ఇది మూడోసారి. అయితే 2024 ఆగస్టులో ఇరుదేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను కుదుర్చుకున్న తరువాత మలేసియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే ప్రధాన లక్ష్యంగా మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు గుడ్ న్యూస్ చెప్పారు. భారత్ పై విధిస్తున్న టారిఫ్లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా, డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 1.4 బిలియన్ల భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్కు పెద్ద ధన్యవాదాలు అని, ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని
ఆస్ట్రేలియా మెల్బోర్న్ లోని భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే రోవ్ విల్లే ప్రాంతంలో గాంధీ మహాత్ముని కాంస్య విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడమే కాక, విగ్రహాన్ని కాజేశారు. విగ్రహం పాదాలు మాత్రమే ఉంచి, కాళ్ల వరకు కోసి వేసి ఎత్తు కెళ్లారు. ఈ సంఘటనపై భారతీయ సమాజం స్థానిక విక్టోరియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ విషయాన్ని
అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఊరటనిచ్చేలా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న డ్యూటీ-ఫ్రీ దిగుమతి పరిమితిని పెంచుతూ, కొత్తగా రూ. 75 వేల వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్కు తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మార్పులు బ్యాగేజ్ రూల్స్, 2026 కింద చేపట్టగా, ఫిబ్రవరి 2, 2026 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. దాదాపు పదేళ్ల
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్న్యూస్ చెప్పారు. భారత స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం కల్పించారు. పార్లమెంటు లో నాడు కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ మౌలిక వసతుల కోసం రూ.12.2లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వైద్య అనుబంధ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. లక్ష ఏహెచ్పీలను ఏర్పాటు చేయబోతున్నట్లు
ప్రఖ్యాత టిబెట్ బౌద్ధ మతగురువు దలైలామాకు 90 ఏండ్ల వయస్సులో విశిష్ట గ్రామీ అవార్డు దక్కింది. ఈ వయస్సులో ఈ పురస్కారం రావడం విశేష అంశం అయింది. ఆయన మాటలతో కూడిన ఆల్బమ్ మెడిటేషన్స్ ఆడియోకు గ్రామీ రావడం టిబెట్లో ఆయన అభిమానుల నుంచి సంతోషానికి దారితీసింది. టిబెట్ మతగురువు దలైలామా టెంజిన్ గ్యాస్టోకు అవార్డు ప్రకటించినట్లు అంతకు ముందు గ్రామీ వర్గాలు ప్రకటించాయి. అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో జరిగిన
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి కీలక వడ్డీ రేట్లు తగ్గించాలని తమ కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ కు చెబుతూ వస్తున్నారు. కానీ ఫెడ్ రిజర్వ్ ప్రస్తుత ఛైర్మన్ జెరోమ్ పావెల్ అంతగా పట్టించుకోలేదు. ఈ ఏడాది మే నెలలో పావెల్ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో కొత్త గవర్నర్గా కెవిన్ వార్ష్ ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే 2017లో
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా, రాజకీయ ఒత్తిళ్లతో నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. కేసీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదు అని తెలంగాణ రాజకీయ ప్రతీక అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్పై నిందలు వేయాలని
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నారై సెల్ ద్వారా ఆయా మున్సిపాల్టీలలో సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని విస్తృత ప్రసారం చేస్తామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ
భారత్ విషయంలో కెనడా రివర్స్ గేర్ వేసింది. ఇన్నాళ్లూ దౌత్య విభేదాలతో భారత్కు దూరంగా ఉన్న కెనడా గోవా వేదికగా జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2026 లో ఇరుదేశాల మధ్య ఇంధన బంధాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈక్రమంలోనే కెనడా ఇంధన శాఖ మంత్రి టిమ్ హడ్గ్సన్, భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగానే కెనడా మంత్రి షాకింగ్
పశ్చిమాసియా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ గగనతలం, భూభాగం మీదగా ఎలాంటి మిలటరీ దాడులకు పాల్పడ్డకుండా నిషేధం విధించింది. క్రౌన్ ప్రిన్స్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో సంభాషణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా, ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుంది, ఏ పార్టీ నుండి అయినా, వారి మూలంతో సంబంధం లేకుండా, దేశంపై దాడులు లేదా సైనిక కార్యకలాపాలను
