తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ ఈ మేరకు వెల్లడించారు. జయలలిత జయంతి సందర్భంగా రామనాథపురం సభలో కొత్త పార్టీని ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ త్వరలో తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. మాజీ సీఎం
మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ షాకిచ్చింది. ముంబైలోని అనిల్ అంబానీకి చెందిన రూ.3,716 కోట్ల ఖరీదైన ఇంటిని ఈడీ అటాచ్ చేసింది. ఈ భవంతిని అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) సంస్థ బ్యాంకు మోసాలకు (మనీ లాండరింగ్) పాల్పడిందనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా తాజాగా అనిల్ ఆస్తిని
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ త్వరలో కొత్తపార్టీ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త చెప్పబోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శశికళ అన్నారు. అందులో శుభవార్త చెప్పబోతున్నానని తెలిపారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ, కొత్త
బాలికల ఆరోగ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెర్వికల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ నివారణ కోసం ఉపయోగపడే హెచ్పీవీ వ్యాక్సిన్ను బాలికలకు ఉచితంగా అందజేయనుంది. 14 ఏళ్లు దాటిన బాలికలకు ఈ వ్యాక్సిన్ అందజేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. హెచ్పీవీ (హ్యూమన్ ప్యాపిలోమా వైరస్) టైప్ 16, 18, హెచ్పీవీ 6, 11 అనే నాలుగు రకాల సెర్వికల్ క్యాన్సర్ల నుంచి
కెనడా ప్రభుత్వం ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తహవ్వుర్ రాణా ప్రస్తుతం భారత్లో ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నాడు. కాగా 1997లో రాణా కెనడాకు వలస వెళ్లాడు. 2001లో ఇమిగ్రేషన్, రెఫ్యూజిస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా అతడికి
మాంసం విక్రయాలపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్, ఇతర విద్యాసంస్థలు, దేవాలయాల పరిసరాల్లో అన్నిరకాల మాంసం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల బిహార్ డిప్యూటీ సీఎం, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ విజయ్ కుమార్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. ఇకపై విద్యాసంస్థలు, దేవాలయాల పరిసరాల్లో మాంసం, చేపలు, గుడ్లు వంటివి అమ్మడానికి వీల్లేదు.ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ కుమార్ హెచ్చరించారు.
ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా దాడులు చేయవచ్చునన్న అంచనాలు, విద్యార్థుల ఆందోళనలతో ఆ దేశంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరులకు అక్కడి మన ఎంబసీ తాజాగా అడ్వయిజరీ జారీచేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఇరాన్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న భారత ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్లీ అడ్వైజరీ జారీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న
న్యూఢిల్లీ వేదికగా జరిగిన మెగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్ కు ఆమోదం తెలిపారు. భారత్ సహా 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు దీనికి మద్దతు తెలిపాయి. ఇది ప్రపంచ ఏకాభిప్రాయానికి నిదర్శనంగా నిలిచింది. ఆర్థికవృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఈ డిక్లరేషన్ ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తోంది. సర్వజన హితాయ,
పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కి ఊరట లభించింది. మహారాష్ట్ర లోని భివాండీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని 2014లో రాహుల్గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆరెస్సెస్ కేసు వేసింది.మహారాష్ట్రలోని భివాండీ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. విచారణకు రాహుల్గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా సవాలే. ప్రపంచంలోనే మేటి జట్టైన ఆసీస్ను భారత మహిళల జట్టు చిత్తుగా ఓడించింది. అడిలైడ్లో 17 పరుగులతో గెలిచి పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్లో స్మృతి మంధాన(82), జెమీమా రోడ్రిగ్స్(59)ల విధ్వసంతో ఆసీస్కు సవాల్ విసిరిన టీమిండియాకు ఆతిథ్య జట్టు బదులివ్వలేకపోయింది. అష్లే గార్డ్నర్ (57) అర్ద శతకంతో రాణించినా శ్రేయాంక పాటిల్(3-22) వికెట్ల వేటతో దెబ్బతీసింది. ఫలితంగా
ఓటర్ రోల్ క్లీన్-అప్ డ్రైవ్ విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పరసర్ప నిందారోణపలు చోటుచేసుకోవడం, ఎస్ఐఆర్ ప్రక్రియపై సంక్లిష్ట పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాల సవరణపై దురదృష్టకరమైన విమర్శల ఆట కొనసాగుతోందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు న్యాయాధికారులను నియమించాలని కోల్కతా హైకోర్టును ఆదేశించింది. ఎస్ఐఆర్లో అభ్యంతరాలు, వివాదాలను జ్యుడిషియల్ ఆఫీసర్లు పరిష్కరిస్తారని పేర్కొంది.
అమెరికాకు చెందిన ప్యాక్స్ సిలికా తో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్యాక్స్ లికా డిక్లరేషన్పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో రెండు దేశాలు ఈ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ప్రతినిధి సెర్గియో గోర్ సమక్షంలో ఈ డిక్లరేషన్పై సంతకం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవహారాల మంత్రి జాకబ్ హెల్బర్గ్ కూడా పాల్గొన్నారు.