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ శాఖ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ మహిళా నేత ఇల్హన్ ఒమర్పై దాడి చేశారు. మిన్నసొట్టాలో ఓ మీటింగ్లో మాట్లాడుతున్న సమయంలో చట్టసభ ప్రతినిధి ఒమర్పై ఓ వ్యక్తి ద్రవాన్ని చల్లాడు. అయినా ఆ ప్రతినిధి వెనుకడుగు వేయకుండా తన స్వరాన్ని వినిపించారు. సొమాలియాలో పుట్టిన అమెరికా ప్రతినిధి అయిన ఇల్హన్ చాన్నాళ్లుగా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చేతుల్లో ఇప్పటికే ఇద్దరు
భారత్-ఈయూ (యురోపియన్ యూనియన్) మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు. యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో లూయిస్తో కలిసి ఉమ్మడిగా మోదీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.భారత్-ఈయూ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న
కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఎంబసీ ప్రాంగణంలో 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. కువైట్లో భారతదేశపు తొలి మహిళా రాయబారి అయిన పరమిత త్రిపాఠి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీతోపాటు అమరవీరులైన సైనికులకు పుష్పగుచ్ఛాలు సమర్పించి, నివాళులు అర్పించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఆమె చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కువైట్లో ఇది నా మొదటి గణతంత్ర దినోత్సవం, మీ
ఆటోలు, కలప మరియు ఫార్మాన్యూటికల్స్ సహా దక్షిణ కొరియా వస్తువులపై సుంకాలు పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికాతో కుదుర్చుకున్న గత వాణిజ్య ఒప్పందానికి అనుగుణంగా దక్షిణ కొరియా వ్యవహరించడం లేదని ఆరోపించారు. తాజా పెంపుతో ఆ దేశంపై సుంకాలు 15శాతం నుండి 25శాతానికి చేరనున్నాయి. వారి ప్రత్యేక హక్కు అయిన మా చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని దక్షిణ కొరియా శాసనసభ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. టారిఫ్ల
77వ గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న ఇండియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. 77వ గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న ఇండియా ప్రజలకు, ప్రభుత్వానికి అమెరికా ప్రజల తరఫున, నా తరఫున శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, ఇండియా చారిత్రక బంధాన్ని కలిగి ఉన్నాయి అని ట్రంప్ పేర్కొన్నారు. ఇండియాపై టారిఫ్లు విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నప్పటికీ ఆయన చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్యగల సంబంధాన్ని తెలియజేస్తోంది.
పాకిస్థాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) షాక్ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడి భారత పర్యటన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రతిపాదనను యూఏఈ విరమించుకున్నది. 2025 ఆగస్ట్ నుంచి చర్చలు జరుగుతున్న ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. ఎయిర్పోర్ట్ కార్యకలాపాల అవుట్సోర్స్ భాగస్వామిని గుర్తించకపోవడంతో నిర్వహణ ప్రణాళికను యూఏఈ రద్దు చేసినట్లు పేర్కొంది. కాగా, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో యూఏఈ
అమెరికాలో నివసించే భారతీయ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య, ముగ్గురు బంధువులను కాల్చి చంపాడు. భయాందోళన చెందిన ఇరు కటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు అల్మారాలో దాక్కున్నారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. 51 ఏళ్ల విజయ్ కుమార్, 43 ఏళ్ల భార్య మీము డోగ్రా, 12 ఏళ్ల చైల్డ్తో కలిసి అట్లాంటాలో నివసిస్తున్నాడు. వారి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ట్రంప్ ఎడమ చేతిపై గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రపంచ నేతలతో చర్చలు జరుపుతున్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోల్లో ట్రంప్ ఎడమ చేతిపై గాయం స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే. దీనిపై
ఇరాన్ పై దాడి చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్న వేళ, అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈసారి దాడి చేస్తే, తాము గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది. తమ దేశంపై ఎలాంటి సైనిక దాడి జరిగినా, దాన్ని పూర్తి స్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని తెలిపింది. ఇరాన్ లో సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంపై దాడి చేయడానికి అమెరికా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. యుద్ధ నౌకల్ని మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి తరలించింది. దీంతో
2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాల యుద్ధం ముగింపు పలకాలని, శాంతి నెలకొల్పాలని పలు దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దఫాలుగా వివిధ ప్రాంతాల్లో ఆ రెండు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయినా కానీ ఫలితం తగ్గడంలేదు. తాజాగా మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అబుదాబిలో రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.
అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో నుంచి యూఎస్ అధికారికంగా వైదొలిగింది. కొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో డబ్ల్యూహెచ్వో విఫలమైందని అమెరికా తెలిపింది. ఇక నుంచి పరిమిత పరిధి మేరకు ఆ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు యూఎస్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మొన్న హరీశ్రావుకు, నిన్న కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీయడానికి, ప్రశ్నించే గొంతులను నొక్కడానికి, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికే నోటీసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. రోజుకో కొత్త డ్రామాకు
స్విట్జర్లాండ్లోని దావోస్లో బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటుపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాధినేతలతో కలిసి ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటుపై గత ఏడాది ఆలోచన పుట్టింది. వాస్తవానికి గత సెప్టెంబర్లో గాజా యుద్ధం కోసం 20 సూత్రాల శాంతి ఒప్పందాన్ని ఆయన క్రియేట్ చేశారు. అయితే ఆ ప్లాన్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళికకు యూఎన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ కు సిట్ నోటీసులు కేవలం రాజకీయ కుట్ర, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనన్నారు. మొన్న హరీష్ రావుకు, నేడు కేటీఆర్కు నోటీసులనీ కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతుందని ఆరోపించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి తమ అక్రమాలను, కుంభకోణాలను బయటపెడ్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సు సందర్భంగా అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో ఆ సంస్థ సీఈఓ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో రూ.1,000
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తున్నారు. ఇటీవలే వెనిజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి, అక్కడి ప్రభుత్వాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ట్రంప్, ఈసారి దావోస్ సదస్సులో గ్రీన్లాండ్ను హస్తగతం చేసుకుంటామని తేల్చి చెప్పారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రపంచ నేతల ముందే తాము మంచుముక్కను మాత్రమే అడుగుతున్నామని, అది కూడా గ్రీన్లాండ్కు రక్షణకోసమేనని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన చేశారు. ఫ్రాన్స్పై భారీగా సుంకాలు విధిస్తానని బెదిరింపులకు దిగారు. గాజా పునర్నిర్మాణం కోసం ఆయన ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడానికి ఫ్రాన్స్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్, ఆదేశంపై టారిఫ్స్ బాంబ్ పేల్చారు. ఫ్రాన్స్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపైన్లపై ఏకంగా 200 శాతం టారిఫ్ విధిస్తానని బెదిరింపులకు దిగారు.
తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలకు ముగ్గుల పోటీ, కైట్ ఫెస్టివల్, వనభోజనాలు, టగ్ ఆఫ్ వార్, చిత్రలేఖనం, క్రికెట్ పోటీలు వంటివి నిర్వహించారు. ఈ వేడుకల్లో నృత్యాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రవాసులను అలరించాయి. స్థానిక ఎన్నారై సంఘాల ఆధ్వర్యం లో గల్ఫ్, అమెరికా, ఐరోపాల్లో భారత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. జపాన్తో పాటు పలు దేశాల్లో
గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. గ్రీన్లాండ్ విషయంలో తమకు సమర్థించని యూరప్ దేశాలపై 10 శాతం సుంకం విధిస్తామని చేసిన ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జూలైలో ప్రకటించిన యూఎస్ – ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూరోపియన్ పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు
భారత్లో కృత్రిమ మేధ(ఏఐ) సేవల కోసం అమెరికా వనరులను ఎందుకు ఉపయోగించాలని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ప్రశ్నించారు. పీటర్ నవారో మాట్లాడుతూ చాట్జీపీటీ లాంటి ఏఐ ప్లాట్ఫామ్స్ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని, అయితే వాటి యూజర్లు మాత్రం చైనా, భారత్లో ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ సేవల కోసం అమెరికా విద్యుత్తును ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్నారు. ఇండియాలో ఏఐ కోసం అమెరికన్లు ఎందుకు చెల్లిస్తున్నారు అని ఆయన
నాటో నుంచి అమెరికా బయటకు వచ్చే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీ నం చేసుకోవడానికి నాటో మిత్ర దేశాలు మద్దతివ్వకపోతే, ఈ పరిణామ జరుగుతుందని బెదిరించారు. గీన్లాండ్పై నాటో తమతో చర్చలు జరుపుతున్నదని,దేశ భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు చాలా అవసమని చెప్పారు. అది తమ ఆధీనంలో లేకపోతే, దేశ భద్రత, ముఖ్యంగా గోల్డెన్ డోమ్ విషయంలో, పెద్ద లోపం
తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్ ) నూతన అధ్యక్షురాలిగా లోకిరెడ్డి మాధవి బాధ్యతలు చేపట్టారు. డాలస్లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో 2026 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. 1986లో ప్రారంభమై 40వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్ ) సంస్థకు అధ్యక్షురాలిగా సేవలందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని లోకిరెడ్డి మాధవి అన్నారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన
ఇటీవల ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఆకాశ మార్గాలకూ ముప్పుగా మారుతున్నాయి. అమెరికా విమానయాన సంస్థలకు ఎఫ్ఏఏ (ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్) హెచ్చరికలు జారీ చేసింది. సైనిక కార్యకలాపాల నేపథ్యంలో మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామా సహా తూర్పు పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ నోటీసు 60 రోజుల వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. విమానం
అమెరికాలో ప్రస్తుతం చీకటి రోజులు నడుస్తున్నాయని భారత సంతతికి చెందిన అమెరికా టీవీ యాంకర్, పాకశాస్త్ర నిపుణురాలు పద్మాలక్ష్మి అన్నారు. ప్రస్తుత చీకటి కాలం ఆందోళనకరమని ఆమె అభిప్రాయపడ్డారు. పద్మాస్ ఆల్ అమెరికన్: టేల్స్, ట్రావెల్స్ అండ్ రెసిపీస్ ఫ్రమ్ టేస్ట్ ది నేషన్ అండ్ బియాండ్ పేరుతో తాను రాసిన వంటల పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆమె మాట్లాడారు. అమెరికాలో మళ్లీ వెలుగులు వస్తాయని ఆశిస్తున్నానని, కానీ అంతకంటే
వెనిజులా విపక్ష నేత, 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్లోని వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో మారియా మచాడో సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. నోబెల్ పతకాన్ని ఆయనకు అందించాను అని ప్రకటించారు. అయితే, ట్రంప్ ఈ పతకాన్ని భౌతికంగా స్వీకరించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ
ఇరాన్ ,ఇజ్రాయెల్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు యుద్ధ మేఘాలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వరుస హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ఇరాన్లో అంతర్గత అల్లర్లు, ఇజ్రాయెల్పై దాడుల భయం మధ్య భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం ఇజ్రాయెల్లో ఉన్న సుమారు 18,000 మంది భారతీయ
భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. భారతీయ విద్యార్థుల్ని హై రిస్క్ కేటగిరిలో ఉంచింది. దీంతో భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాల మంజూరులో చాలా ఇబ్బందులుంటాయి. అంతేకాదు, తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కేటగిరిలో దక్షిణాసియా దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాను కూడా ఈ కేటగిరిలోనే చేర్చింది. గతంలో ఇండియా ఏఎల్2లో ఉండేది. ఏఎల్3 కేటగిరిలో ఉండటం వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ కఠినంగా ఉంటుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఆయన చేసిన అసాధారణ కృషిని, తెలంగాణను ప్రపంచపటంలో సమున్నత స్థాయిలో నిలిపిన తీరును గుర్తిస్తూ, అంతర్జాతీయ వేదికలపై ఆయన ఆలోచనలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానం అందింది. సాంకేతికత, పాలన, సుస్థిర అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ప్రపంచవ్యాప్తంగా విద్యా, విధాన నిర్ణేత, వ్యాపార వేదికలపై బలమైన