కృత్రిమ మేధ ఇప్పుడు శరవేగంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియను ఆర్థికంగా ముందుకు సాగుతున్న దేశాలు సద్వినియోగం చేసుకోవచ్చునని గుగూల్ సిఇఒ సుందర్ పిచాయ్ తెలిపారు. ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. ఏఐ హైపర్ ప్రోగ్రెస్ను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలననేది మన చేతుల్లోనే ఉందన్నారు. డిజిటల్ డివైడ్, ఏఐ డివైడ్లతో ప్రపంచ సార్వత్రిక ప్రగతి కుంటుపడుతుందన్నారు. ఏఐ రాకతో అనివార్యంగా వర్క్ఫోర్స్ మార్పులు జరుగుతాయి. కొన్ని
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్కృతిని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఉచిత స్కీమ్లతో ఆర్థిక వృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తాజాగా తమిళనాడులోని విద్యుత్తు బోర్డు ఉచిత విద్యుత్తు ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ అంశాన్ని
టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 చేరుకొని జింబాబ్వే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టైటిల్ ఫేవరేట్ జట్టు ఆసీస్ను ఇంటికి సాగనంపి రికార్డు నమోదు చేసింది. తాజాగా కొలంబో వేదికగా జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్లో ఆతిథ్య జట్టు శ్రీలంకను కూడా ఓడించింది. మూడు బంతులు ఉండగానే 6 వికెట్ల తేడాతో మెగా టోర్నీలో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 20 ఓవర్లకు గాను
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అభినందించారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, నామా నాగేశ్వరరావు ఆయనను కలిశారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. మేక్రాన్, ప్రధాని మోదీ మధ్య చర్చల అనంతరం అనేక అంశాల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం ఫ్రాన్స్లో చదివేందుకు భారతీయ విద్యార్థులకు అవకాశాలు మెరుగవ్వనున్నాయి. 2030 నాటికి అక్కడ భారతీయ విద్యార్థుల సంఖ్య 30,000కు పెంచాలని నిర్ణయించారు. ఇప్పుడు అక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 10,000గా ఉంది.అంటే రాబోయే నాలుగేళ్లలో మరో
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాను భారత్కు తిరిగిరాలేనని బాంబే హైకోర్టు కు తెలియజేశారు. తాను బ్రిటన్ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందువల్ల తాను భారత్కు ఎప్పుడు తిరిగి వస్తాననేది కచ్చితంగా చెప్పలేనని మాల్యా పేర్కొన్నారు. ఈ మేరకు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ బాంబే కోర్టులో ఒక స్టేట్మెంట్ను సబ్మిట్ చేశారు. మాల్యా దగ్గర యాక్టివ్ ఇండియన్ పాస్పోర్టు లేదని, అదేవిధంగా
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ
కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేస్తున్న సుమారు 20,000మంది ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించనున్నట్లు బుధవారం ప్రకటించింది. రెండు వారాల్లోగా ప్రతిపాదనలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. క్రమబద్ధీకరణపై తుది తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్కుట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం రిజర్వేషన్ల అమలు, ఉపాధ్యాయుల నియామకాలను ఆమోదించడం
టీ20 వరల్డ్కప్ గ్రూప్ డీ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. దీంతో తమ గ్రూపులోని అన్ని మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా విక్టరీ నమోదు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 122 రన్స్ చేసింది. టాపార్డర్లో అలీషాన్ షారఫూ అత్యధికంగా 45 రన్స్ చేశాడు. అయితే ఆ టార్గెట్ను కేవలం 13.2 ఓవర్లలో సఫారీలు అందుకున్నారు. దక్షిణాఫ్రికా
కృత్రిమ మేధస్సు (ఏఐ)లో సరికొత్త సంచలనం, అమెరికాకు చెందిన కంపెనీ ఆంథ్రోపిక్తో, భారతీయ ఐటీ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ జట్టు కట్టింది. టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి తదితర కంపెనీల కోసం అత్యాధునిక సంస్థాగత ఏఐ సొల్యూషన్స్ను అందుబాటులోకి తేవడం, అభివృద్ధిపర్చడానికి ఆంథ్రోపిక్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మంగళవారం ఇన్ఫోసిస్ ప్రకటించింది. ముందుగా టెలికాం రం గంలో ఆంథ్రోపిక్ సహకారాన్ని ఇన్ఫోసిస్ తీసుకోనున్నది. ఈ మేరకు
తమిళ నటి త్రిషా వార్నింగ్తో పాటు, విమర్శల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ దిగివచ్చారు. త్రిషాపై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణలు చెప్పారు. పోరపాటు వల్ల తాను అలా అన్నట్లు వివరణ ఇచ్చారు. ఇది పొరపాటున చేసిన ప్రకటన. అఖిల భారత మహిళా విభాగం చీఫ్ వానతి శ్రీనివాసన్, అన్నామలై ఈ విషయం గురించి నాతో మాట్లాడారు. నా ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి
కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాత 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. ఐదుగురికి ప్రాణం పోసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ చిన్నారికి ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక కార్యక్రమానికి వందలాది మంది హాజరై నివాళులర్పించారు. పథనంతిట్ట జిల్లాలోని ఓ చర్చిలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. దుఃఖాన్ని దిగమింగుతూ
టీ20 వరల్డ్కప్లో ఇటలీతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 24 రన్స్ తేడాతో నెగ్గింది. దీంతో ఆ జట్టు గ్రూపు సీ నుంచి సూపర్ 8లోకి వెళ్లింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 202 రన్స్ స్కోరు చేసింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఇటలీ 178 రన్స్ చేసి ఆలౌటైంది. ఇటలీ ప్లేయర్ బెన్ మానెంటి 25 బంతుల్లో 60 రన్స్ చేసి కాసేపు దడపుట్టించాడు. అతని
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్వాటర్ టన్నెల్ నిర్మిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 18, 600 కోట్లతో వస్తున్న ఈ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేసింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది అడుగున ఆధునిక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ప్రతిష్ఠాత్మక ప్రణాళికకు ఈ ప్రాజెక్టుతో బీజం పడింది. నది కిందుగా రోడ్డు-రైలు మార్గాలను కలిపే దేశపు తొలి అండర్వాటర్ సొరంగం
స్కాట్లాండ్ టీంపై ఇంగ్లాండ్ జట్టు తడబడి నిలబడి గెలిచింది. 18.2 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విక్టరీ సాధించింది. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లకు గాను 152 రన్స్ చేసి ఆలౌటైంది. స్కాట్లాండ్ బ్యాటర్లు ఎంఏ జోన్స్ 33, బెరింగ్టన్ 49 పరుగులు చేశారు. బ్రిటన్ బౌలర్లు రషీద్ 3 ఆర్చర్, డాసన్
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకింగ్ పెరిగింది. అంటే మన పాస్పోర్ట్ విలువ పెరిగింది. అయినా, ఇండియాకు ఫ్రీ వీసా ఇచ్చే దేశాల సంఖ్య తగ్గింది. తాజాగా రెండు దేశాలు ఇండియన్స్కు ఇప్పటిదాకా ఉన్న ఫ్రీ వీసా సౌకర్యాన్ని ఇటీవల రద్దు చేశాయి. ఇరాన్, బొలీవియా దేశాలు ఇండియాకు ఫ్రీ వీసా సౌకర్యాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మన పాస్పోర్ట్ 75వ స్తానంలో
టీ20 వలర్డ్కప్ లో సంచలన నమోదు అయ్యింది. కొలంబోలో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 23 రన్స్ తేడాతో జింబాంబే విక్టరీ కొట్టింది. జింబాబ్వే క్రికెటర్లు అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 169 రన్స్ చేసింది. జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ అత్యధికంగా 64 రన్స్ స్కోరు చేశాడు. అతని ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు ఉన్నాయి. జింబాబ్వే బ్యాటర్లలో మరుమని
దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్నదని పేర్కొన్నది. ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ జైషే మహ్మద్ తదితర ఉగ్ర ముఠాలు దక్షిణాసియాలో క్రియాశీలంగా నేర కార్యకలాపా లు సాగిస్తున్నాయని తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి సమర్పించిన నివేదికలో
భారత వాయుసేనకు మరింత బలం చేకూరేలా కేంద్రం అడుగు వేస్తోంది. ఈ మేరకు రఫేల్ యుద్ధ జెట్లకు కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ విమానాలను కేంద్రం కొనుగోలు చేయనుంది. భారత రక్షణ చరిత్రలోనే అతి పెద్ద ఒప్పందాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఈ ఒప్పందాన్ని ఆమోదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం దొంగతనం కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది. బంగారం చోరీ కేసులు రోజు రొజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. శబరిమల ఆలయంలోని విలువైన కళాఖండాల నుండి బంగారం దొంగిలించబడిందనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో, కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న దర్యాప్తులో ఆలయ ఉద్యోగుల ఖాతాల్లో అనుమానాస్పద నగదు లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి.
టీ20 వలర్డ్కప్లో రెండో విక్టరీ నమోదు చేసింది శ్రీలంక. ఒమన్తో జరిగిన మ్యాచ్లో 105 రన్స్ తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. గ్రూప్ బీలో భాగంగా జరిగిన మ్యాచ్లో తొలుత శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 రన్స్ చేసింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఒమన్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 120 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఒమన్ బ్యాటర్లలో నదీమ్ 53, వాసిమ్
ప్రపంచవ్యాప్తంగా పాస్పోర్ట్ శక్తిని అంచనా వేసే ప్రతిష్టాత్మక నివేదిక హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 విడుదలైంది. ఈ నివేదికలో భారత పాస్పోర్ట్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి 75వ స్థానానికి చేరుకుంది, అంటే ఒకే ఏడాదిలో 10 స్థానాలు పైకి ఎగబాకింది. ప్రస్తుతం భారత పాస్పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా లేకుండా లేదా అక్కడికి వెళ్ళాక వీసా తీసుకునే
అమెరికా సర్కారుకు భారత ప్రభుత్వం తలొగ్గిందని ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు చేసేలా ఉందని, దానివల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కేంద్రబడ్జెట్ పై చర్చ సందర్భంగా రాహుల్గాంధీ లోక్సభ లో మాట్లాడారు. తన ప్రసంగంలో వాణిజ్య ఒప్పందంతోపాటు ఏఐ ప్రభావం వంటి అంశాల గురించి ప్రస్తావించారని చెప్పారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను బడ్జెట్ ఏమాత్రం ప్రతిబింబించలేదని అన్నారు.