గత ఏడాది అమెరికా సుమారు లక్ష వీసాల ను రద్దు చేసింది. దీంట్లో 8 వేల మంది విద్యార్థులు ఉన్నారు. నేర చరిత్ర ఉన్నవారి వీసాలను రద్దు చేసేందుకు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ కొన్నాళ్లుగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఏడాది లోపే ట్రంప్ ప్రభుత్వం లక్ష మంది వీసాలను రద్దు చేసినట్లు స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు. నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారు, దోషులుగా తేలిన
ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన పుష్పరాజ్ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 16న జపాన్లో పుష్ప 2: ది రూల్ భారీ స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో, ఈ చిత్ర ప్రమోషన్ల కోసం బన్నీ స్వయంగా రంగంలోకి దిగారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి
చైనాలో ఓ మహిళ లవ్ ఇన్సూరెన్స్ పాలసీ చేసి జాక్పాట్ కొట్టేసింది. సెంట్రల్ చైనాలోని షాంగ్జీ ప్రావిన్సుకు చెందిన వూ అనే అమ్మాయి 2016 సంవత్సరంలో 199 యువాన్లకు, అంటే 28 డాలర్లకు లవ్ బీమా చేయించింది. అయితే పదేళ్ల డేటింగ్ తర్వాత ఆమె తన బాయ్ఫ్రెండ్ను పెళ్లాడింది. ఆ లవ్ పాలసీతో ఆమె పదివేల యువాన్లను అంటే 1400 డాలర్లు విత్డ్రా చేసుకున్నది. వూ, వాంగ్లు 2025లో మ్యారేజ్
సంక్షోభం వేళ ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇరాన్తో వాణిజ్యం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా తన మోసపూరిత చర్యలను, నమ్మక ద్రోహులైన కిరాయి వ్యక్తులపై ఆధారపడటాన్ని తక్షణమే నిలిపి వేయాలని
మెరుగైన పని పరిస్జితులను కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నర్సులు న్యూయార్క్ నగరంలో సమ్మె బాట పట్టారు. అమెరికాలోని అతిపెద్దనగరమైన మౌంట్ సినారు, మాంటెఫియోర్, న్యూయార్క్ ప్రెస్బిటేరియన్లోని మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లోని దాదాపు 15వేల మంది నర్సులు తమ విధుల్లోకి వెళ్లకుండా నిష్క్రమించారు. నర్సులకు ఆరోగ్యసంరక్షణ ప్రయోజనాలు, మెరుగైన పని పరిస్థితులు, పని ప్రదేశాల్లో హింస నుంచి వారికి రక్షణ కల్పించుట, రోగులకు సురక్షితమైన సిబ్బంది నియామకంపై నెలల
హాలీవుడ్లోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఒకటి. ప్రస్తుతం కాలిఫోర్నియా లోని బెవర్లీ హిల్స్లో 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం (2026) ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో పలువురు హాలీవుడ్ తారలు సందడి చేశారు. బాలీవుడ్ స్టార్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సైతం ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మెరిశారు. భర్త నిక్ జొనాస్ తో కలిసి వేడుకలకు హాజరైన ప్రియాంక అందరి దృష్టిని
ఖతర్లోని తెలంగాణ ప్రముఖురాలు నందిని అబ్బగౌనికి నారీ శక్తి సమ్మాన్ అవార్డు దక్కింది. ఖతర్-భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారతీయ సాంస్కృతిక వైభవానికి చేసిన కృషిని గుర్తిస్తూ నందినిని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఖతర్లోని భారతీయ ఎంబసీ.. మహిళల శక్తిసామర్థ్యాలు, ప్రతిభ, సేవలకు గుర్తింపుగా నారీ శక్తి
ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది. ఈ మేరకు ఇండియాలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటన చేశారు. ఆయన ఇండియాలో అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్
బ్రిటీష్ యూనివర్సిటీల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరిగిపోతోంది. చాలా మంది ముస్లింలు ఈ అతివాద ప్రభావానికి గురవుతున్నారు. దీంతో తమ దేశానికి చెందిన ముస్లిం విద్యార్థులకు యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కీలక హెచ్చరిక జారీ చేసింది. బ్రిటన్ యూనివర్సిటీల్లో చదువుతున్న తమ దేశానికి చెందిన విద్యార్థులు ఇస్లాం రాడికలైజేషన్ కు గురై, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొ్ంటే ప్రభుత్వం అందించే స్కాలర్ షిప్ లు ఆపేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే గత జూన్
అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచినట్టు పౌరసత్వ, వలస సేవల శాఖ (ఖూజIూ) తాజాగా వెల్లడించింది. ఇప్పటికే హెచ్1-బీ వీసాల వార్షిక ఫీజుల్ని లక్ష డాలర్లకు పెంచేసిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను కూడా పెంచింది. ప్రస్తుతం 2,805 డాలర్లుగా ఉన్న ప్రాసెసింగ్ ఫీజును 2,965 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపు మార్చి 1వ తేదీ నుంచి