ముంబై మేయర్ పీఠం విషయంలో కొనసాగిన సస్పెన్స్కు తెరపడింది. ముంబై నగరం (బృహన్ ముంబై కార్పొరేషన్) మేయర్గా బీజేపీకి చెందిన రితూ తావ్డే, డిప్యూటీ మేయర్గా శివసేన (షిండే) వర్గానికి చెందిన సంజయ్ ఘాడీ ఎన్నికయ్యారు. బుధవారం ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, ఏకగ్రీవంగా ఇద్దరినీ ఎన్నుకున్నారు. దీంతో 25 ఏళ్లపాటు థాక్రే ఆధ్వర్యంలోని శివసేన చేతిలో ఉన్న ముంబై మేయర్ పదవి ఇప్పుడు బీజేపీ పరమైంది. రితూ తావ్డే
టీ20 వరల్డ్ కప్లో సంచలనం నమోదైంది. ఏకంగా రెండు సూపర్ ఓవర్లు నిర్వహించారు. గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియం వేదికగా దక్షణాఫ్రికా వర్సెస్ ఆప్ఘానిస్థాన్ టీం మధ్య ఆట రసవత్తరంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. డికాక్(59), రిక్లల్ టన్ (61) అర్ధ సెంచరీలతో మెరువగా, బ్రేవీస్ 23, మిల్లర్ 20 పరుగులతో రాణించారు. అప్ఘాన్ బౌలర్లు
ప్రతిపక్ష పార్టీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాయని, పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలను చూసి దేశం సిగ్గుపడుతోందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్సభ లో రాహుల్ గాంధీ ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ప్రచురితం కాని పుస్తకంలోని అంశాలను చట్టవిరుద్ధంగా ప్రస్తావించారని కంగనా ఆరోపించారు. రాహుల్ గాంధీ నిన్న ఒక అనధికారిక, చట్టవిరుద్ధమైన
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష ఎంపీలకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. 8 మంది ఎంపీల సస్పెన్షన్ను కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, చీఫ్ విప్ కే సురేశ్, లోక్సభ సెక్రటేరియేట్కు తమ నోటీసును అందజేశారు. కాంగ్రెస్, సమాజ్వాదీ, డీఎంకే పార్టీల తరపున ఆ నోటీసును
మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన పుస్తకం అంశంలో భయపడడం వల్లే ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభకు రావడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ఆ తీర్మారాన్ని సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఎంపీల వల్ల ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఎవరైనా మోదిని బెదిరిస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్
జపాన్ రాజకీయాల్లో ఓ మహిళ చరిత్ర సృష్టించింది. 2025 అక్టోబర్లోనే ఆ దేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి సనాయే తకైచి బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలం ప్రారంభమైన కొద్ది నెలలకే ఆమె ఖాతాలో మరో విజయం వేసుకుంది. 2026 ఫిబ్రవరి 8న జపాన్లో జరిగిన స్నాప్ ఎన్నికల్లో ఆమె లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. లోయర్ హౌస్లో సూపర్ మెజారిటీ సాధించింది. మొత్తం 465 సీట్లున్న హౌస్
చైనా నేలపై భారత జాతీయ గీతం మారుమోగింది. చైనాలోని టియాంజిన్ వేదికగా జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ అద్భుత ప్రతిభ కనబరిచి పురుషుల హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. మొత్తం ఏడు ఈవెంట్లతో కూడిన ఈ పోటీలో తేజస్విన్ స్థిరమైన ప్రదర్శనతో 5993 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మెడల్ ప్రదానోత్సవ సమయంలో భారత జాతీయ గీతం జనగణమన వినిపించడంతో
పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఆంటోనియో జోస్ సెగురో అఖండ విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తంగా 95.37 శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిని లెక్కించినప్పుడు సోషలిస్టు పార్టీ (పిఎస్)కి చెందిన అధ్యక్ష అభ్యర్థి సెగురోకు 66.14 శాతం ఓట్లు రాగా, మితవాద చేగా పార్టీకి చెందిన వెంచురాకు 33.86 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం ఆంటోనియో అధ్యక్షుడిగా భారీ మెజార్జీతో ఎన్నికయ్యారు. ఈ
ఇటీవల ముంబాయి కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన అధిక స్థానాల్లో గెలుపొందాయి. బీఎంసీ మేయర్ ఎన్నికపై బీజేపీ-శివసేన పోటీబడ్డాయి. ఎట్టకేలకు ఇరు పార్టీలు రాజీ పడి అభ్యర్థి ఎన్నికను ఖరారు చేశాయి. బీజేపీ కార్పొరేటర్ల కీలక సమావేశం అనంతరం, మేయర్ అభ్యర్థిగా సీనియర్ నేత రీతూ తావ్డే పేరును ప్రకటించారు. అదేవిధంగా, డిప్యూటీ మేయర్ పదవికి ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి సంజయ్ శంకర్
ప్రధాని నరేంద్ర మోదీ మలేసియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు ఆయన మలేసియాలో ఉంటారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో మోదీ మలేసియా చేరుకున్నారు. ఆయనకు ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఘన స్వాగతం పలికారు. రాజధాని కౌలాలంపూర్లో చిన్నారులు రెండు దేశాల జాతీయ పతాకాలు చేతపట్టుకోగా, మలేసియా ప్రధానితోపాటు ఇరు దేశాల ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఒకే కారులో మోదీ, అన్వర్ హోటల్కు చేరుకున్నారు. ప్రధాని హోదాలో
టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ తొలి విజయం నమోదు చేసింది. నెదర్లాండ్ పై మూడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. శ్రీలంక వేదికగా నెదర్లాండ్, పాకిస్థాన్ జట్లు మెగా టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ ఆడాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 20 ఓవర్లకు గాను 10 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఎడ్వార్స్ 37, లీడే 30, లీవేట్ 24, ఆక్రామనన్ 20 రన్స్ రాణించారు. పాక్
పరీక్షలు పండుగల లాంటివని, వాటిని భారంగా భావించవద్దని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీలోని తన నివాసానికి వచ్చిన విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. కేవలం మార్కులపైన మాత్రమే దృష్టిపెట్టి చదవద్దని, జీవితాన్ని మెరుగుపర్చుకో వడం కోసం చదవాలని సూచించారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో బోర్డు పరీక్షలకు ముందు ప్రధాని మోదీ వారితో ఇంటరాక్ట్ అయ్యారు. పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో ఆయన
భారత్లో పేద బస్తీల్లో గోడలనే తరగతి గదులుగా మార్చిన రూబుల్ నాగి గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్నారు.దుబాయ్లో నిర్వహించిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ వేదికగా పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డుతోపాటు మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.9 కోట్లు) నగదు ఆమెకు బహుమతిగా దక్కింది.సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా ఆమె చేసిన సేవలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. రూబుల్ నాగి తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా దేశంలోని వెనుకబడిన వర్గాల పిల్లల
పురుషుల అండర్-19 వన్డే వరల్డ్కప్లో భారత కుర్రాళ్లు టైటిల్ పట్టేశారు. తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన భారత జట్టుకు ఆరో టైటిల్ కట్టబెట్టారు. ఇంగ్లండ్తో ఫైనల్లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(175) విధ్వంసక శతకంతో విరుచుకుపడగా, బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. అంబ్రిష్(3-56) విజృంభించగా100 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. 174కే ఏడు వికెట్లు పడినా, టెయిలెండర్ ఫాల్క్నర్(115) వీరోచిత సెంచరీ బాదినా సరిపోలేదు. కనిష్క్ ఓవర్లో ఖిలాన్ పటేల్ డైవింగ్ క్యాచ్
భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్లో ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్ష్యాలు అన్నిటినీ మిసైల్ అందుకుందని రక్షణ శాఖ తెలిపింది. ఈ పరీక్షతో భారత దళాల సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత మరింత పెరిగిందని పేర్కొంది. అగ్నీ సిరీస్కు సంబంధించి భారత్ వద్ద
దేశవ్యాప్తంగా యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై హాట్ టాపిక్ నడుస్తోంది. అమెరికాతో భారత్ చేసుకున్న ఒప్పందంపై స్పష్టత కావాలని, పార్లమెంట్ లో సదరు ఒప్పందంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంతో పలుమార్లు లోక్ సభ కూడా వాయిదా పడుతుంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ కీలక ప్రకటన చేశారు. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై ఇరుదేశాల నుంచి సంయుక్త ప్రకటన వెలువడుతుందని
అబుదాబి వేదికగా నిర్వహించే బిగ్టికెట్ లాటరీలో కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాకు చెందిన 33 ఏళ్ల శాంతను శెట్టిగార్కు బంపర్ ఆఫర్ తగిలింది. లక్కీడ్రాలో 20 మిలియన్ల దిర్హామ్లు గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.49 కోట్లు. ఈ విషయం తెలియడంతో కర్ణాటకలోని అతని సొంత గ్రామంలో సెలబ్రేషన్లు మొదలయ్యాయి.
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగంతో ఆకట్టుకున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. వివిధ రంగాలకు చెందిన వారు తమ ప్రజల తరఫున మాట్లాడేందుకు ఈ సభలోకి ప్రవేశించడానికి అనేక
మణిపుర్ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామాలపై, కొత్త ముఖ్యమంత్రిగా యుమ్నం ఖేంచంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. మణిపుర్ రాష్ట్రంలో నెలకొన్న సుదీర్ఘ రాజకీయ అనిశ్చితికి తెరపడింది. రాష్ట్రపతి పాలన ముగియడంతో, భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు యుమ్నం ఖేంచంద్ సింగ్ మణిపుర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, పరిపాలనాపరమైన ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల అధికారిక పర్యటనకు మలేసియా వెళ్తున్నారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 7,8 తేదీలో మలేసియాలో పర్యటించనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. మలేసియాలో మోదీ పర్యటించనుండటం ఇది మూడోసారి. అయితే 2024 ఆగస్టులో ఇరుదేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను కుదుర్చుకున్న తరువాత మలేసియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే ప్రధాన లక్ష్యంగా మోదీ
అండర్ 19 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్పై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ ఘన విజయం నమోదు చేసింది. అరోన్ జార్జి సెంచరీతో చెలరేగగా, వైభవ్ సూర్యవంశీ దూకుడైన అర్ధసెంచరీతో భారీ విజయ లక్ష్యాన్ని ఇండియా సునాయాసంగా చేధించింది. హరారే వేదికగా జరిగిన మ్యాచులో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఆఫ్ఘన్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి పదవికి యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ ఎంపికయ్యారు. బీజేపీ నాయకుడైన ఆయన బీరెన్ సింగ్ వారసుడిగా, ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. త్వరలోనే మణిపూర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మణిపూర్ లోని ప్రధానమైన మీటీస్, కుకిస్ తెగల మధ్య నిరుడు విభేదాలు తారా స్థాయికి చేరడంతో ముఖ్యమంత్రిగా నేను
అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో రిపోర్టర్లతో రాహుల్ మాట్లాడారు. ప్రధాని మోదీ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ వత్తిడికి మోదీ తలొగ్గినట్లు ఆరోపించారు. ఎప్స్టీన్ ఫైల్స్ కేసు వల్ల ప్రధాని మోదీ తీవ్ర వత్తిడిలో ఉన్నట్లు ఆరోపించారు. అదానీపై అమెరికాలో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మోదీ ఆందోళనలో ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. మోదీజీ భయపడుతున్నా రని,
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం రైతుల నుంచి మత్స్యకారుల వరకూ దేశంలోని 140 కోట్ల మందికి ప్రయోజనకారిగా ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీంతో ఈ ట్రేడ్ డీల్కు సంబంధించిన కొన్ని వివరాలను మీడియాతో పీయూష్ గోయల్ మాట్లాడారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, ఆ విషయాన్ని ప్రధానమంత్రి మోదీ ధ్రువీకరించడం అనేక
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్న్యూస్ చెప్పారు. భారత స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం కల్పించారు. పార్లమెంటు లో నాడు కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ మౌలిక వసతుల కోసం రూ.12.2లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వైద్య అనుబంధ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. లక్ష ఏహెచ్పీలను ఏర్పాటు చేయబోతున్నట్లు
భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడుతోందనే మాటలు తాను చెప్పినవి కావని, స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసినవేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. లోక్సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం బయటకు వస్తే మన సైన్యాన్ని ప్రభుత్వ నేతలు ఎలా నిరాశపరుస్తున్నర నేది ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు. మాజీ ఆర్మీ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. ఆమె మేనల్లుడు రద్వాన్ ముజిబ్ సిద్దిక్, మేనకోడళ్లు తులిప్ రిజ్వానా సిద్దిక్, అజ్మినా సిద్దిక్లకు కూడా రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో శిక్ష పడింది. రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్టుకు సంబంధం ఉన్న ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో అవినీతి జరిగినట్లు షేక్ హసీనాతో పాటు ఆమె బంధువులపై ఎఫ్ఐఆర్
టీ20 వరల్డ్కప్లో భారత జట్టుతో మ్యాచ్ బాయ్కాట్ చేయాలని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారం రేపుతోంది. ఎంపిక పద్ధతిన మెగా టోర్నీలో పాక్ జట్టు ఆడాలనుకోవడాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి తప్పు పడుతోంది. పాక్ ప్రభుత్వం, ఆ దేశ బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించింది.
విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని లోక్ భవన్లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తొలి మహిళగా సునేత్ర పవార్ నిలిచారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అజిత్ దాదా అమర్ రహే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం తో బీజేపీ పొత్తు అవకాశాలు, రాజకీయాల్లో విజయ్ ప్రభావం ఏమేరకు ఉండనుందనే అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ టీవీకేతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని చెప్పారు. విజయ్ కేవలం ఓట్లు చీల్చే వ్యక్తిగా మిగిలిపోతారని, కింగ్ మాత్రం కాలేరని అన్నారు. గతంలోనూ చాలా మంది సినీనటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టారని, అయితే ఎలాంటి
ఎలినా రిబకినా సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళ సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నది.ఫైనల్ మ్యాచ్లో వరల్డ్ నెంబర్ వన్ అరినా సబలెంకను ఓడించి తొలి గ్రాండ్స్లామ్ ట్రోఫీని అందుకున్నది. రసవత్తరంగా సాగిన మ్యాచ్లో, రిబకినా మూడవ సెట్లో అనూహ్య రీతిలో సత్తా చాటింది. కజకిస్తాన్ అయిదో సీడ్ ప్లేయర్ రిబకినా మూడవ సెట్లో ఓ దశలో 3-0 తేడాతో వెనుకబడి ఉన్నది. కానీ ఆ తర్వాత కోలుకున్న ఆమె
బారామతిలో విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితర రాజకీయ ప్రముఖులు ఈ అంతక్రియల్లో పాల్గొన్నారు. అజిత్ పవార్ను కడసారి చూసేందుకు ఆయన వర్గం
మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. పుణె జిల్లాలోని బారామతిలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో అజిత్ తుదిశ్వాస విడిచినట్లు పీటీఐ తెలిపింది. ఈ విమానం బుధవారం ఉదయం ముంబై నుంచి బయలుదేరింది. సుమారు గంట ప్రయాణం తర్వాత, 9 గంటల సమయంలో బారామతి ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి కుప్పకూలిపోయింది. స్థానిక సంస్థల
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఘొక విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. సహచరులతో కలిసి ప్రచారానికి బయలుదేరిన ఆయన బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.ఈ ఘోర విషాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మహాయుతి నుండి దూరం జరిగేందుకు యోచిస్తున్నారని, శరద్పవార్తో కలవడానికి ప్రయత్నిస్తున్నారని తన
ఐక్యరాజ్యసమితి లో పాకిస్థాన్ వైఖరిని భారత్ మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ పై ఆ దేశ రాయబారి చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని మండిపడింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఘాటుగా స్పందించారు. అంతర్జాతీయ వేదికల్లో పాకిస్థాన్ ప్రతిసారీ భారత్కు, దేశ ప్రజలకు హాని కలిగించడమే అజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా పహల్గాంలో
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము భారతదేశపు అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక చక్రను ప్రదానం చేశారు. దేశ రాజధానిలో కర్తవ్య పథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి శుక్లాకు ఈ అవార్డును అందజేశారు. అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఆక్సియం స్పేస్ అమలు చేసిన ఆక్సియం -4 మిషన్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్ఎ)
దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కర్తవ్యపథ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథులుగా యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లెయెన్, యూరోపియన్ యూనియర్ కౌన్సిల్ ప్రసిడెంట్ ఆంటోనియో కోస్టా హాజరయ్యారు. గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈనెల 27న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు సంప్రదాయం ప్రకారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 27వ తేదీన పార్లమెంట్లోని మెయిన్ కమిటీ రూమ్లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చేపట్టనున్న లెజిస్లేటివ్, ఇతర అంశాలపై
గతేడాది అహ్మదాబాద్లో భయంకర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిరిండియాకు రూ.1,100 కోట్ల బీమా సొమ్ము తాజాగా లభించింది. విమానం పూర్తిగా ధ్వంసం కావడంతో రీ-ఇన్సూరర్లు, బీమా సంస్థలు 125
కేరళలోని కోజికోడ్లో జరుగుతున్న సాహిత్య ఉత్సవం ఒక అపురూప ఘట్టానికి వేదికైంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ను దిగ్గజ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ప్రస్తుతం కేరళలో లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుండగా, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చింది సునీత విలియమ్స్. ఈ సమావేశంలో సునీత మాట్లాడుతూ అంతరిక్ష అనుభవాలు గురించి తెలిపారు. అంతేకాక తన భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు.