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ యువ వాలంటీర్లు అద్భుత చరిత్ర సృష్టించారు. 8 వారాల పాటు ప్రాంతీయంగా నిర్వహించిన ఆహార సేకరణ కార్యక్రమంలో, 30కి పైగా పరిసర ప్రాంతాల నుంచి 7,000 పౌండ్ల పైచిలుకు (3,200 కేజీలు) ఆహారాన్ని సేకరించి స్థానిక ఫుడ్ బ్యాంక్లకు విరాళంగా అందజేశారు. ఈ అపూర్వమైన కార్యక్రమంలో 350 మందికి పైగా యువ వాలంటీర్లు పాల్గొన్నారు. 1,500 పైచిలుకు సర్టిఫైడ్ వాలంటీర్ సర్వీస్ అవర్స్
అమెరికా ప్రభుత్వానికి లొంగిపోయేది లేదని, ఆ దేశంతో తాము కలవబోమని గ్రీన్ ల్యాండ్ పార్లమెంట్ తీర్మానం చేసింది. ఈ మేరకు పార్లమెంట్ లోని అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాయి. ఆర్కిటిక్ ద్వీప దేశమైన గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన కూడా చేశాడు. సైనిక చర్య లేదా ఆ దేశాన్ని కొనుగోలు చేయడం ద్వారానైనా గ్రీన్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఇండోనేషియా ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గ్రోక్ చాట్బాట్ వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించింది. డిజిటల్ వేదికలో వస్తోన్న అసభ్యకర కంటెంట్ను మానవ హక్కులు, గౌరవం, పౌరుల భద్రతా ఉల్లంఘనగా తమ ప్రభుత్వం చూస్తోందని ఇండోనేసియా మంత్రి మోత్యా హఫీద్ పేర్కొన్నారు. ఈ చర్యలు తీసుకున్న తొలి ముస్లీం దేశంగా ఇండోనేషియా నిలిచింది. అయితే, ఎక్స్లోని గ్రోక్ చాట్బాట్లో అసభ్యకర కంటెంట్కు సంబంధించి
గుంటూరుకు చెందిన హరి కృష్ణారెడ్డి కరసాని అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో అదృశ్యమవడం కలకలం రేపుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వెళ్లిన తెలుగు విద్యార్థి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కృష్ణారెడ్డి హ్యూస్టన్లో ఉంటున్నారు. క్రిస్మస్ సెలవులు రావడంతో అలాస్కాకు వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 22, 2025న ఒంటరిగానే హరి అలాస్కా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. డెనాలి సమీపంలోని
గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గ్రీన్లాండ్ను అమ్మే ప్రసక్తే లేదని డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ ట్రంప్ వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ను సొంతం చేసుకునేందుకు ట్రంప్ టీమ్ సరికొత్త ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 57,000 మంది జనాభా కలిగిన ఈ ద్వీపాన్ని సొంతం చేసుకునేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నట్లు టాక్. డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాలో చేరేలా
మెల్బోర్న్లో బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలకు కేటీఆర్ను బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బీఆర్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆహ్వానించారు. హైదరాబాద్ల్ని ఆయన నివాసంలో ఆహ్వానించగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ త్వరలో ఆస్ట్రేలియాకు వచ్చి వేడుకల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు శ్రీ నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ కేటీఆర్ పర్యటన ప్రవాస బీఆర్ఎస్ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ
ఇస్లామిక్ సుప్రీంనేత సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దేశంలోని పలు నగరాల్లో భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, రోజు వారీ ఖర్చులు పెరిగిపోవడంతో జనం రోడ్లమీదకు వచ్చేశారు. వీధుల్లో ఖమేనీకి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. తాజా నిరసనలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మెక్సికోపై బెదిరింపులకు దిగారు. మెక్సికోపై సైనికచర్యలను చేపట్టనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. డ్రగ్స్ అక్రర రవాణాను అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణాను, ముఖ్యంగా మెక్సికో నుండి వచ్చే ఫెంటానిల్ను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆరోపిస్తున్నారు. దక్షిణ సరిహద్దు దాటి అమెరికా సైన్యాన్ని మోహరించనున్నట్లు తెలిపారు.
లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ (లాట) నూతన కార్యనిర్వాహక బృందం, డైరెక్టర్ మండలి తాజాగా బాధ్యతలు చేపట్టాయి. సుధీర్ పొత్తూరి, సురేష్ బాబు అంబటి నాయకత్వంలో కార్యనిర్వాహక వర్గం, డైరెక్టర్ మండలి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని స్థానిక షిరిడీ సాయిబాబా మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగువారు, స్వచ్ఛంద సేవకులు, మిత్రులు హాజరై శుభాభినందనలు తెలియజేశారు. లాట నూతన కార్యవర్గం:అధ్యక్షులు: సుధీర్ పొత్తూరిఉపాధ్యక్షులు: చంద్రశేఖర్ గుత్తికొండకార్యదర్శి: శ్రీకాంత్ వల్లభనేనిసంయుక్త కార్యదర్శి:
స్టూడెంట్ వీసాల విషయంలో భారతీయ విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. వీసాలు హక్కు కాదని, అది ఒక ప్రత్యేక గౌరవం మాత్రమే అని తెలిపింది. స్టూడెంట్ వీసాలపై వెళ్లిన విద్యార్థులు అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నిబంధనలు పాటించకపోతే, వీసాల రద్దు, స్వదేశాలకు తరలింపు, కొంతకాలం వరకు బ్లాక్ లిస్టులో పెట్టడం, అరెస్టు చేయడం వంటి చర్యలుంటాయని తెలిపింది. భవిష్యత్తు లో
పెండింగ్ రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అంశాలకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్ ప్లీజ్ మిమ్మల్ని కలవొచ్చా అంటూ తనను ప్రాధేయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని చెబుతూనే ఆయనను కించపరిచే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అపాచీ హెలికాప్టర్ల సరఫరాతోసహా పెండింగ్లో ఉన్న రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అంశాలను చర్చించేందుకు భారత ప్రధాని మోదీ తనను
వెనెజువెలా దేశాన్ని స్వాధీనం చేసుకున్న అమెరికా ఇప్పుడు ఆ దేశానికి చెందిన చమురు నౌకపై కన్నేసింది. రెండు వారాలుగా వెనెజువెలాకు చెందిన చమురునౌకను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, రష్యా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అమెరికా, ఆ నౌకను సీజ్ చేసిందని సమాచారం. అట్లాంటిక్ సముద్రంలో, బెల్లా-1 అనే ఒక చమురు నౌక ప్రయాణిస్తోంది. వెనెజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించిన అమెరికా ఆ నౌకను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో దఫా పాలనలో విదేశాంగ విధానం ద్వారా తన ఆకాంక్షలను తీర్చుకునే పనిలో పడ్డారు. రాత్రికి రాత్రి వెనెజువెలా పై కమాండో దాడి జరిపి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బందీలుగా అమెరికాకు తరలించి ట్రంప్ తన పంతం నెరవేర్చుకున్నారు. అంతటితో ఆగని ట్రంప్, దక్షిణ అమెరికా దేశాన్ని మొత్తం తానే నియంత్రిస్తున్నట్లు ప్రకటించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వెనెజువెలా తాత్కాలిక
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పోలుస్తూ జియోపాలిటిక్స్ నిపుణుడు ఇయాన్ బ్రెమ్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రెమ్మర్ ట్రంప్ తీసుకున్న వెనిజులా నిర్ణయాలు స్వల్పకాలిక లాభాలను ఇవ్వవచ్చని అంగీకరించినప్పటికీ, ట్రంప్ పదవీ విరమణ అనంతరం అవి కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ప్రతి నాలుగు సంవత్సరాలకు నాయకత్వం మారే నరపజాస్వామ్య వ్యవస్థ కారణంగా విధానాల్లో స్థిరత్వం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాలో తెలుగు యువతి నిఖిత గొడిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య అనంతరం ఇండియాకు పారిపోయి వచ్చిన అర్జున్ శర్మను ఇంటర్పోల్ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా మేరీల్యాండ్లోని ఎలికాట్ సిటీలో నిఖిత గొడిశాల(27)ను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ హత్య చేశాడు. ఏమీ తెలియనట్లుగా డిసెంబర్ 31 నుంచి నిఖిత కనిపించడం లేదని హోవర్డ్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై ఒక దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో ఉన్న ఈస్ట్ వాల్నట్ అనే జేడీ వాన్స్ ఇంటిపై దుండగుడు దాడి చేశాడు. అయితే, ఘటన సమయంలో ఆయన, కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. దుండగుడు లోపలికి ఎలా ప్రవేశించాడు అనే అంశం పోలీసుల్ని, భద్రతా సిబ్బందిని ఆశ్చర్యానికి గురి