దేశ వ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమైంది. రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగణనలోనే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన ప్రారంభం కానుంది. తొలిదశలో గృహ గణన కోసం కేంద్ర హోం శాఖ ప్రశ్నావళిని రూపొందించింది. 33 ప్రశ్నలతో మోదీ సర్కార్ గెజిట్ విడుదల చేసింది. ఇంటి వివరాలతో పాటు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు,
భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నయా చరిత్ర సృష్టించింది. ఇండోనేసియా సూపర్ 500 మాస్టర్స్ టోర్నమెంట్లో సింధు క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఈ క్రమంలో తన కెరీర్లో రికార్డు స్థాయిలో 500వ విజయాన్ని అందుకుంది. ఓ భారత షట్లర్ 500 విజయాల మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్గా సింధు చరిత్ర సృష్టించింది. ఓవరాల్గా 500వ విజయం సాధించిన ఆరో
భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(60) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి వీడ్కోలు పలికారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 25వ తేదీ నుంచే ఇది అమలులోకి వచ్చిందని నాసా పేర్కొంది. మానవ అంతరిక్ష ప్రయాణంలో సునీతా విలియమ్స్ మార్గదర్శకురాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆమె చూపిన నాయకత్వం, టెక్నాలజీ అభివృద్ధికి చేసిన
బంగ్లాదేశ్ లో ఆందోళనకర పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఇండియాపై అక్కడివాళ్లు ద్వేషంతో రగిలిపోతున్నారు. మరోవైపు హిందువులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి.హిందువుల్ని చంపడం, దాడి చేయడం, వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం వంటి ఘటనలు బంగ్లాదేశ్ లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్తితుల్లో ఇప్పటికే ఇరు దేశాల సంబంధాలు క్షీణించినట్లు కనిపిస్తోంది. అక్కడ ఉన్న హిందువులతోపాటు భారతీయ అధికారులకు కూడా రక్షణ లేదనే నిర్ణయానికి ఇండియా వచ్చేసింది.
దాయాది దేశం పాకిస్తాన్, భారత సరిహద్దులో కాల్పులకు పాల్పడింది. పాక్ దళాలు, భారత సరిహద్దుపైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాయి. వెంటనే అప్రమత్తమైన భారత దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో పాక్ తోక ముడిచింది. ఈ ఘటన కాశ్మీర్ ప్రాంతం, కుప్వారా జిల్లా, కేరన్ సెక్టార్లో జరిగింది. ఈ సరిహద్దు ప్రాంతంలో భద్రతను మరింత పెంచేందుకు 6 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన సిబ్బంది రాత్రిపూట హై టెక్నాలజీ
కర్నాటక పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి కే రామచంద్రరావు పై వేటు పడింది. అసభ్యకరమైన వీడియోలు వైరల్ కావడంతో కర్నాటక సర్కారు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. డీజీపీ స్థాయి ర్యాంక్ కలిగిన ఆ పోలీసు ఆఫీసర్ మహిళలతో తన ఛాంబర్లోనే రాసలీలలు ఆడాడు. ఆ ఘటనకు చెందిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కర్నాటక రాష్ట్రంలో ఆ అంశం తీవ్ర చర్చకు దారితీసింది.
భారత మహిళల బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేశారు. బ్యాడ్మింటన్ ఆటకు వీడ్కోలు పలికారు. మహిళల బ్యాడ్మింటన్కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా, తాను ఇక ఆడలేనని తెలిపారు. నేను రెండేళ్ల కిందటే ఆడటం ఆపేశాను. ఎంతో ఇష్టంతో నా అంతట నేను ఆటలోకి వచ్చా. ఇప్పుడు నా అంతట నేను నిష్క్రమిస్తున్నా. ఇంకెంతమాత్రం ఆడగలిగే సామర్థ్యం లేనప్పుడు కథ ముగిసినట్లే. ఇది
భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నియ్యారు. అధికారికంగా ఆయన పేరును బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ కే లక్ష్మణ్ చేతుల మీదుగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సర్టిఫికేట్ను నితిన్ అందుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా నితిన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు
కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండలఉమకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశారు. తాజాగా ఆలయాన్ని మూసివేసినప్పటికీ, నెలవారీ
దేశ విభజన హృదయవిదారకరమైందని, దాని గురించి పిల్లలకు చెప్పాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దు అని సుధా మూర్తి అన్నారు. ద మ్యాజిక్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ రింగ్స్ పుస్తకాన్ని ఆమె తాజాగా రాశారు. ఆ బుక్లో దేశ విభజన గురించి ఆమె లోతుగా విశ్లేషించారు. జైపూర్లో జరుగుతున్న సాహిత్య సంబరాల్లో పాల్గొని ఆమె మాట్లాడారు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కుమార్తె, సుధా మూర్తి
టెన్నిస్ దిగ్గజం స్టార్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ చరిత్ర సృష్టించనున్నది. 45 ఏళ్ల వయసులో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడనున్నది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఆ వయసులో గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆడుతున్న తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందనున్నది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ డ్రాలో 45 ఏళ్ల వయసున్న ప్లేయర్లు ఎవరూ ఇప్పటి వరకు ఆడలేదు. అయిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడే
పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఈనెల 20న ప్రకటించనున్నట్టు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. ఇందుకోసం షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఆ ప్రకారం జనవరి 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య నామినేష్ల దాఖలు ఉంటుందని బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ తెలిపారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. నామినేషన్ల