జమ్మూకశ్మీర్ విషయంలో బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు. కశ్మీర్ను పాకిస్థాన్ (ఆక్రమించడాన్ని తాను గతంలోనూ వ్యతిరేకించానని, ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని అన్నారు. ఆర్టికల్ 370 రద్దును ఇప్పుడు కాకుండా, 1992లో కశ్మీరీ పండితుల వలసల కంటే ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తంచేశారు. జైపుర్లో జరిగిన హై టీ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ
అమెరికా వీసా ఇంటర్వ్యూలలో ఏర్పడిన తీవ్ర ఆలస్యాల కారణంగా భారత్లోనే చిక్కుకుపోయిన తమ హెచ్-1బి ఉద్యోగులకు అమెజాన్ సంస్థ ఊరటనిచ్చింది. వీసా సమస్యలతో మానసిక ఒత్తిడిలో ఉన్న సిబ్బందికి తాత్కాలిక వెసులుబాటు కల్పిస్తూ, మార్చి 2 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూ ఎఫ్ హెచ్) చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం వీసా ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులు ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందకుండా ఉండేందుకు తీసుకున్న
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ దేశ రక్షణ రంగంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేవలం ఆరు నెలల క్రితమే నియమితులైన రక్షణ మంత్రి డెనిస్ ష్మిగల్ను పదవి నుంచి తొలగించి, 34 ఏళ్ల యువ నేత మిఖైలో ఫెడోరోవ్కు ఆ కీలక బాధ్యతలు అప్పగించారు.
అమెరికా, వెనెజువెలా దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. తాజాగా భారీ పేలుళ్లతో వెనెజువెలా దద్దరిల్లింది. రాజధాని కరాకస్లో పేలుళ్లు సంభవించాయి. దాదాపు ఏడు చోట్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. అంతేకాదు, కరాకస్పై తక్కువ ఎత్తులో విమానాలు గర్జించాయి. ఈ శబ్దాలతో స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీధుల్లోకి పరుగులు తీశారు. నికోలస్ మడురో ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రముఖ బ్రిటిష్ ఇండియన్ నటి, రచయిత్రి, నాటకకర్త మీరా సియాల్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. 64 ఏళ్ల మీరా సియాల్కు ప్రతిష్ఠాత్మక డేమ్హుడ్ అవార్డు లభించింది. కొత్త సంవత్సరాది సందర్భంగా బ్రిటన్లో కింగ్ చార్లెస్-3 ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఆమె అందించిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. లండన్లో డిసెంబరు 30న అవార్డు గ్రహీతల జాబితాను
జర్మనీలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్లాడు.తాను నివసిస్తున్న భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హృతిక్ రెడ్డి భవనంలోనే ఉండగా, బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణాంతక గాయాలకు గురై మృతిచెందాడు.ఈ విషాద ఘటన వార్త తెలిశాక అతని
ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇండోపాక్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాము మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా ప్రకటించింది. చైనా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్తో కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదని స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మే 10న జరిగిన కాల్పుల విరమణ, రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్లు వచ్చిన వార్తలను భారత్తో సహా పలు దేశాలు ఖండించిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రధాని మోదీ చేసిన ఖండనను ఉక్రెయిన్ తప్పుపట్టింది. కొన్ని దేశాలు గందరగోళంగా, అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నాయ ని, పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడి ఘటనను ఖండిస్తున్నట్లు ఇండియా, యూఏఈ దేశాలు పేర్కొన్నాయని, వాస్తవానికి ఆ దాడి జరగలేదని ఆన్లైన్ మీడియా సమావేశంలో ఉక్రెయిన్
తెలంగాణ రాష్ట్రంలోని యాద్రాది జిల్లా చౌటుప్పల్ మండలానికి చెందిన గోశిక యశ్వంత్ కుమార్ (33) గుండెపోటుతో అమెరికాలోని డల్లాస్ లో మృతి చెందాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అతడు డల్లాస్ లో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. సోమవారం గుండెపోటుతో నిద్రలోనే తుది శ్వాస విడిచాడు. అతడి స్నేహితుల ద్వారా మృతుడి తల్లిదండ్రులకు సమాచారం తెలిసింది. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గోశిక వెంకటేశం, గాయత్రీ దంపతులకు నలుగురు కుమారులు. అందులో
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.