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటీషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. జడ్జీస్ యాక్టు ప్రకారం జస్టిస్ యశ్వంత్పై అభిశంసన చేయాలని ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు కోసం లోక్సభ స్పీకర్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో జస్టిస్ యశ్వంత్ పిటీషన్ దాఖలు చేశారు. జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీష్ చంద్ర
ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది. ఈ మేరకు ఇండియాలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటన చేశారు. ఆయన ఇండియాలో అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్
ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని సబర్మతి నదీతీరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్తో కలిసి ప్రారంభించారు. ఈ వేడుకలో రెండు దేశాల నాయకులు క్రీయాత్మకంగా పాల్గొని కైట్ ఎగరించడం ద్వారా ఫెస్టివల్ ప్రారంభాన్ని ఘనంగా ప్రకటించారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, ఫ్రెడ్రిక్ మెర్జ్తో కలిసి క్రీయాశీలతలో పాల్గొని, పర్యాటకులు, స్థానికులు, బాలికలు, బాలురు మరియు ఫోటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించారు. సబర్మతి నదీతీరంలో
బ్రిటీష్ యూనివర్సిటీల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరిగిపోతోంది. చాలా మంది ముస్లింలు ఈ అతివాద ప్రభావానికి గురవుతున్నారు. దీంతో తమ దేశానికి చెందిన ముస్లిం విద్యార్థులకు యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కీలక హెచ్చరిక జారీ చేసింది. బ్రిటన్ యూనివర్సిటీల్లో చదువుతున్న తమ దేశానికి చెందిన విద్యార్థులు ఇస్లాం రాడికలైజేషన్ కు గురై, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొ్ంటే ప్రభుత్వం అందించే స్కాలర్ షిప్ లు ఆపేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే గత జూన్
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది. బెంగళూరు – కడప – విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు గిన్నిస్ రికార్డులను దక్కించుకుంది. నేషనల్ హైవే అథార్టీ, కాంట్రాక్ట్ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఒకే హైవే స్ట్రెచ్పై ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించి రికార్డు నెలకొల్పాయి. ఈ అసాధారణ ఇంజినీరింగ్ ప్రతిభను
దేశంలో అత్యంత కీలకమైన 2027 జనాభా లెక్కల ప్ర క్రియ తొలి దశ ఖరారు అయింది. ఇందులో భాగంగా ముందుగా ఇళ్ల లెక్కలు, ఇళ్ల జాబితాల సేకరణ ప్రక్రియ (హౌస్ లిస్టింగ్ ) జ రుగుతుంది. దీనిని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ చేపడుతారని ప్రభుత్వం అదికారిక ప్రకటనలో తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ని ర్ణీత గడువు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ కు గట్టి హెచ్చరిక చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో న్యూఢిల్లీ సహకరించకపోతే, భారతదేశం నుంచి జరిగే దిగుమతులపై అదనపు సుంకాలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకాలను పెంచే అంశంపై కూడా అమెరికా వెనుకాడని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ సర్కారు గత సంవత్సరం భారత వస్తువులపై సుంకాలను 50శాతానికి పెంచిన సంగతి
అమెరికాలోని మేరీల్యాండ్లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హోవర్డ్ కౌంటీలోని ఎలికాట్ సిటీకి చెందిన తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నివాసంలోనే నిఖితా రావు గొడిశాల (27) అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించింది. కత్తిపోట్లతో అతని అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. అయితే అంతకుముందే అమె మాజీ బాయ్ఫ్రెండ్ దేశం విడిచి పారిపోయాడు. దానికంటే ముందు నిఖిత కనిపించడం లేదని అతనే పోలీసులకు ఫిర్యాదు
జమ్మూకశ్మీర్ విషయంలో బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు. కశ్మీర్ను పాకిస్థాన్ (ఆక్రమించడాన్ని తాను గతంలోనూ వ్యతిరేకించానని, ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని అన్నారు. ఆర్టికల్ 370 రద్దును ఇప్పుడు కాకుండా, 1992లో కశ్మీరీ పండితుల వలసల కంటే ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తంచేశారు. జైపుర్లో జరిగిన హై టీ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ
ప్రముఖ బ్రిటిష్ ఇండియన్ నటి, రచయిత్రి, నాటకకర్త మీరా సియాల్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. 64 ఏళ్ల మీరా సియాల్కు ప్రతిష్ఠాత్మక డేమ్హుడ్ అవార్డు లభించింది. కొత్త సంవత్సరాది సందర్భంగా బ్రిటన్లో కింగ్ చార్లెస్-3 ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఆమె అందించిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. లండన్లో డిసెంబరు 30న అవార్డు గ్రహీతల జాబితాను
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు యే కు ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతోంది. గత మూడేళ్లుగా తండ్రి కిమ్తో కలిసి పలు కార్యక్రమాల్లో కిమ్ జు యే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కిమ్ జు యే తాజాగా మరోసారి బహిరంగంగా కనిపించారు. తన తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం కుమ్సుసన్ స్మారకాన్ని ఆమె సందర్శించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని
కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సుధీర్ఘకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదం పరిష్కారం కోసం మరో ప్రయత్నంగా కేంద్ర జలసంఘం ఒక కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలోని ఈ కమిటీని వేసింది. ఈ కమిటీని నోటిఫై చేస్తూ కేంద్ర జల్శక్తి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులు, కృష్ణా, గోదావరి నదీ బోర్డుల ఛైర్మన్లు, ఎన్డబ్ల్యూడీఏ
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) గాను ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రతియేటా కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తేదీన సమర్పిస్తారన్న విషయం తెలిసిందే. 2017 నుంచి ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సారి కూడా అదే తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.